Tag Archives: alitho saradaga

Regina Cassandra: స్వీట్ తినడం కోసం అలాంటి అబద్ధం చెప్పిన రెజీనా.. చెప్పక తప్పలేదంటూ షాకింగ్ కామెంట్స్?

Regina Cassandra: రెజీనా కసాండ్రా ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు తెలుగులో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరమయ్యారు. ఇకపోతే తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా అందరిని సందడి చేశారు.

ఇకపోతే ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న రెజినా తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ… తన జీవితంలో జరిగిన వింత అనుభవాలను బయటపెట్టారు. అయితే ఒక రోజు రాత్రి 11 గంటలకు సమయంలో తనకు మిస్టి దోయ్ స్వీట్ తినాలనిపించిందట.అయితే ఆ సమయంలో స్వీట్ తినడం కోసం బయటకు వెళితే ఎక్కడ కూడా స్వీట్ షాప్స్ ఓపెన్ లో లేవని తెలిపారు. అయితే ఒక స్వీట్ షాప్ మూసేస్తున్న సమయంలో షాపు ఓనర్ దగ్గరికి వెళ్లి తనకు స్వీట్ కావాలని అడిగారట.

ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను…

ఈమె 11 గంటల సమయంలో స్వీట్ షాప్ కి వెళ్లి అడగడంతో తాను ఇప్పుడు షాప్ క్లోజ్ చేస్తున్నానని ఇవ్వడం కుదరదని చెప్పారని, అయితే స్వీట్ తినడం కోసం ఆ సమయంలో ఒక పెద్ద అబద్ధం ఆడానని తెలిపారు. తాను ప్రెగ్నెంట్ అని,తనకు స్వీట్ తినాలనిపిస్తుందని చెప్పడంతో ఆ వ్యక్తి తనకు స్వీట్ ఇచ్చారని, ఈ విధంగా స్వీట్ తినడం కోసం తాను ప్రెగ్నెంట్ అనే అబద్ధం చెప్పానని రెజినా ఈ సందర్భంగా బయట పెట్టారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పెద్ద అందగత్తె కాదని ఎగతాళి చేసారు.. ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నా : నటి ఆమని

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జంబలకడిపంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి ఆమని ఆ తర్వాత శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం వంటి చిత్రాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ప్రస్తుతం తన రెండవ ఇన్నింగ్స్ తల్లి పాత్రల ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఆమని మరొక హీరోయిన్ ఇంద్రజతో కలిసి బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమని కెరియర్ మొదట్లో తను ఎదుర్కొన్న అవమానాలను గురించి ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో కాస్త వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా ఆమనీ మాట్లాడుతూ.. తనకు దొంగతనం చేసిన మామిడి పండ్లు తినడం ఎంతో ఇష్టమని ఈ విధంగా తన ఇష్టాఇష్టాలను తెలిపారు. అదే విధంగా తనకు ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సినిమాలంటే ఎంతో పిచ్చని, అప్పుడే శ్రీదేవి, జయసుధ జయప్రద వంటి తారలను చూస్తూ పెరిగానని,ఆమని తెలిపారు.

ఇక పెద్దయిన తర్వాత తనకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో తన కుటుంబ సభ్యులు తనని చూసి హేళన చేశారని.. నలుగురితో సరిగ్గా మాట్లాడటం రాదు నువ్వు సినిమాలలో ఏం నటిస్తావు? పైగా పెద్ద అందగత్తెవి కూడా కాదని తన కుటుంబ సభ్యులు అనడంతో ఆ సమయంలో చాలా బాధ పడ్డానని ఈ సందర్భంగా ఆమని తెలియజేశారు. ప్రస్తుతం ఈమె సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడమే కాకుండా బుల్లితెరపై ముత్యమంతా ముద్దు అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

నేను సినిమాల్లో నటించడం నా భర్తకు ఇష్టం లేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిహారిక..!

మెగా డాటర్ నిహారిక కొణిదెల.. సినిమాల్లోనూ, వెబ్ సిరీసుల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆమె కొన్ని రోజుల కిందట వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె నిర్మాతగా అవతరించి.. తన సత్తాను చాటుకుంటున్నారు. తాజాగా ఆమె ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

హీరోయిన్లకు పెళ్లైన తర్వాత కెరీర్ విషయంలో చేంజ్ లేదని.. దానికి ఉదాహరణగా సమంతను చెప్పారు. ఆమెకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా ఆమెకు విపరీతంగా ఆఫర్లు వచ్చాయి. పెళ్లికి ముందు ఎంత డిమాండ్ ఉందో.. పెళ్లి తర్వాత కూడా అంతే ఉందంటూ చెప్పుకొచ్చారు.

