Tag Archives: andhra pradesh

SSC Exams Reverification: పదో తరగతి ఫలితాలలో తక్కువ మార్కులు వచ్చాయా…అయితే ఇలా చేయండి!

SSC Exams Reverification: సోమవారం ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 6లక్షల 15వేల మంది పరీక్షలకు హాజరవ్వగా 4లక్షల 14వేల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇకపోతే పరీక్ష ఫలితాలలో చాలా మందికి తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా ఆందోళన చెందే విద్యార్థులు పరీక్షా పత్రాన్ని తిరిగి రీ కౌంటింగ్, రివల్యూషన్ చేయించుకునే సౌకర్యాన్ని కల్పించింది.

రీ కౌంటింగ్ చేసుకున్న విద్యార్థులు ప్రతి ఒక్క సబ్జెక్టుకు 500 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. www.cfms.ap.gov.in ద్వారా జూన్ 20 లోగా ఫీజు చెల్లించాలి.ఇకపోతే ఫ్రీ వెరిఫికేషన్ చేసిన ఆన్సర్ షీట్ కాఫీ కావాలనుకునేవారు ప్రతి సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు చలానా చెల్లించాలి. ఇక ఎవరైతే రివాల్యూషన్ కోసం దరఖాస్తు చేస్తారో అలాంటి అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

అయితే నగదును కేవలం సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా చలానా రూపంలో మాత్రమే తీసుకుంటారు. www.bse.ap.gov.in వెబ్ సైట్ లోనూ అలాగే డీఈఓ ఆఫీసులోని కౌంటర్లలో కూడా ఫారమ్ అందుబాటులో ఉంది. స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా కౌంటర్ సంతకం చేసిన హాల్ టికెట్ ఫోటో కాఫీ అభ్యర్థి పేరుతో పొందిన అవసరమైన మొత్తానికి సీఎఫ్ఎమ్ఎస్ సిటిజన్ చలాన్.
పైన పేర్కొన్న పత్రాలను దరఖాస్తు ఫారమ్‌ DEO ఆఫీసులలోని కౌంటర్లలో అందజేయాలి. DGE, A.P కి పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించరు. మార్కుల మొత్తం మారిన సందర్భాల్లో సవరించిన మెమోరాండం జారీ చేస్తారు.

రీ వెరిఫికేషన్ ప్రాసెస్…

రీ వేరిఫికేషన్ ప్రాసెస్ ద్వారాఇచ్చిన మార్కులను తిరిగి లెక్కించడం లేదా ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు రాసి మార్కులు వేయకపోయినా తిరిగి మూల్యాంకనం చేసి మార్కులు కూడటం, ఇకపోతే రీ వెరిఫికేషన్ ద్వారా ప్రకటించిన మార్కులను ఫలితాలు వచ్చిన రెండు రోజుల తరువాత హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి సబ్జెక్టుల వారీగా మార్కుల జాబితాను www.bse.ap.gov.in వెబ్ సైట్ లో ఉంచుతారు. ఇకపోతే విద్యార్థులు అధికారక వెబ్ సైట్ www.results.bse.ap.gov.in నుంచి కూడా మార్కుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Jayaprada: జీవితంలో చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఆంధ్రానే వదిలేయాల్సి వచ్చింది.. జయప్రద సెన్సేషనల్ కామెంట్స్!

Jayaprada: సీనియర్ నటిగా, మాజీ రాజ్యసభ సభ్యురాలిగా ఒకవైపు సినిమాలలోను మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తెలుగులో సినిమాలలో చేయక పోయినప్పటికీ ఇతర భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే జయప్రద ప్రస్తుతం బీజేపీ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Jayaprada: జీవితంలో చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఆంధ్రానే వదిలేయాల్సి వచ్చింది.. జయప్రద సెన్సేషనల్ కామెంట్స్!

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద తన సినీ కెరీర్ గురించి సీనియర్ ఎన్టీఆర్ గారితో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. ఎన్టీఆర్ గారు తన జీవితంలో ఒక రోల్ మోడల్ అని తెలిపారు.తనని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగానని అతని స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చి అతని నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని ఈమె తెలిపారు.

