Tag Archives: Anchor Varshini

Anchor Varshini: ఉప్పల్‌ స్టేడియంలో యాంకర్‌ వర్షిణీ… మరోసారి రావద్దంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..?

Anchor Varshini: బుల్లితెర మీద సందడి చేస్తున్న యంకర్లలో వర్షిణి కూడా ఒకరు. బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవి షోలలో యాంకర్ గా సందడి చేస్తూ తన అందాలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే అడపా దడపా సినిమాలలో నటిస్తూ నటిగా కూడా గుర్తింపు పొందింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన గ్లామర్ తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.

తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూసిన నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. తాజాగా హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌కు వర్షిణీ హాజరైంది.ట్రెండీ దుస్తుల్లో ఎంతో స్టైలిష్‌గా ముస్తాబై వచ్చిన వర్షిణీ గ్యాలరీలో నిలబడి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీం ను ఎంకరేజ్‌ చేసింది.

దురదృష్టవశాత్తూ కేకేఆర్‌ చేతిలో 5 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్‌ పరాజయం పాలైంది . దీంతో సన్ రైజర్స్ అభిమానులు వర్షిణిని ట్రోల్ చేస్తున్నారు.
ఎందుకంటే గతంలోనూ ఉప్పల్‌ వేదికగా జరిగిన హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌కు వర్షిణి హాజరైంది. ఆ మ్యాచ్‌లో కూడా హైదరాబాద్‌ ఓటమి పాలైంది.

Anchor Varshini: దయచేసి స్టేడియంకు రావద్దు…

అంతే కాకుండా ఆ మ్యాచ్‌లో ముంబై స్టార్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌తో కలిసి ఫొటోలు కూడా దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే వర్షిణి అటెండ్ అయిన మ్యాచ్‌ లలో హైదరాబాద్‌ మ్యాచులు ఓడిపోవడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. నవ్వు ఇంకోసారి స్టేడియానికి రావొద్దు అంటూ నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు.

Anchor Varshini: కోటీశ్వరుల ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్న బుల్లితెర యాంకర్ వర్షిని.. వరుడు ఎవరంటే?

Anchor Varshini: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఒకప్పుడు ఉదయభాను సుమా ఝాన్సీ వంటి వాళ్లు పెద్ద ఎత్తున క్రేజ్ సొంతం చేసుకోగా ఇప్పటికే సుమ అదే హవా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో బుల్లితెరకు ఎంతోమంది గ్లామరస్ యాంకర్లు పరిచయమయ్యారు.ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో వర్షిని ఒకరు.

వర్షిని బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించారు. అయితే ఈమెకు బుల్లితెరపై వచ్చినంత క్రేజ్ సినిమాలలో రాలేదని చెప్పాలి. అయితే ఇప్పటికే అడపా దడపా సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు.

ఈ విధంగా గత కొంతకాలం నుంచి బుల్లితెరపై సందడి చేయనటువంటి వర్షిని సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వర్షినికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వర్షినికి ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో విసుగు చెందిన ఈమె పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని నిర్ణయం తీసుకున్నారట.

Anchor Varshini: గొప్పింటి కోడలుగా అడుగుపెట్టిన వర్షిని..

ఇకపోతే వర్షినికి చిన్నప్పుడే తన బావతో పెళ్లి ఫిక్స్ అయిందని ఇద్దరికీ పెళ్లి చేయాలని వీరి తల్లిదండ్రులు కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తనకు వరసకు బావ అయ్యే వ్యక్తితో వర్షిని ఏడడుగులు నడవబోతున్నట్లు సమాచారం.అయితే వర్షిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కోట్ల ఆస్తి ఉన్న సంపన్నుడని త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది.ఏది ఏమైనా వర్షిని ఓ గొప్పింటికి కోడలుగా అడుగు పెడుతుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న ఆ ఇద్దరు.. ఇక హౌస్ మొత్తం రచ్చ.. రచ్చ..

బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన రెండవ రోజు నుంచి కంటెస్టెంట్ ల మధ్య అసలుసిసలైన ఆట మొదలైంది. మొదటి రోజు కంటెస్టెంట్స్ అందరూ ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ రెండవ రోజు నుంచి అసలైన ఆట ఆడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ అందరూ గ్రూపులుగా విడిపోయి చిన్న చిన్న విషయాలకే రచ్చ చేస్తున్నారు.ఈ క్రమంలోనే నామినేషన్స్ కంటెస్టెంట్ ల మధ్య మరింత చిచ్చు పెడుతున్నాయని చెప్పవచ్చు.

ఈ విధంగా బిగ్ బాస్ మొదటివారం ఎంతో విజయవంతంగా ప్రసారం అయినప్పటికీ హౌస్ నుంచి కంటెస్టెంట్ సరయు ఎలిమినేట్ అయ్యారు.ఇక రెండో వారం నామినేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది తెలియని వాళ్ళు ఉండటం వల్ల కొంత వరకు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హాట్ బ్యూటీస్ ని హౌస్ లోపలికి పంపించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీవీ ఆర్టిస్ట్ నవ్య స్వామి, బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ వర్షిణిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించనునట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

టీవీ షోల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వర్షిణి సోషల్ మీడియావేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకుంది. అలాగే నా పేరు మీనాక్షి,ఆమె కథ వంటి పాపులర్ సీరియల్స్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నవ్యస్వామి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ ఉన్న వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఆ కథే వేరే ఉంటుందని చెప్పవచ్చు. అయితే వీరిద్దరిని ఒకే వారంలో హౌస్ లోకి పంపిస్తారా? లేక ఒక్కో వారంలో ఒక్కొక్కరిని పంపిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా ఈ హాట్ బ్యూటీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టి ప్రేక్షకులను మరింత సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

చీరకట్టులో యాంకర్ వర్షిణి అదుర్స్.. ఫొటోలు వైరల్..!