ఇక తనకు యాక్టర్ గా స్పూర్తి.. మెగస్టార్ చిరంజీవి అంటూ చెప్పారు. ఇక తాను సినిమాల్లో నటించలేకపోవడానికి గల కారణాన్ని కూడా చెప్పారు. తన భర్త చైతన్యకు సినిమాల్లో నటించడం ఇష్టంలేదని.. అందుకే తాను సినిమాలో నటించడం లేదంటూ చెప్పారు. ఇక సినిమాలు కాకుండా ఏదైనా చేయాలనే ఆలోచనతోనే తాను ‘టీచ్ ఫర్ ఇండియా’ అనే కార్యక్రమం ప్రారంభించానని.. అందులో పిల్లలకు పాఠాలు చెపుతున్నానని అన్నారు.

ఇన్ని చేసినా సినీ ఇండస్ట్రీపై ప్రేమ తగ్గకపోవడంతో.. ప్రొడక్షన్ మొదలు పెట్టానన్నారు. ఇటీవల జీ తెలుగులో వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ విడుదలై మంచి పేరు సంపాదించుకుంది.. ఆ సిరీస్ ప్రొడక్షన్ తానే చేసినట్లు చెప్పారు. అంతే కాకుండా నాన్న కూచీ, ముద్దపప్పు ఆవకాయ్ వంటి వెబ్ సిరీలను కూడా తీశానన్నారు. ఇక తర్వలో యూట్యూబర్ నిఖిల్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు.

గతం తలిస్తే కన్నీళ్ళొస్తున్నాయ్.. లారీ క్లీనర్ ఒక అమ్మాయిని రేప్ చేస్తే అంటూ?

కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీలో తనకంటూ ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అటు సినిమాల్లో నటిస్తూ .. ఇటు బుల్లితెరపై కూడా రాణిస్తున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న ‘అలీతో సరదాగా ప్రోగ్రాం’ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. దీనిలో పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇంటర్వ్యూలకు పిలిచి తన కామెడీతో వ్యక్తిగత విషయాలను రాబడతుంటాడు.

ఇలా వాళ్లతో సరదాగా సంభాషిస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. ఇలా వారానికి ఒక రోజు ఒక సెలబ్రిటీతో సరదాగా కాసేపు అన్నట్లు వ్యవహరిస్తాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల అతడి ప్రోగ్రాంకు సంబంధించిన ఒక ప్రోమో విడుదల అయింది. అందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కనిపించారు. అలీతో మోహన్ బాబు జీవితంలో ఎదురైన కష్టాలను వివరిస్తూ తను పడ్డ ఇబ్బందులను వివరిస్తాడు. తన తల్లికి వినికిడి లోపం ఉందని.. తాము నలుగురం అన్నదమ్ముళ్లం అని.. తమను పోషించడానికి ఎన్నో కష్టాలు పడ్డారని మోహన్ బాబు చెప్పుకొస్తాడు.

సినిమాలోకి రావాలని ఉన్న సమయంలో ఎంతో మంది హేలన చేశారని కూడా అతడు చెప్పాడు. తాను కనపడే అంత హార్డ్ పర్సన్ కాదని.. చాలా సెన్సెటివ్ మైండ్ ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా తన తదుపరి చిత్రానికి సంబంధించి సినిమాలో ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను ప్రేక్షకుల కోసం చెప్పాడు.

అదేంటంటే ‘‘లారీ క్లీనర్ ఒక అమ్మాయిని రేప్ చేస్తే 24 గంటల్లో ఎన్కౌంటర్ చేస్తారు.. మనం శభాష్ అని చప్పట్లు కొడతాం.. అదే బడా బాబులు వాళ్లకి పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు.. దట్ ఈజ్ అవర్ ఇండియా’’ అంటూ ఇటీవల జరుగుతున్న అత్యాచారాలకు రిలేటివ్ గా ఉన్న ఆ డైలాగ్ ను చెబుతాడు. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారగా.. పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మంచు మనోజ్ తో గొడవలు.. అతడు వేరుగా ఉంటాడంటూ మంచు విష్ణు క్లారిటీ..