Jayaprada: జీవితంలో చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఆంధ్రానే వదిలేయాల్సి వచ్చింది.. జయప్రద సెన్సేషనల్ కామెంట్స్!

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు పార్టీలో చేరమని ఎన్టీఆర్ ఫోన్ చేసిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తాను తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశానని, ఎలాంటి పదవులు ఆశించి తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని కేవలం ఎన్టీఆర్ గారిని సీఎంగా చూడాలన్నదే తన లక్ష్యమని జయప్రద తెలియజేశారు.

అయితే ఇలా రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారిని వదిలి ఇతర ఎమ్మెల్యేలు బలవంతం మీద ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మేము చంద్రబాబుతో ఏకీభవిస్తున్నామని చెప్పడంతో నేను ఎన్టీఆర్ గారిని వదిలి చంద్రబాబుకు మద్దతు తెలిపాను. అదే తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.ఎన్టీఆర్ గారు నా పై ఎంతో విశ్వాసం ఉంచి తనని పార్టీలోకి ఆహ్వానించగా నేను ఎన్టీఆర్ గారి దగ్గర ఉండాల్సిన సమయంలో ఉండకుండా బయటకు వచ్చానని ఈ సందర్భంగా జయప్రద వెల్లడించారు.

విలువ ఇవ్వలేదు…

ఇకపోతే చంద్రబాబునాయుడు సీఎం అయిన తర్వాత తాను రాజ్యసభ సభ్యురాలిగా పదవిలో ఉన్నానని ఆయన సీఎం అయిన తర్వాత ప్రజలకు విలువ ఇవ్వడం అలాగే పార్టీ నేతలతో ప్రవర్తించే తీరులో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇవ్వకపోవడంతో నేను ఆంధ్ర వదిలి రావాల్సి వచ్చిందని ఈ సందర్భంగా జయప్రద వెల్లడించారు.

Prashanth Neel: కేజిఎఫ్ డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాడని మీకు తెలుసా… ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రశాంత్ నీల్!

Prashanth Neel: దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చించుకుంటున్న సినిమాలలో కేజిఎఫ్ 2 ఒకటి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా రికార్డులు సృష్టించడంతో ఒక్కసారిగా హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగి పోతున్నాయి.

Prashanth Neel: కేజిఎఫ్ డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాడని మీకు తెలుసా… ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రశాంత్ నీల్!

ఈ విధంగా ఈ సినిమా విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా కేజిఎఫ్2 లో హీరో తల్లి ముంబైలో చనిపోతే పూడ్చిన మట్టితో సహా తీసుకువచ్చి కేజీఎఫ్ లో సమాధి కట్టిస్తాడు.

Prashanth Neel: కేజిఎఫ్ డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాడని మీకు తెలుసా… ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రశాంత్ నీల్!

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి యాంకర్ ప్రశ్నిస్తూ ఇలాంటి ఐడియా మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు డైరెక్టర్ సమాధానం చెబుతూ ఇది నా నిజ జీవితంలో చేయాలనుకున్నా, అయితే ప్రాక్టికల్ గా కుదరదు కనుక సినిమాలో ఈ సన్నివేశాన్ని పెట్టానని డైరెక్టర్ వెల్లడించారు. తనకు తన నానమ్మ అంటే ఎంతో ఇష్టమని ప్రశాంత్ ఈ సందర్భంగా వెల్లడించారు.

మా నాన్నమ్మ నిత్యం నా వెంటే ఉంటూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. నేను తినకపోతే దగ్గరుండి తినిపించేది. ఈ విధంగా తనతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. అయితే తను చనిపోయిన తర్వాత తనని పూడ్చి పెట్టడానికి మాకంటూ ఇక్కడ సొంత స్థలం లేక తనని మా స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కి తీసుకెళ్లి పూడ్చి పెట్టాము.ఎప్పటికైనా తన సమాధిని తీసుకువచ్చి నా ఇంటి వాకిట్లో పెట్టుకోవాలన్నది నా కల.అది కుదరదు కనుక సినిమాలో ఈ సన్నివేశాన్ని చూపించామని వెల్లడించారు.

