Tolly wood Actresses: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వీరు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే మంచి మంచి అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ఇలా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతూనే మరోవైపు విలన్ పాత్రలలో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు.కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముగ్గురు సీనియర్ హీరోయిన్లు ఇలా హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు రమ్యకృష్ణ. ఎలాంటి పాత్రలో నైనా ఎంతో అవలీలగా నటించే రమ్యకృష్ణ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు.అయితే ఈమె ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో విలన్ గా ఏకంగా రజనీకాంత్ తో పోటీపడ్డారు. ఇలా నీలాంబరి పాత్ర ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో అద్భుతంగా కొనసాగిస్తున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచే కాకుండా ఈ లోకం నుంచే కనుమరుగయ్యారు నటి సౌందర్య. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సౌందర్య కూడా శ్రీకాంత్ రిచా కలిసి నటించిన నా మనసిస్తారా సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీకాంత్ జగపతిబాబు వంటి హీరోలతో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన రాశి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినప్పటికీ మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో గోపీచంద్ తో కలిసి విలన్ పాత్ర ద్వారా మెప్పించారు.ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకవైపు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల ద్వారా నటించింది మెప్పించారు. ఇక ప్రస్తుతం రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…