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్న హోదా గురించి అందరికీ తెలిసిందే. డైలాగ్ కింగ్ మోహన్ బాబే కాకుండా తన వారసులను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అంతేకాకుండా వారికి ఓ మంచి గుర్తింపును అందించాడు. ఇక మంచు ఫ్యామిలీ నుండి మంచు లక్ష్మి తొలి హీరోయిన్ గా పరిచయం కాగా మనోజ్, విష్ణు లు కూడా హీరోలుగా పరిచయమయ్యారు. ఇక మంచు లక్ష్మి ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలవలేకపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే మంచు మనోజ్ గురించి షాకింగ్ కామెంట్ చేశాడు విష్ణు.

ఇక ఈ కుటుంబం ఏదో ఒక విషయంలో నెట్టింట్లో బాగా వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా విష్ణు చేసిన కామెంట్స్ కూడా బాగా వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న రియాలిటీ షో ఆలీతో సరదాగా గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఆలీ హోస్టింగ్ చేయగా.. తాజాగా ఈ షోకు మంచు విష్ణు గెస్ట్ గా పాల్గొన్నాడు. ఇక తన వ్యక్తిగత విషయాల గురించి బాగా పంచుకున్నాడు విష్ణు. ఆలీ అడిగిన ప్రశ్నలకు తెగ సమాధానాలు చెప్పాడు.

ఇక తన తమ్ముడు మంచు మనోజ్ గురించి ఓ విషయాన్ని నేరుగా అడిగాడు ఆలీ. మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయంటూ.. అసలు మీ ఇద్దరికీ దేని వల్ల గొడవలు వచ్చింది.. అసలేం జరిగింది అని ప్రశ్నించాడు. ఇక ఈ ప్రశ్నకు మంచు విష్ణు వెంటనే సీరియస్ అయినట్లు కనిపించాడు. తను వేసుకున్న కోటును విప్పేస్తూ మా పర్సనల్ విషయాలు వాళ్లకి ఎందుకు అంటూ మండిపడ్డాడు.

మా మధ్య ఎటువంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు. నేను, మా అక్క, మా తమ్ముడు వేరుగా ఉంటున్నాం తప్ప మా మధ్య ఎటువంటి గొడవలు లేవని.. ఎటువంటి పుకార్లకు సమాధానం చెప్పను అంటూ తెలిపాడు విష్ణు.

క్లాప్ బోర్డ్ కింద పెట్టడంతో రేలంగి పై చేయి చేసుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ రేలంగి నరసింహారావు ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న రేలంగి నరసింహారావు తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన సినీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమంలో కి ఎంటరైన రేలంగి గారికి అలీ సాదర స్వాగతం పలికారు. ఈ విధంగా కార్యక్రమానికి ఎంటరైన రేలంగి నరసింహారావు గారితో మీ ఇంటి పేరు వినగానే ఒక మహానటుడు రేలంగి వెంకట రామయ్య గుర్తుకు వస్తారు ఆయనకు మీకు ఏంటి సంబంధం అని అడగగా ..అందుకు రేలంగి నరసింహారావు సమాధానం చెబుతూ… రాధమ్మ పెళ్లి సినిమా తీసే సమయంలో దూరంగా ఉన్న నన్ను పిలిచి నీ పేరు కేవలం నరసింహారావు మాత్రమే.. రేలంగి మాత్రం కాదు అని చెప్పాడు.అలా ఎందుకు సార్ అని అనగానే సెట్లో మీ గురువుగారు నన్ను తిడుతున్నారో నిన్ను తిడుతున్నారో తెలియదు అయ్యా.. అందుకే నీ పేరు ఉత్త నరసింహారావు అంటూ రేలంగి వెంకట రామయ్య గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు.

అదేవిధంగా చిన్నప్పుడు ఆరో తరగతిలో చదివేటప్పుడు మీరు ఎవరితో గొడవ పడ్డారంటగా అని అడగగానే ఎవరో కాదు మన కోడి రామకృష్ణ గారి అంటూ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి తెలిపారు. అదేవిధంగా నరసింహారావు గారు మొదట్లో దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవారు. ఈ క్రమంలోనే దాసరి, నరసింహారావు మధ్య జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా బయటపెట్టారు.

