Tolly wood Actresses: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వీరు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే మంచి మంచి అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ఇలా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతూనే మరోవైపు విలన్ పాత్రలలో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు.కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముగ్గురు సీనియర్ హీరోయిన్లు ఇలా హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు రమ్యకృష్ణ. ఎలాంటి పాత్రలో నైనా ఎంతో అవలీలగా నటించే రమ్యకృష్ణ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు.అయితే ఈమె ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో విలన్ గా ఏకంగా రజనీకాంత్ తో పోటీపడ్డారు. ఇలా నీలాంబరి పాత్ర ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో అద్భుతంగా కొనసాగిస్తున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచే కాకుండా ఈ లోకం నుంచే కనుమరుగయ్యారు నటి సౌందర్య. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సౌందర్య కూడా శ్రీకాంత్ రిచా కలిసి నటించిన నా మనసిస్తారా సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీకాంత్ జగపతిబాబు వంటి హీరోలతో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన రాశి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినప్పటికీ మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో గోపీచంద్ తో కలిసి విలన్ పాత్ర ద్వారా మెప్పించారు.ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకవైపు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల ద్వారా నటించింది మెప్పించారు. ఇక ప్రస్తుతం రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…