Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం జరిగిన విషయం మనకు తెలిసిందే. సెప్టెంబర్ 28వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇందిరా దేవి తుది శ్వాస విడిచారు. ఇలా ఇందిరా దేవి మరణించడంతో మహేష్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇకపోతే తల్లి పట్ల ఎంతో ప్రేమను చూపించే మహేష్ బాబు తన తల్లి చివరి కోరికను నెరవేర్చలేకపోయారని, ప్రస్తుతం ఈ విషయాన్ని గుర్తుచేసుకొని మహేష్ బాబు ఎంతగానో కుమిలి పోతున్నారని తెలుస్తోంది.
ఇంతకీ ఇందిరా దేవి చివరి కోరిక ఏంటి మహేష్ బాబు తీర్చలేని ఆ కోరిక ఏంటి అనే విషయానికి వస్తే..మహేష్ బాబు ఇందిరాదేవి ఆయన కుమార్తె సితార ఇద్దరు ఒకే పోలికలతో ఉండటం వల్ల సితార అన్న కూడా మహేష్ బాబుకు అమితమైన ప్రేమ అలాగే సితార తన నానమ్మ ఇందిరా దేవితో ఎంతో సమయం గడుపుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇందిరాదేవి తన మనవరాలు సితారకు ఓణీ ఫంక్షన్ చేయమని కోరారట.
అయితే మహేష్ బాబుకు ఇలాంటివన్నీ ఇష్టం లేకపోవడంతో ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకు అంటూ ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది.అయితే ఇందిరా దేవి తరచూ తన కోరిక గురించి మహేష్ బాబు దగ్గర ప్రస్తావించడంతో ఇప్పుడు అప్పుడు అంటూ మహేష్ బాబు ఆలస్యం చేస్తూ వచ్చారు. అయితే అదే సమయంలోనే ఇందిరా దేవి అనారోగ్యానికి గురయ్యారు.
ఈ విధంగా ఈమె అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా మహేష్ బాబుకు తన తల్లి లేని బాధ ఒకవైపు వేధిస్తుండగా మరోవైపు తన తల్లి సితార గురించి అడిగిన కోరికను తీర్చలేకపోయానని మరింత బాధపడుతున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా మహేష్ బాబు తన తల్లి మరణం పట్ల ఎంతగానో కృంగిపోయారు ఇక కొడుకుగా మహేష్ బాబు దగ్గరుండి హిందూ సంప్రదాయాల ప్రకారం తన తల్లికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…