ఒక చిత్రాన్ని తెరపై అద్భుతంగా చూపించాలంటే కేవలం నటీనటులు దర్శకులు మాత్రమే కాకుండా సినిమాకు ఫోటోగ్రాఫర్ కూడా ఎంతో అవసరం.ఈ సినిమాటోగ్రఫీ కారణంగానే ఒక అద్భుతమైన సినిమా అని మనం చూస్తూ ఆనందించగలరు. ఈ విధంగా ఎన్నో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఎస్ గోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అసిస్టెంట్ కెమెరామెన్ నుంచి కెమెరామెన్ దర్శకుడిగా నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్న గోపాల్ రెడ్డి తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే తన సినీ జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనలను గురించి పంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన గోపాల్ రెడ్డి గారిని అలీ ఆశక్తికరమైన ప్రశ్నలు వేస్తూ అతని నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఎస్ గోపాల్ రెడ్డి అంటే ఇంటి పేరా..? అనడంతో ఎస్ అంటే శెనగల వేణుగోపాల్ రెడ్డి. పేరులో చిన్నప్పుడే వేణుని కట్ చేయడం వల్ల గోపాల్ రెడ్డిగా మారానని తెలిపారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఎన్నో ప్రశ్నలు అవి అడగడంతో గోపాల్ రెడ్డి తమదైన రీతిలో సమాధానం చెప్పాడు.
ఈ క్రమంలోనే అప్పట్లోనే నాగార్జున గారితో కలిసి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించాలని భావించారంటగా… అని అడగడంతో గోపాల్ రెడ్డి స్పందిస్తూ.. అవును నాగార్జున తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసాము.ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా రాసిన స్క్రిప్ట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాము. ఇందులో హీరో 48 గంటలలో తనకు విషం ఎక్కించిన ముగ్గురు పిల్లలను చంపే సన్నివేశం ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ఈ ముగ్గులు మూడు రాష్ట్రాలలో ఉంటారు.
హీరో విలన్ లను వెతుకుతున్న మార్గంలో మధ్యలో హీరోకి సంబంధించిన ఫ్లాష్ బ్లాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ విధంగా నాగార్జున హీరోగా పాన్ ఇదే చిత్రాన్ని ప్లాన్ చేయగా ఇందులో నటించడానికి డింపుల్ కపాడియా, అనుపమ్ ఖేర్ తదితరుల్ని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది ఇక వారంలో సినిమా ప్రారంభించబోతున్నామన్న సమయంలో నాకూ కె.ఎల్. నారాయణకి, నాగార్జున సోదరుడు వెంకట్కి కొన్ని సన్నివేశాలలో మార్పులు చోటు చేయడం మంచిది అనిపించింది. అయితే ఈ విధంగా మార్పులు చేయడానికి అశోక్ మెహతా ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా వాయిదా పడిందని ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…