తెలుగువారికి గర్వకారణం…

ఈ విధంగా ప్రశాంత్ నీల్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని తెలియజేయడంతో ఎంతోమంది తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తండ్రి ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తిగా కాగా తల్లి కర్ణాటకకు చెందిన వ్యక్తి. మొత్తానికి ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా తెలుగు వ్యక్తి కావడం తెలుగువారు గర్వించదగ్గ విషయమని చెప్పవచ్చు.

Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!

Andhra Pradesh: జగన్ సర్కార్ ప్రవేశ పెడుతున్న ప్రతిష్టాత్మక పథకాల్లో జగన్న విద్యా దీవెన ఒకటి. విద్యార్థులకు బడులకు పంపించే తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద నగదు జమచేస్తోంది. 

Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!

మార్చిలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులను ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. అయితే ఈ జగనన్న విద్యా దీవెన వెరిఫికేషన్ పూర్తి కాలేదని… సందేశాలు వచ్చిన విద్యార్థులు వెంటనే తమ గ్రామ సచివాలయాలకు వెళ్లి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ కు సంబంధించిన డ్యాక్యుమెంట్లను సమర్పించాలి. 

Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!

వెరిఫికేషన్ పూర్తయి ఇన్ఎలిజిబుల్ అయితే.. సచివాలంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లను కలవాలి. అర్హత కలిగిన విద్యార్థులు అబ్జెక్షన్ తెలపడానికి ఈనెల 21 వరకు గడువు ఉంది. మార్చిలోగా జగనన్న విద్యా దీవెన డబ్బులు పడకుంటే.. చెక్ చేసుకునే విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. 

జ్ఞానభూమి వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు..

విద్యార్థులు జ్ఞానభూమి అనే వెబ్సైట్ ఓపెన్ చేసి స్టూడెం ట్ ఆధార్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. అందులో వ్యూ లేదా ఫ్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టేటస్ తెలుసువాలి అని అనుకుంటున్నారో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మీ స్టేటస్ ఎలిజిబిబుల్ అని ఓటీఏ కంప్లీటెడ్ అని చూపిస్తే మీకు ఇంకా డబ్బులు రాలేదని అర్థం. ఒక వేళ రిలీస్డ్ అని చూపిస్తే మీకు నగదు వచ్చినట్లు అర్థం. టీబీఆర్ నెంబర్ జనరేట్ అయిన వారం రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది.

బ్రేకింగ్ న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నేటి ఉదయం అనారోగ్య సమస్యతో కన్నుమూశారు.ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనైన రోశయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

హైదరాబాదులోని స్టార్ హాస్పిటల్ కు తరలిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన పార్థివదేహం ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం. ఈయన తన రాజకీయ జీవితంలోఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు.

మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న రోశయ్య అతని మరణానంతరం ఆపధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఏడాదిన్నర పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన రోశయ్య అనంతరం ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణస్వీకారం చేశారు.రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుకుగా పాల్గొనే రోశయ్య ఆర్థిక మంత్రిగా బాధ్యతలు వ్యవహరిస్తూ సుమారు 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్న రోశయ్య ఇలా మరణించడంతో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మరికాసేపట్లో ఆయన పార్థివదేహం ఆస్పత్రి నుంచి తన స్వగృహానికి తరలించనున్నారు.

ఆ కుటుంబాలకు రెండు వేల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం జగన్!

ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రోడ్లు, నదులు, కాలువలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గుప్పుగుప్పు మంటూ బతుకుతున్నారు. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాలలో కుండపోత వర్షాల కారణంగా చాలా మంది గల్లంతయ్యారు. పలుచోట్ల మూగజీవాలు కొట్టుకుపోయాయి. వర్షం బీభత్సం కారణంగా అక్కడి ప్రజలకు వెంటనే సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఏపీ లోని మూడు జిల్లాలకు వెంటనే ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ క్రమంలోనే నెల్లూరుకు సీనియర్ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు ప్రద్యుమ్న, కడపకు శశిభూషణ్ కుమారులను నియమించారు. బాధితులను ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికన పని చేయాలని ఆదేశించారు. వరద బీభత్స ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు. అలాగే వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