ఈ క్రమంలోనే అలీ రేలంగి నరసింహారావును ఉద్దేశించి మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడు క్లాప్ బోర్డ్ కింద పెట్టి ఏదో పని చేసుకుంటూ ఉండగా మిమ్మల్ని ఒక డైరెక్టర్ కొట్టారని విన్నాము ఆ డైరెక్టర్ ఎవరు అని అడగగా… అందుకు నరసింహారావు స్పందిస్తూ క్లాప్ బోర్డు కింద పెట్టి ఏదో రాస్తూ కూర్చున్నాను. కింద చూస్తే కాళ్లు.. పైకి చూస్తే గురువుగారు (దాసరి) లాగి చెంప పై ఒకటి కొట్టారని ఈ సందర్భంగా తెలిపారు. ఇలా వీరి మధ్య ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలకు సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాకు తెలుగు అక్షరాలు నేర్పింది బాలు గారు.. సింగర్ చిత్ర!

ఆమె పాట పాడితే మనసు పులకరించి పోతుంది.. ఎలాంటి బాధలో ఉన్న ఉపశమనం కలుగుతుంది. అద్భుతమైన గాత్రంతో తీయనైన పాటలు పాడి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న గాయని, చిత్ర గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు అన్ని భాషలలో సుమారు 20 వేలకు పైగా పాటలు పాడి ఎంతోమందిని ఆకట్టుకున్న చిత్రమ్మ గారు తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆశక్తికరమైన ఘటనలను గురించి ముచ్చటించారు.

ఆలీతో సరదాగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిత్ర గారికి అలీ గులాబి పువ్వులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన సినీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి ముచ్చటించారు. ఈ క్రమంలోనే అలీ కె ఎస్ చిత్ర అంటే పూర్తి పేరు ఏంటని అడగగా.. కృష్ణన్‌ నాయర్‌ శాంతకుమారి చిత్ర అని తన అసలు పేరును ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ మధ్యకాలంలో తెలుగు రాయడం, చదవటం నేర్చుకున్నారటగా అని అడగగా.. అందుకు చిత్ర సమాధానం చెబుతూ ఇప్పుడు కాదు ఎప్పటినుంచో తెలుగు నేర్చుకుంటున్నాను. అసలు నాకు తెలుగు అక్షరాలను రాసిచ్చింది బాలు గారు. ఇద్దరం కలిసి ఎన్నో పాటలు పాడాము. ఈక్రమంలో ఏవైనా సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాలను తీర్చేవారు. బాలు గారితో కలిసి ఉండటం వల్లే నాకు తెలుగు వచ్చిందని ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం తన జీవితం ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వారిలో మొదటి బాలు గారు, జేసుదాసు గారి పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా చిత్ర గారు తెలియజేశారు. జేసుదాసు గారిని ఎంతో ప్రేమగా దాసన్న అని పిలిచే దానినని చిత్ర ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ సందర్భంగా అలీతో పంచుకున్నారు.

నాగార్జున తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసాం.. కానీ అలా ఆగిపోయింది: గోపాల్ రెడ్డి

ఒక చిత్రాన్ని తెరపై అద్భుతంగా చూపించాలంటే కేవలం నటీనటులు దర్శకులు మాత్రమే కాకుండా సినిమాకు ఫోటోగ్రాఫర్ కూడా ఎంతో అవసరం.ఈ సినిమాటోగ్రఫీ కారణంగానే ఒక అద్భుతమైన సినిమా అని మనం చూస్తూ ఆనందించగలరు. ఈ విధంగా ఎన్నో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఎస్ గోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అసిస్టెంట్ కెమెరామెన్ నుంచి కెమెరామెన్ దర్శకుడిగా నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్న గోపాల్ రెడ్డి తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే తన సినీ జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనలను గురించి పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన గోపాల్ రెడ్డి గారిని అలీ ఆశక్తికరమైన ప్రశ్నలు వేస్తూ అతని నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఎస్ గోపాల్ రెడ్డి అంటే ఇంటి పేరా..? అనడంతో ఎస్ అంటే శెనగల వేణుగోపాల్ రెడ్డి. పేరులో చిన్నప్పుడే వేణుని కట్ చేయడం వల్ల గోపాల్ రెడ్డిగా మారానని తెలిపారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఎన్నో ప్రశ్నలు అవి అడగడంతో గోపాల్ రెడ్డి తమదైన రీతిలో సమాధానం చెప్పాడు.

