Tag Archives: aditya 369

Flash Back : ఆ సంవత్సరం బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడిన ఈ స్టార్ హీరోల్లో ఎవరు ముందంజలో నిలిచారో తెలుసా.?!

Flash Back : ఆ సంవత్సరం(1991) బాక్సాఫీస్ వద్ద చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ పోటీ పడ్డారు. శత్రువు 1991లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఇది కోడి రామకృష్ణ దర్శకత్వం వహించింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై MS రాజు నిర్మించారు. ఇందులో వెంకటేష్, విజయశాంతి మరియు కోట శ్రీనివాసరావు నటించగా రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే వెంకటేష్ లాయర్‌గా నటించాడు. తనను ఆదరించి, న్యాయవాదిగా తీర్చిదిద్దిన ఓ నిజాయితీ పరుడైన లాయర్‌ను కొందరు దుర్మార్గులు దారుణంగా చంపేస్తారు.. వాళ్లను అంతమొందించడానికి హీరో ఎప్పటికప్పుడు కొత్త పథకం వేస్తూ ఉంటాడు. దానిని ఛేదించి, అతణ్ని చట్టానికి పట్టించాలనే ప్రయత్నంలో ఒకప్పటి అతని ప్రేయసి ఏసీపీగా వచ్చిన విజయశాంతి ఉంటుంది. కానీ తాను అనుకున్నది సాధించిన తర్వాత.. శత్రువులను అందర్నీ చంపేసిన తర్వాతే చట్టానికి లొంగిపోతాడు హీరో.

ఆదిత్య 369, 1991లో విడుదలైన తెలుగు సినిమా.బాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం, ఇంకా హెచ్.జి.వెల్స్ టైం మెషీన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది.
1 కోటి అరవై లక్షల ఖర్చు అయిన ఈ సినిమా చిత్రీకరణకు సుమారు 110 రోజులు పట్టింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సెట్స్ ను హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేశారు. ఇంకా మద్రాసు లోని గోల్డెన్ బీచ్, విజయ వాహిని స్టూడియోస్ లో కూడా కొంత భాగం చిత్రీకరించారు. అడవిలో సన్నివేశాలు తిరుపతికి సమీపంలోని తలకోన అడవుల్లో చిత్రీకరించారు.

“గ్యాంగ్ లీడర్ ” 1991లో విడుదలైన యాక్షన్ క్రైమ్ చిత్రం, ఇది విజయ బాపినీడు రచన మరియు దర్శకత్వం వహించింది మరియు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి మరియు విజయశాంతి నటించగా, రావు గోపాల్ రావు, ఆనందరాజ్, మురళీ మోహన్ మరియు శరత్ కుమార్ సహాయక పాత్రలు పోషించారు. ప్రభుదేవా డ్యాన్స్ కొరియోగ్రఫీతో సౌండ్‌ట్రాక్‌ను బప్పి లాహిరి కంపోజ్ చేశారు. ఈ చిత్రం సంఘ వ్యతిరేక ప్రవర్తన ద్వారా చట్టాన్ని అమలు చేసేవారిని దోపిడీ చేసే భావనలను అన్వేషిస్తుంది.

ఈ చిత్రం విమర్శకుల నుండి అత్యంత సానుకూల సమీక్షలను పొందింది మరియు బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఆ తర్వాత అదే టైటిల్‌తో తమిళంలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రం తరువాత హిందీలో ఆజ్ కా గూండా రాజ్ (1992)గా రీమేక్ చేయబడింది. అయితే…వెంకటేష్ హీరోగా నటించిన శత్రువు చిత్రం హిట్ అవగా, బాలయ్య నటించిన ఆదిత్య 369 సూపర్ హిట్ అయింది. అదేవిధంగా చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Time Travel Movies: బాలయ్య ఆదిత్య 369 నుంచి కళ్యాణ్ రామ్ బింబిసారా వరకు వచ్చిన టైం ట్రావెల్ సినిమాలివే?

Time Travel Movies: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే టైం ట్రావెల్ నేపథ్యంలో నిర్మించాలంటే భారీ బడ్జెట్ తో కూడుకోవడమే కాకుండా, స్క్రిప్ట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో సినిమాలు టైం ట్రావెల్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే ఇలా టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే…

ఆదిత్య 369: సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన టైం ట్రావెల్ చిత్రం ఆదిత్య 369. ఈ సినిమా ద్వారా శ్రీకృష్ణదేవరాయల కాలంతో పాటు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా చూపించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఫన్ 2 ఇష్: పరేష్ రావల్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాలో అందులో పాత్రలో వేరే కాలానికి వెళతాయి. ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది.

లవ్ స్టోరీ 2050: 2008లో తెరకెక్కిన ఈ సినిమా 2050 టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా పరవాలేదనిపించుకుంది.

యాక్షన్ రిప్లై: అక్షయ్ కుమార్ ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన ఈ సినిమా కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా మోస్తారు విజయాన్ని సొంతం చేసుకుంది.

బార్ బార్ దేఖో: సిద్ధార్థ మల్హోత్రా కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రం కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాతో పాటు విష్ణు విశాల్ ఇండ్రు నేట్రు నాలై, శ్రీ, సూర్య 24, తేజ సర్జ,శివాని రాజశేఖర్ జంటగా నటించిన అద్భుతం సినిమా కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది.

Time Travel Movies: భారీ బడ్జెట్ చిత్రాలు…

బింబిసారా: తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుందని చెప్పాలి. ఇలా ఈ సినిమాలన్నీ కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినవే.