పరిహారాలను వీలైనంత త్వరగా అందించాలని వైయస్ జగన్ ఆదేశించారు. పంటల నష్టంపై అంచనాలు వేసి రైతులు మళ్లీ పంటలు వేసుకునేందుకు విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే చెరువులు, రిజర్వాయర్లు, పక్కన ఉన్న గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అలాగే తిరుమల తిరుపతికి వచ్చిన భక్తులకు సహాయంగా ఉండాలని అధికారులను ఆదేశించారు జగన్. రైలు విమానాలు రద్దు అయిన కారణంగా వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలని అన్నారు. ఇప్పటికే కడప జిల్లాలో వరదలతో స్వర్ణముఖీ నది ఉద్ధృతతో రోడ్డు తెగిపోయింది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లు,బ్రిడ్జీలు కొట్టుకుపోతున్నాయి. ఇక అనంతపురం జిల్లా చిత్రావతి నది ఉధృతంగా ప్రవహించడంతో నదిలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. ఇలా ఏపీలో పలు ప్రదేశాలలో వరద బీభత్సం వల్ల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు.

కర్ణాటకలో అలా.. ఏపీ సరిహద్దులో ఇలా.. ఇది పెట్రోల్ బంకుల పరిస్థితి..

ప్రస్తుతం పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతీ రోజు ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి ధరలు స్థిరంగా ఉంటున్నాయి. డీజిల్ రేటు కూడా నిలకడగానే కొనసాగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు 12 రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి.

వాహనదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవాలి. కానీ.. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఉన్న వాటి కంటే కూడా తగ్గించారు. కర్టాటక రాష్ట్రంలో పెట్రోల్ రేట్లను తగ్గించింది. దీంతో అక్కడ పెట్రోల్ బంకుల్లో వాహనదారులు కిటకిటలాడుతున్నారు. మళ్లీ పెట్రోల్ ధరలు ఎక్కడ పెరుగుతాయనే కారణంతో ఇలా బంకుల్లో వాహనదారులు ఎగబడుతున్నారు.

ఇక్కడ విశేషం ఏంటంటే.. పొరుగున ఉన్న కర్టాటక రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీ సరిహద్దులో మాత్రం బంకులు వెలవెలబోతున్నాయి. ఏపీలో పెట్రోల్ ధరలను తగ్గించలేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు వినియోగదారులకు ఉపశనమివ్వగా.. ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు.

పెట్రోల్ రేట్లు భగ్గుమంటుండంతో ఇలా బంకుల్లోకి ఎక్కువగా వాహనదారులు రావడం లేదు. పెట్రోల్ రేట్లను ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇంధన ధరలు ఇలా పెరుగుతుండటంతో పెట్రోల్ కొట్టించుకొనే పరిస్థితి లేదని వాపోతున్నారు.

దారుణం: తండ్రి పోలికలతో బిడ్డ పుట్టలేదని బిడ్డ పట్ల కిరాతకంగా ప్రవర్తించిన తండ్రి..!

సాధారణంగా పిల్లలు పుడితే వారు తండ్రి పోలిక ఉండాలన్న నియమం ఏదీ లేదు. పిల్లలు తల్లి తండ్రి పోలిక లేదా వారి కుటుంబ సభ్యుల పోలికలు ఉండటం సర్వసాధారణం. అయితే ఓ తండ్రి తన బిడ్డ తన పోలికలతో పుట్టలేదని ఆ బిడ్డపట్ల అతి కిరాతకంగా ప్రవర్తించి తనని హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణ వాసికి రెండు నెలల క్రితం ఒక కూతురు జన్మించింది. అయితే తన కూతురు తన పోలికలతో లేకపోవడంతో తన బిడ్డ కాదని ఆ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన బిడ్డను చంపేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే అనుకున్న విధంగానే గురువారం సాయంత్రం తన బిడ్డను ఎత్తుకొని ఇంటి నుంచి పారిపోయాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు తన బిడ్డను ఎక్కడ చంపుతాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ తండ్రి బిడ్డ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇలా కొన్ని గంటల సమయం తర్వాత ఒక ఒక సంచిలో పాప నిర్జీవంగా మృతి చెంది కనిపించడంతో ఆ తల్లి ఆవేదన భరించలేకపోయింది.

