పైల్స్ సమస్య చాలామందిని వెంటాడుతూనే ఉంటుంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళితే వారు పడే బాధ మామూలుగా ఉండదు. తరచూ మంట, నొప్పితో సతమతం అవుతూనే ఉంటారు. కూర్చొవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ప్రయాణం చేయవలసి వస్తే మాత్రం ఆ బాధలను తట్టుకోలేక విలవిలలాడిపోతారు.
ఇవి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే.. మలబద్దకం, థైరాయిడ్, డయాబెటిస్, ఎక్కువగా కూర్చోవడం. వీటి వల్లనే ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యను చెక్ పెట్టాలంటే.. బార్లీ గడ్డి, గోధుమ గడ్డితో వాటి నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. ఎలా అంటే.. కడుపులో వికారం.. గ్యాస్, ఎసిడీటీ సమస్యలు ఉంటే.. గోధుమ గడ్డిని ఉపయోగించి వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు.
వాటితో పాటే పైల్స్ ను కూడా తగ్గించుకోవచ్చు. వాటిని క్రమం తప్పకుండా సేవిస్తే.. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. వాటిలో ఉండే.. యాంటీ యాక్సిడెంట్ల కారణంగా శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ గోధము గడ్డి, బార్లీ గడ్డి జ్యూస్ వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా సహకారం అందిస్తుంది.
మనిషి డిప్రెషన్ కు ఎక్కువగా గురైతే.. దాని బారి నుంచి కూడా బయట పడేస్తుంది. కంటి సమస్యలు, కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ లను సాధారణ జ్యూస్ లు ఎలా తయారు చేసుకుంటారో.. అలాగే చేసుకోవచ్చు. ప్రస్తుతం వర్క్ ఫ్రం చేసేవారు జాగ్రత్తగా ఉండాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…