హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస ప్లాప్ సినిమాలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈయన నటించిన నాలుగైదు చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో శర్వానంద్ తన ఆశలన్నీ తన తదుపరి చిత్రాల పెట్టుకున్నారు. ప్రస్తుతం శర్వా ఉన్న పరిస్థితులలో అతనికి ఒక సూపర్ హిట్ అంతేతప్ప ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేడు.
ఈ క్రమంలోనే తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన మహా సముద్రం సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే శర్వానంద్ డ్రీమ్ వారియర్స్ పిక్చర్ నిర్మాణసంస్థలో ఒకే ఒక జీవితం అనే సినిమాలో నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాను థియేటర్లో కాకుండా మేకర్స్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.థియేటర్లో విడుదల చేయటం వల్ల ఈ సినిమా అనుకున్నంత కలెక్షన్లను సాధించలేదన్న కారణంతో మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా ఓటిటీలో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇలా ఈ సినిమాని థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తే నిర్మాణ సంస్థ హీరో శర్వానంద్ పై నమ్మకం లేకే ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తే హీరో శర్వానంద్ అవమానించినట్లే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శర్వానంద్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తే మరోసారి డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే ఇందులో క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…