సూపర్ స్టార్ కృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత ఆరు దశాబ్దాల నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో మహేష్ బాబు, రమేష్ బాబు అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే వీరిలో మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయి సినిమాలపై దృష్టి సారించిన మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కృష్ణతో కలిసి పోరాటం అనే సినిమాలో నటించారు. ఇందులో మహేష్ బాబు కూడా నటించారు.ఈ సినిమా తర్వాత రమేష్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తనకు సినిమాలపై ఆసక్తి తగ్గిపోయిందని ఆ కారణం చేతనే తను ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారని ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణ తెలియజేశారు.
ఈ క్రమంలోనే సినిమాలకు దూరమైన రమేష్ బాబు మహేష్ బాబు సినిమా వ్యవహారాలతో పాటు, తన బిజినెస్ లను కూడా చూసుకుంటున్నట్లు తెలిపారు.గతంలో నమ్రత మహేష్ బాబు వ్యవహారాల అన్నింటినీ చూసుకుంటుందని వార్తలు వచ్చినప్పటికీ నమ్రత కేవలం పిల్లల బాధ్యతలు మాత్రమే చూసుకుంటుందని తను ఎలాంటి వ్యవహారాల్లో కలుగజేసుకోదని కృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు.
నమ్రత పిల్లలతో పాటు కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తారు. తను కోడలుగా కాకుండా కూతురిగా మాతో కలిసి పోయింది అంటూ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణ తన కొడుకు, కోడలు గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…