Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం జరిగిన విషయం మనకు తెలిసిందే. సెప్టెంబర్ 28వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇందిరా దేవి తుది శ్వాస విడిచారు. ఇలా ఇందిరా దేవి మరణించడంతో మహేష్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇకపోతే తల్లి పట్ల ఎంతో ప్రేమను చూపించే మహేష్ బాబు తన తల్లి చివరి కోరికను నెరవేర్చలేకపోయారని, ప్రస్తుతం ఈ విషయాన్ని గుర్తుచేసుకొని మహేష్ బాబు ఎంతగానో కుమిలి పోతున్నారని తెలుస్తోంది.
ఇంతకీ ఇందిరా దేవి చివరి కోరిక ఏంటి మహేష్ బాబు తీర్చలేని ఆ కోరిక ఏంటి అనే విషయానికి వస్తే..మహేష్ బాబు ఇందిరాదేవి ఆయన కుమార్తె సితార ఇద్దరు ఒకే పోలికలతో ఉండటం వల్ల సితార అన్న కూడా మహేష్ బాబుకు అమితమైన ప్రేమ అలాగే సితార తన నానమ్మ ఇందిరా దేవితో ఎంతో సమయం గడుపుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇందిరాదేవి తన మనవరాలు సితారకు ఓణీ ఫంక్షన్ చేయమని కోరారట.
అయితే మహేష్ బాబుకు ఇలాంటివన్నీ ఇష్టం లేకపోవడంతో ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకు అంటూ ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది.అయితే ఇందిరా దేవి తరచూ తన కోరిక గురించి మహేష్ బాబు దగ్గర ప్రస్తావించడంతో ఇప్పుడు అప్పుడు అంటూ మహేష్ బాబు ఆలస్యం చేస్తూ వచ్చారు. అయితే అదే సమయంలోనే ఇందిరా దేవి అనారోగ్యానికి గురయ్యారు.
ఈ విధంగా ఈమె అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా మహేష్ బాబుకు తన తల్లి లేని బాధ ఒకవైపు వేధిస్తుండగా మరోవైపు తన తల్లి సితార గురించి అడిగిన కోరికను తీర్చలేకపోయానని మరింత బాధపడుతున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా మహేష్ బాబు తన తల్లి మరణం పట్ల ఎంతగానో కృంగిపోయారు ఇక కొడుకుగా మహేష్ బాబు దగ్గరుండి హిందూ సంప్రదాయాల ప్రకారం తన తల్లికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…