Tolly wood Actresses: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే వీరు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే మంచి మంచి అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ఇలా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతూనే మరోవైపు విలన్ పాత్రలలో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు.కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముగ్గురు సీనియర్ హీరోయిన్లు ఇలా హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు రమ్యకృష్ణ. ఎలాంటి పాత్రలో నైనా ఎంతో అవలీలగా నటించే రమ్యకృష్ణ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు.అయితే ఈమె ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో విలన్ గా ఏకంగా రజనీకాంత్ తో పోటీపడ్డారు. ఇలా నీలాంబరి పాత్ర ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో అద్భుతంగా కొనసాగిస్తున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచే కాకుండా ఈ లోకం నుంచే కనుమరుగయ్యారు నటి సౌందర్య. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి సౌందర్య కూడా శ్రీకాంత్ రిచా కలిసి నటించిన నా మనసిస్తారా సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీకాంత్ జగపతిబాబు వంటి హీరోలతో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన రాశి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినప్పటికీ మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో గోపీచంద్ తో కలిసి విలన్ పాత్ర ద్వారా మెప్పించారు.ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకవైపు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల ద్వారా నటించింది మెప్పించారు. ఇక ప్రస్తుతం రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…