చిరంజీవికి పోటీగా రంగంలోకి దిగిన సూర్య.. గెలుపెవరిది?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తి అయ్యింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు పోటీగా ఎవరు రంగంలోకి దిగటం లేదు.

కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు పోటీగా తమిళ హీరో సూర్య తన సినిమాని ఆచార్యకు పోటీగా పెడుతున్నారు. సూర్య ప్రస్తుతం దర్శకుడు పాండీరాజ్ తో ఎతరక్కుమ్ తునిందవన్ ఆ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు భారీగానే అంచనాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఫిక్స్ చేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా విడుదల రోజునే మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా కూడా విడుదల కానుంది. రెండు మంచి సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుండటంతో పోటీ కూడా బాగానే ఉంటుందని భావిస్తున్నారు. తెలుగులో తాజాగా ఈ సినిమాపై ఉన్న అంచనాలు దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు పోటీగా వెళ్లడం లేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా సూర్య సినిమా పోటీకి రావడం అందరికీ షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆచార్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.