ఈ క్రమంలోనే అప్పట్లోనే నాగార్జున గారితో కలిసి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించాలని భావించారంటగా… అని అడగడంతో గోపాల్ రెడ్డి స్పందిస్తూ.. అవును నాగార్జున తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసాము.ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా రాసిన స్క్రిప్ట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాము. ఇందులో హీరో 48 గంటలలో తనకు విషం ఎక్కించిన ముగ్గురు పిల్లలను చంపే సన్నివేశం ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ఈ ముగ్గులు మూడు రాష్ట్రాలలో ఉంటారు.

హీరో విలన్ లను వెతుకుతున్న మార్గంలో మధ్యలో హీరోకి సంబంధించిన ఫ్లాష్ బ్లాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ విధంగా నాగార్జున హీరోగా పాన్ ఇదే చిత్రాన్ని ప్లాన్ చేయగా ఇందులో నటించడానికి డింపుల్‌ కపాడియా, అనుపమ్‌ ఖేర్‌ తదితరుల్ని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది ఇక వారంలో సినిమా ప్రారంభించబోతున్నామన్న సమయంలో నాకూ కె.ఎల్‌. నారాయణకి, నాగార్జున సోదరుడు వెంకట్‌కి కొన్ని సన్నివేశాలలో మార్పులు చోటు చేయడం మంచిది అనిపించింది. అయితే ఈ విధంగా మార్పులు చేయడానికి అశోక్ మెహతా ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా వాయిదా పడిందని ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి తెలిపారు.

వంద రూపాయల కోసం ఎన్నో కష్టాలను చూశాను: హీరో రాజా

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారికి అదృష్టం అయినా ఉండాలి, సినీ బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వస్తుంటాయి.ఇలాంటి తరుణంలోనే సినిమాల్లో నటించాలని ఎంతో ఆశ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ చుట్టూ అవకాశాల కోసం తిరుగుతూ అవకాశాన్ని దక్కించుకున్న హీరోలలో రాజా ఒకరు.అయితే ఈ అవకాశాన్ని ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయారు. “ఓ చిన్నదాన” సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రాజా”ఆనంద్” సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు.తర్వాత కొంత కాలానికి అవకాశాలు లేక పూర్తిగా ఇండస్ట్రీకి స్వస్తి పలికాడు.

చాలా కాలంగా ప్రేక్షకులు దూరమైనా రాజాను ప్రస్తుతం అలీ నిర్వహిస్తున్న “ఆలీతో సరదాగా”అనే షో కి వచ్చారు. ఈనెల 14న ప్రసారం కానున్న ఈ షో లో భాగంగా ఇప్పటికే ప్రోమో విడుదల అయింది.ఈ ప్రమోలో రాజా తను ఇండస్ట్రీలోకి రాకముందు పడిన అవమానాలను, తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు కొంతమంది ఎన్నో రకాలుగా అవమానించారని ఈ షో ద్వారా తెలిపాడు.

తన వ్యక్తిగత విషయాలను తెలుపుతూ కేవలం ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మను కోల్పోయానని, 14 సంవత్సరాలలో అనారోగ్యంతో తండ్రిని కూడా దూరం చేసుకున్నానని తెలిపారు.అమ్మ అంటే ఎలా ఉంటుందో తెలియని రాజా తన అక్కల సమక్షంలోనే పెరిగి పెద్ద అయ్యాడు.సినిమాలలోకి రాకముందు ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేసే వాడిని, అప్పట్లో వంద రూపాయల కోసం ఎంతో కష్టపడ్డానని ఈ సందర్భంగా తెలిపారు.

ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇండస్ట్రీలో చేసే రాజకీయాలను ఎదుర్కోలేక పోయాడు. అతను నటించిన సినిమాలకు థియేటర్లు కూడా దొరికేవి కావని, వారిని ఎదిరించలేక సినిమాలకు స్వస్తి చెప్పి ప్రస్తుతం పాస్టర్ గా స్థిరపడ్డానని, ఈ షో ద్వారా తాను అనుభవించిన కష్టాలను ప్రేక్షకులకు తెలిపారు.