తెలుగులో బిగ్ బాస్ 5 సీజన్ ఎట్టకేలకు ముగిసింది. ఇక టాప్ 5 స్థానాన్ని సంపాదించుకున్న సిరి మొదట ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తర్వాత మానస్ వెళ్లాడు. టాప్ 3 నుంచి శ్రీరామచంద్ర ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. చివరకు సన్నీ, షణ్ముక్ మధ్యలో చివరకు ఈ టైటిల్ కు సన్నీకి వరించింది. షణఖ్ రన్నరప్ గా నిలిచాడు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన సిరి ఇంటర్వ్యూలో బిజీ అయ్యారు.
ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లారంటే.. మొదట తన పేరు శిరీష అని.. కానీ తనకు సిరి అని పిలిపించుకోవడం ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ అవకాశం గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 2లో వెళ్లాల్సి ఉంది.. కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు అని చెప్పుకొచ్చింది. చివరకు బిగ్ బాస్ సీజన్ 5కు అవకాశం వచ్చిందని చెప్పింది. మొదట మిగతా కంటెస్టెంట్ తో పోల్చుకంటే.. విన్నర్ అవ్వాలని అనుకోలేదని.. కానీ టాప్ 5లో ఉండాలని అనుకున్నా అని చెప్పారు.
షణ్ముఖ్ విన్నర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు.. అని అడగ్గా.. అతడు తన ఫ్రెండ్ అని.. అతడు తనకు బాగా సపోర్ట్ చేశాడని అందుకే అతడు విన్ అవ్వాలని కోరుకున్నానన్నారు.
జెస్సీ మరి కొన్ని వారాలు ఉంటే బాగుండేదని అన్నారు. శ్రీహాన్ వచ్చి నన్ను వదిలేస్తున్నావా అని అడిగినప్పుడు.. మీరేమనుకున్నారని అడగ్గా.. అతడు నన్నుమిస్ అవుతున్నాడు అని అనిపించిందన్నారు. ముఖ్యంగా తన తల్లి వచ్చి హగ్గులు చేసుకోవద్దు అని చెప్పగానే కొద్దిగా బాధ పడ్డడానని.. తర్వాత కూడా అతడితో కనెక్ట్ అయ్యాయనని… నేను ఎలా ఉండాలో అలానే ఉన్నాన్నారు. తల్లి వచ్చి చెప్పిన తర్వాత ఒకలా.. తర్వాత ఒకలా నేను లేనని.. నేను నాలాగే ఉన్నానని.. ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లితో అర్థం అయ్యేవిధంగా చెప్పానన్నారు.
ఇక హగ్గుల గురించి మాట్లాడుతూ.. హగ్గుల వల్లనే మీకు నెగెటివిటీ వచ్చిందని.. దీనిపై మీరు ఏమంటారని అడగ్గా.. ఫ్రెండ్ షిప్ వేరు.. లవ్ వేరు అని చెప్పారు. తమ మధ్య మంచి బాండ్ ఉందని.. ఎమోషనల్ గా మాత్రమే కనెక్ట్ అయ్యామని.. దానిని బ్యాడ్ వేలో తీసుకోవద్దని చెప్పారు. దీనిపై ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పుకున్నారని.. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇక ఇంటర్వ్యూయర్ హగ్గుల గురించే మళ్లీ మళ్లీ అడుగుతుండగా.. కోపంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ వచ్చి ఇంటర్వ్యూని కంటిన్యూ చేశారు. ఏదేమైనా.. బయటకు వచ్చిన తర్వాత తనపై నెగెటివిటీ బాగా స్ప్రెడ్ అయిందని సిరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…