తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అమింజికరై రైల్వే కాలనీలో 3వ వీధికి చెందిన మహేష్ (45)కు అదే ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది. ఆ ఇల్లు గత కొన్ని సంవత్సరాల తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో ఎవరు ఉండరు. దీంతో అది శిథిలావస్థకు చేరుకుంది. ఓ రోజు ఆ ఇంటిని శుభ్రం చేయడానికి యజమాని తాళం తీసేందుకు వచ్చాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

అదేంటంటే.. తాళం తీయగానే ఒక్కసారిగా అస్థిపంజరం బయటయపడింది. దీంతో ఆ కుటుంబంలో భయాందోళన మొదలైంది. వెంటనే పోలీసులు సమాచారం అందించగా.. వాళ్లు వచ్చి పరిశీలించి ఆ అస్థిపంజరం ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిదేనంటూ పోలీసులు నిర్థారించడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లభ్యమైన అస్థిపంజరం.. మహేష్ అన్న రమేష్ (49) ది అని పోలీసులు నిర్థారించారు.
అతడికి పెళ్లి కాకపోవడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉండేవాడని తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన రమేష్ రెండేళ్ల నుంచి కనిపించకుండా పోయాడని.. అతని జాడ గురించి ఎవరికీ తెలియదని పోలీసులు తెలిపారు. ఈ అస్థిపంజరాన్ని పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. డీఎన్ఏ రిపోర్టు అనంతరం ఇది ఎవరి అస్థిపంజరమో తేలుతుందని పేర్కొన్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తప్పిపోయిన అన్న ఇలా అస్థిపంజరమై కనిపించడంతో మహేష్ కన్నీరమున్నీరుగా విలపించడాడు. దీంతో ఆ వీధిలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
































