బుల్లితెరపై ప్రసారమయ్యే షో లలో బిగ్ బాస్ షో గురించి, అలాగే ఆ షో కు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతోంది. కొట్లాటలు గొడవలతో రోజుకొక విధంగా మారుతోంది. బిగ్ బాస్ కార్యక్రమంలో తాజాగా హౌస్ మేట్స్ వారి జీవితంలో జరిగిన పలు ఎమోషనల్ విషయాల గురించి పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు కంటెస్టెంట్ లో ఎమోషనల్ కూడా అయ్యారు.
మొదటగా తనే మాట్లాడుతూ ముగ్గురు అబ్బాయిలను తన తల్లి ఒక్కరే పెంచారని, ఆ కష్టము ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అంటూ తన తల్లి త్యాగాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ తరువాత జెస్సీ నాకు పుట్టుకతోనే గొంతు సమస్య ఉందని, అయినప్పటికీ నేను ఫ్యాషన్ ఐకాన్ గా ఎదిగాను. గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించాను. నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అయినా కూడా అమ్మాయి ఇప్పటికీ నా కొడుకు మోడల్ అని చెప్పుకోదు అని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత ప్రియా మాట్లాడుతూ పెళ్లి అనంతరం యాక్టింగ్ మానేశాను, ఆ తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఒక బాబు కూడా పుట్టాడు. కానీ లైఫ్ లో సెటిల్ కాలేదు అంటూ ప్రియా ఎమోషనల్ అయ్యింది. సిరి హనుమంతు మాట్లాడుతూ మా ఊరిలో తల్లి ఏమైనా పద్దతిగా ఉందా కూతురు పద్ధతిగా ఉండడానికి అని చాలామంది అన్నారు అంటూ సిరి ఎమోషనల్ అయ్యింది. ఇక చివరిగా మా ఊరి వారికి మా బంధువులకు నేను చెప్పేది ఏమిటంటే నేను పద్ధతిగానే పెరిగాను పద్ధతిగానే ఉంటున్నాను అంటూ సిరి సమాధానమిచ్చింది.
ఇక సిరి విషయానికి వస్తే ఈమె గురించి ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఒకవైపు యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.
భారతదేశంలో ఆలయ సంప్రదాయాలు ప్రాంతానికో, దేవతానికో ప్రత్యేకంగా ఉండటం సహజమే. కొన్ని చోట్ల సాధారణ పూజలు కనిపిస్తే, మరికొన్ని దేవాలయాల్లో…
ఆసుపత్రి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) చాలా కుటుంబాలకు ఆర్థిక భరోసాగా మారింది.…
వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు. అయితే దాన్ని ఎప్పుడు చేయాలి అన్నదానిపై చాలా మందిలో సందేహాలు ఉంటాయి.…
ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…
వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…
ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాచి…