Featured

ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. రేషన్ ధరలు పెరగనున్నాయా..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో ఇచ్చే నిత్యావసర వస్తువుల ధరలు సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జగన్ సర్కార్ ఇప్పటికే చక్కెర రేటును పెంచగా త్వరలో కందిపప్పు రేటును కూడా పెంచబోతుందని సమాచారం. కందిపప్పు ప్రస్తుతం ఇస్తున్న రేటుతో పోలిస్తే 27 శాతం ధర పెరగనుందని తెలుస్తోంది.

జగన్ సర్కార్ రాష్ట్రంలో రేషన్ సరుకులకు మార్కెట్ ధరతో పోల్చి చూస్తే 25 శాతం మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వం రేషన్ డీలర్ల నుంచి ఇప్పటికే పెంచిన ధరల ప్రకారం డీడీలను స్వీకరిస్తోందని తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం అరకిలో పంచదార రూ.10కు ఇవ్వగా ప్రస్తుతం రూ.17కు ఇస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కందిపప్పును ప్రభుత్వం కిలో రూ.40కు ఇస్తుండగా జగన్ సర్కార్ కందిపప్పు ధరకు రూ.67కు పెంచాలని భావిస్తోంది.

జగన్ సర్కార్ ప్రతి 90 రోజులకు ఒకసారి బహిరంగ మార్కెట్ లోని ధరలను పరిశీలించి ధరలలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కందిపప్పు ధరల పెంపు గురించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలో రేషన్ బియాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. మార్చి నెల నుంచి లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేపడుతోంది.

ఈ నెల తరువాత ప్రభుత్వం ఉచిత రేషన్ ను పంపిణీ చేయదు. అయితే రేషన్ దుకాణాల్లో ఇచ్చే నిత్యావసర ధరలను పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల పెంపు విషయంలో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago