Tag Archives: akhil

నెలకు జీతం చొప్పున దర్శకుడిగా పనిచేశాడా.. మరీ అంత చీప్ గా ఎందుకు..?

ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే.. అందులో నటించిన నటులకు, దర్శకుడికి పెద్ద ఎత్తున పేరు వస్తుంది. తర్వాత సినిమాలు అనేవి క్యూ కడతాయి. వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. అయితే అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాను పెద్ద హిట్ గా తీసిన భాస్కర్.. సంచలన హిట్ ను సాధించాడు. ఆ తర్వాత భాస్కర్ పేరే.. బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది.

తర్వాత వచ్చిన పరుగు సినిమా కూడా బంపర్ హిట్ సాధించింది. ఈ రెండు సినిమాలు అతడి కెరీర్ ను ఓ మలుపు తిప్పాయి. ఇలా అతడు తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ ను మూటగట్టుకుంది. దానిని అన్నీ తానై నడిపించిన నాగబాబుకు ఆ సినిమా తర్వాత అప్పలు పాలయి.. ఆత్మహత్యకు ఈ సినిమా అప్పులు దారి తీశాయనే విమర్శ ఉంది.

ఆ సినిమా భాస్కర్ కు కెరీర్ లో పెద్ద దెబ్బ పడింది. తర్వాత అతడి వద్దకు సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అంత ధైర్యం కూడా చేయలేదు. మధ్యలో ఒంగోలు గిత్త సినిమా తీసినా అంత పెద్ద హిట్ కొట్టలేకపోయింది. దీంతో అతడు సినిమాలకు చాలా దూరం అయ్యాడు. ఇక చాలా రోజుల తర్వాత అతడికి అల్లు అరవింద్ అవకాశాన్ని కల్పించాడు.

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు అతడు నెలకు రూ.2లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకొని వర్క్ చేశాడట. జీతం తీసుకొని అతడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా హాట్ టాక్ వచ్చింది. మరి బొమ్మరిల్లు భాస్కర్ కు ఇప్పుడైనా రెమ్యూనరేషన్ ఇస్తుందో లేదో చూడాలి.

అఖిల్ విషయంలో ఎంతో బాధపడ్డా.. అఖిల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున..!

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పుడే సిసింద్రీ సినిమా ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్న అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలలో నటించలేదనే చెప్పాలి. ఇదిలా ఉండగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా దసరా కానుకగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబం ఎంతో సంతోషంలో ఉన్నారు. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ అఖిల్ బ్యాచిలర్ సినిమాలు విజయవంతం కావడంతో అక్కినేని కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అఖిల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

అఖిల్ కడుపులో ఉన్నప్పుడు నాగార్జున అమలను అమెరికా తీసుకెళ్లి తనకు పరీక్షలు చేయించగా తనకు కూతురు పుడుతుందని డాక్టర్లు చెప్పడంతో నాగార్జున ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా డాక్టర్లు కూతురు పుడుతుందని చెప్పడంతో ముందుగానే కూతురు కావలసిన గౌన్లు, బొమ్మలను తెచ్చి పెట్టుకున్నారని తీరా డెలివరీ తర్వాత తనకు పాప కాదు బాబు పుట్టాడని తెలియడంతో నాగార్జున బాధపడినట్లు తెలిపారు.

తమకు పాప పుడితే నికిత అనే పేరు పెట్టాలని,తన పేరును కూడా ముందుగానే డిసైడ్ అయినట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాగార్జున తెలియజేశారు. అయితే నికిత ప్లేస్ లో అఖిల్ పుట్టాడని ఈ సందర్భంగా నాగార్జున తెలియజేశారు.

విరాట్ బయోపిక్ లో అఖిల్.. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ!

అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా అక్టోబర్ 15 వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో అఖిల్ పాల్గొంటున్నారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అఖిల్ నటిస్తున్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి మాట్లాడటమే కాకుండా తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తెలిపారు. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం అన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు క్రీడల బయోపిక్ సినిమాలంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలిపారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో రణవీర్ సింగ్ దీపికా పదుకొనే నటించిన 83 సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, ఈ సినిమా కపిల్ దేవ్ జీవిత ఆధారంగా తెరకెక్కి ఉండడంతో ఈ సినిమాపై ఎంతో ఆతృత ఏర్పడిందని తెలిపారు. ఈక్రమంలోనే తనకి కూడా ఏదైనా క్రీడల బయోపిక్ చిత్రాలలో నటించాలని ఉందన్న విషయాన్ని బయటపెట్టారు.

