Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా సందడి చేస్తున్న ఈయన అనంతరం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ వచ్చారు.ఇలా ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను ఈ ముగ్గురు ఒకే టీం గా సందడి చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.ఇలా రోజు రోజుకు సుధీర్ క్రేజ్ పెరిగిపోతూ ఉండడంతో ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా సినిమాలతో బిజీ కావటం వల్లే ఈయన బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. అయితే సుధీర్ వెళ్లిపోవడంతో సుదీర్ లేని లోటు స్పష్టంగా కనపడుతుంది.
ఈ క్రమంలోనే ఎలాగైనా సుధీర్ ఈ కార్యక్రమాలలో సందడి చేయాలని అభిమానులు కోరుకున్నారు. తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. అయితే ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ సందడి చేయడంతో ఒక్కసారిగా వేదికపై ఉన్నటువంటి రష్మీ ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా రష్మీ మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే కేవలం షో రేటింగ్ కోసమే వీరి మధ్య ఇలాంటి లవ్ ట్రాక్ క్రియేట్ చేశారని తెలిసినప్పటికీ నిజజీవితంలో కూడా వీరిద్దరూ ఒకటైతే బాగుండేదని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. అయితే చాలా కాలం తర్వాత సుధీర్ ఒక్కసారిగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోకి రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే సుధీర్ పర్మినెంట్ గా ఈ కార్యక్రమంలో కొనసాగడం కోసం వచ్చారా లేకపోతే గెస్ట్ మాదిరిగా ఈ కార్యక్రమంలో సందడి చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…