బుల్లితెరపై ప్రసారమయ్యే షో లలో బిగ్ బాస్ షో గురించి, అలాగే ఆ షో కు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతోంది. కొట్లాటలు గొడవలతో రోజుకొక విధంగా మారుతోంది. బిగ్ బాస్ కార్యక్రమంలో తాజాగా హౌస్ మేట్స్ వారి జీవితంలో జరిగిన పలు ఎమోషనల్ విషయాల గురించి పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు కంటెస్టెంట్ లో ఎమోషనల్ కూడా అయ్యారు.
మొదటగా తనే మాట్లాడుతూ ముగ్గురు అబ్బాయిలను తన తల్లి ఒక్కరే పెంచారని, ఆ కష్టము ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అంటూ తన తల్లి త్యాగాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ తరువాత జెస్సీ నాకు పుట్టుకతోనే గొంతు సమస్య ఉందని, అయినప్పటికీ నేను ఫ్యాషన్ ఐకాన్ గా ఎదిగాను. గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించాను. నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అయినా కూడా అమ్మాయి ఇప్పటికీ నా కొడుకు మోడల్ అని చెప్పుకోదు అని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత ప్రియా మాట్లాడుతూ పెళ్లి అనంతరం యాక్టింగ్ మానేశాను, ఆ తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఒక బాబు కూడా పుట్టాడు. కానీ లైఫ్ లో సెటిల్ కాలేదు అంటూ ప్రియా ఎమోషనల్ అయ్యింది. సిరి హనుమంతు మాట్లాడుతూ మా ఊరిలో తల్లి ఏమైనా పద్దతిగా ఉందా కూతురు పద్ధతిగా ఉండడానికి అని చాలామంది అన్నారు అంటూ సిరి ఎమోషనల్ అయ్యింది. ఇక చివరిగా మా ఊరి వారికి మా బంధువులకు నేను చెప్పేది ఏమిటంటే నేను పద్ధతిగానే పెరిగాను పద్ధతిగానే ఉంటున్నాను అంటూ సిరి సమాధానమిచ్చింది.
ఇక సిరి విషయానికి వస్తే ఈమె గురించి ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఒకవైపు యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో సౌత్ ఇండియా స్టార్…
‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…
టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…
అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…