కేవలం తన పోలికలతో బిడ్డ పుట్టే లేదన్న కారణంగా ముక్కుపచ్చలారని ఆ చిన్నారి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా అతి దారుణంగా చంపిన తండ్రి పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇలా ముక్కుపచ్చలారని అభం శుభం తెలియని చిన్నారి విగతజీవిగా పడి ఉండటంతో ఆ తల్లి రోదన వర్ణనాతీతం.

పవన్ కళ్యాణ్ ను బండ బూతులు తిడుతూ.. మరోసారి రెచ్చిపోయిన పోసాని..!

రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పోసాని మురళి కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి నీకు ఏ మాత్రం పోలిక లేదంటూ… పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు.

అదేవిధంగా పంజాబీ హీరోయిన్ విషయంలో తనను మోసం చేసిన వాళ్ళని గుర్తించి తనకి న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పోసానిపై జనసేన అభిమానులు పవన్ అభిమానులు ప్రతి నిమిషం నిమిషానికి ఫోన్ చేస్తూ అతనిని తన కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు అంటూ తాజాగా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ వందలాది బూతు మెసేజ్ లు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆరోపించారు.

పవన్ జగన్ గురించి విమర్శించారు..నేను జగన్ అభిమానిని కావడంతో అతని మాటలను ఖండించాను. పవన్ గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి విమర్శించడంతో ఆయనకి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక సైకో… ఎవరో ఫంక్షన్ పెట్టుకుంటే అక్కడికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎందుకు వస్తున్నారని ఈ సందర్భంగా పోసాని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అనే సైకో వెధవకి చెబుతున్నా.. నీకు ఒక ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంది అనుభవిస్తావు రక్త కన్నీరు కారుస్తారు నేను బతికి ఉంటా.. దరిద్రపు నా కొడకా.. నా భార్యను అనరాని మాటలు అన్నావు అందుకు నిన్ను ఏమైనా అనొచ్చు అంటూ పోసాని మరొకసారి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జాలర్ల వలలో పులస చేప.. ఎంత ధర పలికిందో తెలుసా..?

ఊళ్లలో చెరువులో చేపలు పట్టేటప్పుడు పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రతీ ఒక్కరూ ఆ చేపలను కొనుక్కునేందకు ఆసక్తి కనబరుస్తారు. అయితే అక్కడ కిలో చేపలు ఒక రేటు ఫిక్స్ చేసుకొని విక్రయిస్తుంటారు. చెరువులో ఎక్కువగా బంగారు తీగ, రవ్వలాంటి చేపలు ఉంటాయి. అయితే సముద్రంలో గానీ.. యేటిలో గానీ చేపలు పట్టేటప్పుడు కొన్ని అరుదైనవి కనిపిస్తుంటాయి.

జాలర్లకు అవి పడ్డాయంటే ఇక పండగే. కొన్ని చేపలను ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు చాలామంది. అరుదైన చేపలు జాలర్లకు అంత సులువు చిక్కవు. ఇదిల ఉంటే.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన ఒక భారీ చేప ఇప్పుడు వార్తలో నిలిచింది. అంతర్వేది నది తీరంలో మత్స్యకారుల వలలో ఓ పులస చేప చిక్కింది.

అయితే ఈ చేప ఎంత ధర పలికిందో తెలుసా.. ఆ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ పులస చేపను స్థానిక మత్య్సకారులు మార్కెట్‌లో వేలానికి పెట్టగా పులస ప్రియులు ఎగబడి మరీ పాల్గొన్నారు. వేలంలో మొదట రూ.2 వేల నుండి మొదలైంది. ఈ వేలం నిర్వహించ క్రమంలో చాలామంది గూమిగూడారు. చివరికి నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ.18 వేలకు దక్కించుకున్నాడు.

దాదాపు ఆ పులస చేప 2 కేజీల వరకు ఉంటుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో పులస చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. పులస చేప దొరికిందంటే చాలు ఎగబడి మరీ కొనుక్కుంటారు. ఇలా ఆ చేపకు అంత ధర పెట్టి తీసుకోవడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.