దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల మార్చి నెల 25 నుంచి బస్సు ప్రయాణాలపై ఆంక్షలు అమలయ్యాయి. అయితే అన్ లాక్ సడలింపుల్లో భాగంగా కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగించింది. అయితే కేంద్రం అనుమతులు ఇచ్చినా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఆంక్షలను తొలగించలేదు. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చాలాసార్లు చర్చలు జరిగినా ఆ చర్చలు ఫలించలేదు.
ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏపీ నుంచి హైదరాబాద్ కు పండగ బస్సులు లేనట్లేనని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం 1,61,000 కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతామని చెబుతున్నా తెలంగాణ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో దసరాకు సర్వీసులు నడపడం సాధ్యం కాదనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏపీకి రావాలనుకునే ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పటికే టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు నడవకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. కనీసం కొన్ని సర్వీసులకైనా తెలంగాణ ఆర్టీసీ అనుమతులు ఇస్తే బాగుంటుందని ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్ – కర్నూలు రూట్లలో వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో భారీగా టికెట్ రేట్లు పెరగనున్నాయి.
కరోనా, లాక్ డౌన్ వల్ల ఇప్పటికే ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ రేట్లను పెంచడం అంటే ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణ అంతర్రాష్ట్ర సర్వీసులపై పూర్తి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…