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ తనకు ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాలో నటించాలని ఉందని తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.విరాట్ కోహ్లీ జీవితం క్రికెట్ పై ఫ్యాషన్ తో, చాలా అగ్రెసివ్ గా ఉంటుందని ఈ సందర్భంగా అఖిల్ తెలిపారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాపై అటు అఖిల్,ఇటూ బొమ్మరిల్లు భాస్కర్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారని చెప్పవచ్చు.

నాగార్జున నుంచి నాగచైతన్య వరకు విడాకుల గోల.. ఏమైంది అక్కినేని ఫ్యామిలీకి..!

అక్కినేని ఫ్యామిలీకి ఏమైంది. ఎందుకు ఇలా వైవాహిక బంధం బ్రేకప్, విడాకుల వరకు వెళ్తున్నాయి. ముందునుంచి కూడా ఆ ఫ్యామిలీలో లైఫ్ పార్టనర్ విషయంలో వివాదాలు ఎదుర్కొన్నారు. తాజాగా సమంత, నాగచైతన్య విడాకులను చైతు, సమంత అధికారికంగా ప్రకటించారు. తాము విడాకులు తీసుకున్నట్లు సమంత, నాగచైతన్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు. దీంతో ఒక్కసారిగా అభిమానుల షాక్ అయ్యారు.

గత నెల రోజుల నుంచి వస్తున్న వార్తలను నిజం చేసేశారు. అందుకే ఈ విషయమై ఎన్నిసార్లు ప్రస్తావించినా అధికారికంగా ఇంతవరకు సమాధానం చెప్పలేదని అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులకు మింగుడు పడటం లేదు. ఇదిలా ఉండగా.. ఇలా అక్కినేని ఫ్యామిలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఒక పెద్ద వృక్షంలా అవతరించింది.

ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున, అమల, సుమంత్‌, సుశాంత్‌, సుప్రియ, నాగచైతన్య, అఖిల్‌ సినిమా రంగంలో ఉన్నారు. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోను ఎన్నో షూటింగ్ లు, టీవీషోలు, ఈవెంట్లు, సినిమా ఓపెనింగ్ లకు కేరాఫ్ గా నిలిపారు. సినిమా రంగంలో ఇంత విజయవంతంగా రాణిస్తున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ బ్రేకప్ లు, విడాకులు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. మొదట్లో నాగార్జున దగ్గర నుంచి ప్రస్తుతం నాగచైతన్య వరకు అందరూ విడాకుల విషయంలో ఇబ్బంది పడినవారే.

ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున, అమల, సుమంత్‌, సుశాంత్‌, సుప్రియ, నాగచైతన్య, అఖిల్‌ సినిమా రంగంలో ఉన్నారు. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోను ఎన్నో షూటింగ్ లు, టీవీషోలు, ఈవెంట్లు, సినిమా ఓపెనింగ్ లకు కేరాఫ్ గా నిలిపారు. సినిమా రంగంలో ఇంత విజయవంతంగా రాణిస్తున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ బ్రేకప్ లు, విడాకులు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. మొదట్లో నాగార్జున దగ్గర నుంచి ప్రస్తుతం నాగచైతన్య వరకు అందరూ విడాకుల విషయంలో ఇబ్బంది పడినవారే.

మొదట నాగార్జునతోనే విడాకుల ప్రస్తావన మొదలైందనే చెప్పాలి. మొదట 1984 లో విక్టరీ వెంకటేష్ సోదరి దగ్గుపాటి లక్ష్మీని వివాహం చేసుకున్న నాగార్జున తర్వాత వీళ్లకు నాగచైతన్య జన్మించాడు. నాగార్జున సినీ పరిశ్రమలో రాణిస్తుండటం.. లక్ష్మీ వైద్యురాలిగా రాణిస్తుండటంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం.. వృత్తి పరంగా వేర్వేరుగా ఉండటంతో ఆరేళ్ల తర్వాత విడిపోయారు. తర్వాత నాగార్జున అమలను ప్రేమించి 1992లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అఖిల్‌ జన్మించారు. తర్వాత అమలు సినిమాలు తగ్గించి.. సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతూ వస్తోంది.

అక్కినేని నాగేశ్వరరావు పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు సుమంత్ కుమార్. ఇతని విషయానికి వస్తే.. అతడు తెలుగు హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కీర్తి రెడ్డి తొలిప్రేమ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే. 2004లో వీరి వివాహం జరగ్గా.. రెండేళ్లకి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సుమంత్‌ సింగిల్ గానే ఉన్నాడు.

