Rashmika: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఆ అంచనాలను చేరుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా చూసినటువంటి విజయ్ అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి సినిమాపై భారీ అంచనాలు పెంచడంతో భారీ ధరలకు బయ్యర్లు సినిమాని కొనుగోలు చేశారు.దీంతో సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో తీవ్రస్థాయిలో బయ్యర్లు నష్టపోయారు.
ఇక ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయినప్పటికీ తాజాగా రష్మిక లైగర్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈమె హిందీలో నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక లైగర్ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ తనకు మాత్రం పిచ్చిపిచ్చిగా నచ్చిందని ఈ సినిమా చూస్తున్నంత సేపు గట్టిగా విజిల్స్ వేయడమే కాకుండా డాన్స్ కూడా చేశాను అంటూ ఈ సందర్భంగా రష్మిక ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్ చేశారు.తనకు హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేదు మాస్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని అందుకే లైగర్ సినిమా కూడా తనకు చాలా బాగా నచ్చిందని ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో మరోసారి విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి నేటిజన్స్ చర్చించుకుంటున్నారు.విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి ఫ్లాప్ అయినా ఈ సినిమా తనకు నచ్చిందంటూ రష్మిక కామెంట్లు చేస్తున్నారని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…