తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అమింజికరై రైల్వే కాలనీలో 3వ వీధికి చెందిన మహేష్ (45)కు అదే ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది. ఆ ఇల్లు గత కొన్ని సంవత్సరాల తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో ఎవరు ఉండరు. దీంతో అది శిథిలావస్థకు చేరుకుంది. ఓ రోజు ఆ ఇంటిని శుభ్రం చేయడానికి యజమాని తాళం తీసేందుకు వచ్చాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అదేంటంటే.. తాళం తీయగానే ఒక్కసారిగా అస్థిపంజరం బయటయపడింది. దీంతో ఆ కుటుంబంలో భయాందోళన మొదలైంది. వెంటనే పోలీసులు సమాచారం అందించగా.. వాళ్లు వచ్చి పరిశీలించి ఆ అస్థిపంజరం ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిదేనంటూ పోలీసులు నిర్థారించడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లభ్యమైన అస్థిపంజరం.. మహేష్ అన్న రమేష్ (49) ది అని పోలీసులు నిర్థారించారు.
అతడికి పెళ్లి కాకపోవడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉండేవాడని తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన రమేష్ రెండేళ్ల నుంచి కనిపించకుండా పోయాడని.. అతని జాడ గురించి ఎవరికీ తెలియదని పోలీసులు తెలిపారు. ఈ అస్థిపంజరాన్ని పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. డీఎన్ఏ రిపోర్టు అనంతరం ఇది ఎవరి అస్థిపంజరమో తేలుతుందని పేర్కొన్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తప్పిపోయిన అన్న ఇలా అస్థిపంజరమై కనిపించడంతో మహేష్ కన్నీరమున్నీరుగా విలపించడాడు. దీంతో ఆ వీధిలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…