మనం రోజు ఉదయం లేవగానే చేసే మొదటి పని బ్రష్ చేయడం. ఈ నేపథ్యంలోనే దంతాలను శుభ్రం చేసుకోవడానికి అనేక రకాలుగా పేస్ట్ లను వాడుతూవుంటాము. అయితే పిల్లలూ బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్ చేసుకున్న తరువాత వచ్చే ఆ నరగను మింగేస్తూ ఉంటారు. ఇంకా కొద్ది మంది పిల్లలు అయితే ఉత్త పేస్టుని తింటూ ఉంటారు. అయితే దంతాలను శుభ్రం చేయడానికి వాడే టూత్ పేస్టులు చాలా ప్రమాదకరమని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
టూత్ పేస్ట్ కడుపులోకి వెళ్లి అస్థిపంజర ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. ఈ వ్యాధి వచ్చిన తరువాత నెమ్మదిగా శరీరంలోని ఎముకలు బలహీనపడటం మొదలవుతాయి. దీంతోపాటుగా దంతాలు కూడా దెబ్బతింటాయి.న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టూత్ పేస్ట్ వాడుతున్నప్పుడు పిల్లలు మింగకుండా గమనించాలి.
టూత్ పేస్ట్ తినడం వల్ల లోపల ఫ్లోరైడ్ ఉంటుంది. దీనిని తినడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. అంతే కాకుండా అధిక ఫ్లోరైడ్ ఉన్న నీరు తాగడం వల్ల కూడా ఈ వ్యాధి సంభవిస్తుంది. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు బ్రష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దంతాలను శుభ్రం చేసుకోవడానికి బటాని గింజ అంత పేస్ట్ సరిపోతుంది. ఫ్లోరోసిస్ వ్యాధి రెండు విధాలుగా ఉంటుంది. ఇందులో మొదటిది డెంటల్ ఫ్లోరోసిస్, రెండవది అస్థిపంజర ఫ్లోరోసిస్.
ఈ పోరోసిస్ వచ్చినప్పుడు దంతాలు పసుపుగా మారడం, చేతులు కాళ్లు నొప్పులు ఉండటం, కళ్ళ చుట్టూ వాపులు రావడం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి బారిన పడకూడదు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.చిన్న పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ను ఉపయోగించండి. పిల్లలు బ్రష్ చేసుకునే టప్పుడు వారిని గమనిస్తూ ఉండాలి. అలాగే పిల్లలకు అందుబాటులో లేకుండా టూత్ పేస్ట్ ను దూరంగా ఉంచాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…