నిర్మాత, నటిగా ఉన్న సుప్రియ యార్లగడ్డ సైతం వివాహ జీవితం వివాదంగా మారింది. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించి.. ఇష్టం సినిమాలో హీరో చరణ్ రెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. 2012 లో అతడికి గుండెపోటు వచ్చి చనిపోయాడు. కానీ అంతకంటే ముందే వీరిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని.. డైవర్స్‌ తీసుకునేందుకు సిద్ధమయ్యారని, ఇంట్లో గొడవల వల్లే మెంటల్‌గా డిస్ట్రర్బ్ అయిన చరణ్‌ రెడ్డి హార్ట్ ఎటాక్ కి గురైనట్టు వార్తలొచ్చాయి. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. అప్పటి నుంచి సుప్రియ కూడా సింగిల్ గాను ఉన్నారు.

ఇక నాగచైతన్య తమ్ముడు అఖిల్ విషయానికి వస్తే.. వివాహానికి సంబంధించి పెద్ద వివాదంగా మారింది. శ్రియా భూపాల్‌తో నాలుగేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ల పెళ్లి పీటల దాకా రాలేదు. ప్రస్తుతం నాగచైతన్య పరిస్థితి కూడా ఇలానే అవ్వడంతో ఆ ఫ్యామిలీకి ఏమయిందో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.

‘వివాహ జీవితం బాగుండాలి అంటే.. కెరీర్ బాగుండాలి’.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్ విడుదల..

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. దీనిలో అఖిల్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు కాగా.. దీనికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం సక్సెస్ ఇచ్చేలా అంచనాలు పెంచింది ట్రైలర్. లవ్‌, కామెడీ అంశాలతో ఆసక్తిగా రేకెత్తించగా.. అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది. మన లైఫ్ పార్ట్‌నర్‌తో కనీసం 9000 నైట్స్ కలిసి పడుకోవాలి. వందల వెకేషన్స్‌కు వెళ్లాలి. అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి.

అలాంటి వాడు ఎవడు అనే పూజా హెగ్దే ప్రశ్నతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘ఒక అబ్బాయి లైఫ్‌లో 50 పర్సెంట్ కెరీర్, 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి’ అనే అఖిల్ డైలాగ్ వెంటనే వస్తుంది. ఈ రెండు డైలాగ్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మ్యారీడ్‌ లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ హృదయాన్ని తాకేలా ఉన్నాయి.

ఇక పూజా హెగ్డే, అఖిల్ కు పూర్తి భిన్నంగా ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇక ట్రైలర్ మధ్యలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా, ఈషా రెబ్బా కనిపించారు. ఇందులో కాస్త కామెడీ, కాస్త రొమాన్స్‌ను ట్రైలర్‌లో చూపించారు. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది.. కానీ వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు దీనిని అక్టోబర్ 15 న దసరా కానుకగా విడుదల చేయనున్నారు.

ఆస్తుల విషయంలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న నాగార్జున… అందుకు సాక్ష్యం ఇవే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నవమన్మధుడుగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా చేస్తున్నప్పటికీ వారికి పోటీగా నాగార్జున సినిమాలు చేయటం విశేషం.అయితే ఈ మధ్యకాలంలో నాగార్జున నటించిన సినిమాలు కాస్త వెనుకపడినప్పటికీ, ఆస్తుల విషయంలో, సంపాదనలో మాత్రం నాగార్జున నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారని చెప్పవచ్చు.

ప్రస్తుతం నాగార్జున కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పలు వెబ్ సిరీస్ ను నిర్మించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడానికి కూడా నాగార్జున సిద్ధమైనట్టు తెలుస్తోంది. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం, బిగ్ బాస్ ద్వారా హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునకు స్టార్ మా భారీ మొత్తంలోనే ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా నాగార్జున పెద్ద మొత్తంలో డబ్బును సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.మరోవైపు స్టాక్ మార్కెట్లు, స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా నాగార్జున ఆస్తులు ఉన్నఫలంగా పెరగడంతో నాగార్జున సొంతంగా ఛార్టెట్ ఫ్లైట్ ని కూడా కొన్నట్లు తెలుస్తోంది. తన అవసరాలకు వినియోగించుకుని ఖాళీ సమయంలో ఈ ఫ్లైట్ ను అద్దెకి ఇవ్వనున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఆస్తుల విషయంలో సంపాదనలు నాగార్జున గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.

ఇక సినిమాల విషయానికి వస్తే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి టాక్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సీక్రెట్ ‘రా’ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారు. ఇంకోవైపు ‘బంగార్రాజు’ సినిమాను త్వరలో ప్రారంభించినట్లు తెలుస్తోంది.