Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సెలబ్రేషన్స్.. మామూలుగా లేవుగా?
Shyam Sigha Roy: డిసెంబర్ నెలలో తెలుగులో మంచి సినిమాలు విడుదల అయ్యాయి. అందులో స్టార్ హీరోల దగ్గర నుంచి.. చిన్న హీరోల వరకు ప్రతీ సినిమా థియేటర్లలో విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసుకున్నారు. అయితే ఎన్నో అంచనాల మధ్య డిసెబర్ 17 పుష్ప పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయి.. మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
అయితే పుష్ప సినిమా ద్వారా ఏమైనా ఇబ్బంది అవుతాందా..అని ఆలోచించకుండా.. తన కథపై నమ్మకంతో క్రిస్మస్ కు ఒకరోజు ముందు థియేటర్లలోకి వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. దీనిలో నానీ హీరోగా.. డబుల్ రోల్ ప్లే చేశాడు. ఉప్పెన్ ఫేమ్ హీరోయిన్ కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి హీరోయిన్లుగా నటించారు.
అయితే ఈ సినిమా అనుకున్నట్లుగానే పాన్ ఇండియా లెవల్ లో విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. విడుదల అయిన ప్రతీ సెంటర్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తమ కథపై నమ్మకంతో విడుదల చేసిన ఈ సినిమా అనుకున్నట్లుగానే హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమాకు సంకృత్యాన్ దర్శకత్వం వహించని విషయం తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని.. దానిని దర్శకుడు ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. దీనిలో నాని, వెంకట్ బోయినపల్లి చిత్రయూనిట్కి షీల్డ్స్ను ప్రదానం చేశారు. ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మించిన విషయం తెలిసిందే .
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…