Anchor Varshini: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఒకప్పుడు ఉదయభాను సుమా ఝాన్సీ వంటి వాళ్లు పెద్ద ఎత్తున క్రేజ్ సొంతం చేసుకోగా ఇప్పటికే సుమ అదే హవా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో బుల్లితెరకు ఎంతోమంది గ్లామరస్ యాంకర్లు పరిచయమయ్యారు.ఇలా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో వర్షిని ఒకరు.
వర్షిని బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించారు. అయితే ఈమెకు బుల్లితెరపై వచ్చినంత క్రేజ్ సినిమాలలో రాలేదని చెప్పాలి. అయితే ఇప్పటికే అడపా దడపా సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు.
ఈ విధంగా గత కొంతకాలం నుంచి బుల్లితెరపై సందడి చేయనటువంటి వర్షిని సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వర్షినికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వర్షినికి ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో విసుగు చెందిన ఈమె పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని నిర్ణయం తీసుకున్నారట.
ఇకపోతే వర్షినికి చిన్నప్పుడే తన బావతో పెళ్లి ఫిక్స్ అయిందని ఇద్దరికీ పెళ్లి చేయాలని వీరి తల్లిదండ్రులు కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తనకు వరసకు బావ అయ్యే వ్యక్తితో వర్షిని ఏడడుగులు నడవబోతున్నట్లు సమాచారం.అయితే వర్షిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కోట్ల ఆస్తి ఉన్న సంపన్నుడని త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది.ఏది ఏమైనా వర్షిని ఓ గొప్పింటికి కోడలుగా అడుగు పెడుతుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…