Sr actor Narasimharaju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. ‘నీడలేని ఆడది’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపుగా 110 సినిమాల్లో నటించారు.
ఆ సినిమాలో నేను హీరో చిరంజీవి విలన్…
జానపద సినిమాలతో బాగా పేరు అభిమానుల్స్ని సంపాదించిన నరసింహరాజు గారు, ఇక నీడలేని ఆడది వంటి సినిమాలలో కూడా మంచి నటన కనబరిచారు. ఇక అప్పట్లో నరసింహారాజు గారు దాసరి నారాయణ రావు గారి శిష్యుడుగా ఉండేవారు. ఇక అదే గ్రూప్ లో మోహన్ బాబు, ఈశ్వర్ రావు, చిరంజీవి అందరూ ఉండేవారు. పునాదిరాళ్లు, పున్నమి నాగు వంటి సినిమాల్లో వారితో కలిసి నటించారు నరసింహ రాజుగారు. అయితే అప్పటి సినిమాల్లో అందరి ఇమేజ్ దాదాపు సమానం అయినా ఒకింత నరసింహ రాజు హీరో చిరంజీవి గారు నెగెటివ్ షేడ్ లాంటి పాత్ర ఉండేవి.
ఆ తరువాత కాలంలో చిరంజీవి హీరో గా చేసిన సినిమాలో నరసింహారాజు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ‘మగధీరుడు’ సినిమాలో చిరంజీవి హీరో అయితే నరసింహరాజు గారు ఒక పాత్రలో నటించారు. కానీ దీనికి కారణం విజయ బాపినీడు గారు అడగడం వల్ల స్నేహం కొద్ది చేశారట నరసింహారాజు గారు. 1985 వరకు సినిమాల్లో చాలా బిజీగా ఉండి మంచి అవకాశాలను అందుకున్న ఆయన ఆ తరువాత రేస్ లో వెనుకబడిపోయానంటూ చెప్పారు. ఒకరిని వెళ్లి అవకాశాలు అడగాలన్నా మొహమాటం కొద్ది అడగలేక మనకు ఉన్నది చాలు కదా అని సరిపెట్టుకున్నానంటూ చెప్పారు నరసింహారాజు గారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…