భోజనం సమయంలోనూ కిరీటం తీయని బాలయ్య.. ఎందుకంటే?

సింగీతం శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అతడు సెట్ చేసిన ట్రెండ్ ను చాలమంది ఫాలో అయ్యేవారు. మొదట అతడు నందమూరి తారకరామారావు నటించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. మొదట అతడు ‘మాయాబ‌జార్‌’ తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అతడి దర్శకత్వంలో తన టాలెంట్ ను నిరూపించుకున్న సినిమా పుష్పక విమానం. అతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ తో ఎలాగైనా సినిమా చేయాలని అనుకున్నారట.

కానీ అది నెరవేరలేక పోయినా.. అతడి వారసుడితో సినిమా తీశాడు. అదే.. ‘ఆదిత్య 369’, ‘భైర‌వ ద్వీపం’ సినిమాలు తీసి.. క్లాసిక్స్ గా తనకు తిరుగులేదంటూ నిరూపించుకున్నారు. ఆ సినిమాలు తీస్తున్న క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ లో ఉన్న లక్షణాలు బాలయ్యలో ఉన్నాయంటూ చెబుతుండేవారు. పౌరాణిక చిత్రం తీస్తున్న క్రమంలో అతడు ధరించిన ఆభరణాలను షూటింగ్ అయిపోయేవరకు కూడా తీసేవారు కాదట ఎన్టీఆర్.

అలాంటి లక్షణం బాలయ్యకు కూడా వచ్చిందంటూ.. చెప్పుకొచ్చాడు సింగీతం శ్రీనివాసరావు. శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు పాత్ర వేస్తున్న టైంలో బాలయ్య ఆ కిరీటం ఎంత ఇబ్బంది కలిగిస్తున్నా అలాగే ఉంచేవారని చెప్పాడు. భోజనం చేస్తున్న సమయంలో కూడా కిరీటం తీసేవారు కాదని, అలా తీస్తూ మరి వాటిని ధరించడానికి ఆలస్యం అవుతుందన్న కారణంతో వాటిని అలాగే ఉంచుకునే వారని సింగీతం శ్రీనివాస్ తెలియజేశారు.

ఓ రోజు ఆదిత్య 369 సినిమా షూటింగ్ లో లైటింగ్ సెట్ చేయడానికి ఎక్కువ సమయం పట్టేది. ఆ సమయంలో బాల‌కృష్ణ‌ను కాస్త ఆలస్యంగా రమ్మని డైరెక్టర్ చెప్పగా.. అతడు ఇంటి దగ్గరే ఉన్నాడు. అప్పడు ఎన్టీఆర్ ఏంటి.. ఈ రోజు షూటింగ్ లేదా అని అడగ్గా.. డైరెక్టర్ లేటుగా రమ్మాన్నరని చెప్పాడట. అయితే దానికి ఎన్టీఆర్ నిర్మాత మనకు డబ్బులు ఇస్తున్నది.. ఉదయం నుంచి సాయంత్రం వారకు వాళ్లకు అందుబాటులో ఉండటానకి కానీ ఇలా ఇంటి దగ్గర ఉండటానికి కాదంటూ అనడంతో అప్పటి నుంచి అతడు ఇలా షూటింగ్ లోనే ఎక్కువ సమయం గడిపేవారు అంటూ సింగీతం శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు.

చిరంజీవి చెల్లెలిగా నటించడం వల్లే ఈ హీరోయిన్ అవకాశాలు కోల్పోయిందా?

సినిమా ఇండస్ట్రీలో సుమారు 100 సినిమాలకు పైగా నటించి ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని పొందిన హీరోయిన్ మోహిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదిత్య 369 సినిమా ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న మోహిని పెళ్లయిన తర్వాత ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని, ఆమెకు చేతబడి చేశారని వెల్లడించారు.ఈ క్రమంలోనే ఆమె మానసిక పరిస్థితి బాగాలేక రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించినట్లు ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

చాలా రోజుల నుంచి మీడియాకు దూరంగా ఉన్న మోహిని తాజాగా మీడియా ముందుకు వచ్చి తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు తెలియజేశారు. ఈ క్రమంలోనే తన కెరీర్ గురించి మాట్లాడుతూ. తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి కారణం చిరంజీవి గారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు గా నటించాక ఆమెకు అవకాశాలు తగ్గాయని తెలిపారు.

హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించిన తర్వాత చిరంజీవి గారు నువ్వు చెల్లెలుగా నటించవద్దని చెప్పినట్లు తెలిపారు. ఆ సమయంలో హీరోయిన్ సుహాసిని తానుకూడా చిరంజీవి సరసన హీరోయిన్ గా, చెల్లెలు పాత్రలో నటించానని చెప్పి చిరంజీవి గారిని ఒప్పించినట్లు తెలిపారు.

సుమారు 100 సినిమాలకు పైగా నటించిన మోహిని పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవ్వడమే కాకుండా ఎన్నో మానసిక సమస్యలతో సతమతమైనట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మోహినికి ఎవరో చేతబడి చేశారని చేతబడి కారణంగానే అమే వింతగా ప్రవర్తించేదని ఆ సమస్య నుంచి తనని ఏసుప్రభు రక్షించాడని తెలిపారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మోహిని ఈ విధంగా ఏసుప్రభు ని నమ్మి కేథలిక్ గా మారారు. అదేవిధంగా తన పేరును మోహిని నుంచి క్రిస్టియానాగా మార్చుకోవడం విశేషం.