యాంకర్ వర్షిణి ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీ షో లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తన యాంకిరింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇన్ స్టాలో దూసుకుపోతుంది. ఆమె అందం, అభినయంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటోందని చెప్పవచ్చు.

అయితే ఆమె ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. చీర కట్టులో ఆమెను చూసి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఆమెను ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. హాట్‌ యాంకర్‌ వర్షిణి లేటెస్ట్ గా ఓ వీడియోని కూడా పంచుకుంది. లేటెస్ట్ ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటో షూట్‌.. పెద్ద పెద్ద పూల ప్రింటెడ్‌ శారీలో హోయలుపోయింది వర్షిణి సౌందరాజన్‌.

తన అందాలతో గ్లామర్ విందుని వడ్డిస్తుంది. సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వర్షిణి ఢీ షోలో యాంకరింగ్ గా చేసింది. ఇక ఆ తర్వాత పలు షో లలో కూడా బాగా మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. పైగా అవకాశాల కోసం మరింత రెచ్చిపోతోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కతున్న “శాకుంతలం” సినిమాలో వర్షిని కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అవకాశాన్ని అందుకుంది వర్షిణి. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్హ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. హాట్ పోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

వారిద్దరిలో ఒకరు వైల్డ్ కార్డు ఎంట్రీ..! కారణం అందేనా..

బుల్లితెరపై ఏ ప్రోగ్రాం అయినా హిట్ కావాలంటూ.. వాళ్లు చేసే కామెడీగానీ.. సెంటిమెంట్ గానీ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 రియాల్డీ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అందులో 19 మంది కంటెస్టెంట్లను పంపించిన నిర్వాహకులు ఎంటర్ టైన్ మెంట్ మాత్రం మిస్ అయిందనే చెప్పాలి.

అందులో తెలిసిన మొఖాలు నలుగురు లేక ఐదుగురు కంటే ఎక్కువగా లేరు. దీంతో ప్రేక్షకులకు వాళ్లు కనెక్ట్ కాలేకపోతున్నారు. బిగ్ బాస్ లో అసలు తెలిసిన కంటెస్టెంట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు ఇతర పాపులర్ షోలపై దృష్టి పెడుతున్నారు. దీనితో బిగ్ బాస్ షోకి ఆడియన్స్ ట్రాఫిక్ తగ్గిపోతున్నట్లు సమాచారం. దీనికి బదుల వేరే ప్రోగ్రాంలు చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై జోష్ ఇంకా పెంచేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయిన తర్వాత సోమవారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ఎంట్రి జరగబోతోంది. అందులో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒకరు లేదా ఇద్దరు క్రేజీ సెలెబ్రిటీలని హౌస్ లోకి పంపాలని డిసైడ్ అయినట్లు టాక్.

వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం బజర్దస్త్ వర్ష మరియు యాంకర్ వర్షిణి సౌందర్యరాజన్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమచారం. వారిద్దరిలో ఒకరి ఎంట్రీ తప్పకుండా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే కొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలు కానుండటంతో ఈ రకమైన చర్యలను బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే 16మంది కంటెస్టెంట్స్ వీళ్లే.. ఫైనల్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లే..!

బుల్లితెరపై మరో నాలుగు రోజులలో బిగ్ బాస్ రియాల్టీ షో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.బిగ్ బాస్ హోస్ట్ గా కింగ్ నాగార్జున ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్లేనంటూ ఎంతో మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ ఎవరు అనే విషయం ఆ రోజే తెలియనుంది.

ఈ విధంగా బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకొని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరో నాలుగు రోజులలో ఈ షో ప్రారంభం కాబోతుందనగా హౌస్ లోకి వెళ్లే 16 మంది కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఫస్ట్ డే ఫస్ట్ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యే 16 మంది కంటెస్టెంట్ ఎవరు అనే విషయానికి వస్తే.. యాంకర్ వర్షిణి, యాంకర్ లోబో, రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, యూట్యూబ్ సరయు, లహరి శారీ, ప్రియాంక జబర్దస్త్, అనీ మాస్టర్, RJ కాజల్, మానస్, ఆటా సందీప్, షణ్ముఖ్ సీరియల్ నటి ఉమా దేవి, VJ సన్నీ,నటరాజ్ మాస్టర్, సిరి హన్మంత్ పోటీకి సిద్దం అయినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారంప్రకారం వీరిలో కొంతమంది కంటెస్టెంట్ లు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హౌస్ లోకి ఎంటరైన కొన్ని వారాలకు మాత్రమే హౌస్ నుంచి బయటకు వెళుతున్నట్లు తెలుస్తోంది. వీరికి బయట ఇతర కమిట్మెంట్స్ ఉండటం వల్ల బిగ్ బాస్ నిర్వాహకులతో ఈ విధమైనటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

ఈ 16 మంది కంటెస్టెంట్ లో చివరి వారం వరకు కేవలం ఏడుగురు మధ్య పోటీ నెలకొందని, టైటిల్ పోరు కోసం ఈ ఏడుగురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఏడుగురు కంటెస్టెంట్ లు ఎవరూ అనే విషయానికి వస్తే యూట్యూబ్ సరయు, ఆర్.జె కాజల్, సన్నీ, ఆట సందీప్, యాంకర్ లోబో, రవి, యాంకర్ వర్షిని ఈ ఏడుగురు బిగ్ బాస్ చివరి వారం వరకు ఉండి టైటిల్ కోసం పోరాడుతున్నట్లు తెలుస్తోంది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలంటే కేవలం కొన్ని రోజులు వేచి ఉండాలి.