ఊళ్లలో చెరువులో చేపలు పట్టేటప్పుడు పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రతీ ఒక్కరూ ఆ చేపలను కొనుక్కునేందకు ఆసక్తి కనబరుస్తారు. అయితే అక్కడ కిలో చేపలు ఒక రేటు ఫిక్స్ చేసుకొని విక్రయిస్తుంటారు. చెరువులో ఎక్కువగా బంగారు తీగ, రవ్వలాంటి చేపలు ఉంటాయి. అయితే సముద్రంలో గానీ.. యేటిలో గానీ చేపలు పట్టేటప్పుడు కొన్ని అరుదైనవి కనిపిస్తుంటాయి.
జాలర్లకు అవి పడ్డాయంటే ఇక పండగే. కొన్ని చేపలను ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు చాలామంది. అరుదైన చేపలు జాలర్లకు అంత సులువు చిక్కవు. ఇదిల ఉంటే.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన ఒక భారీ చేప ఇప్పుడు వార్తలో నిలిచింది. అంతర్వేది నది తీరంలో మత్స్యకారుల వలలో ఓ పులస చేప చిక్కింది.
అయితే ఈ చేప ఎంత ధర పలికిందో తెలుసా.. ఆ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ పులస చేపను స్థానిక మత్య్సకారులు మార్కెట్లో వేలానికి పెట్టగా పులస ప్రియులు ఎగబడి మరీ పాల్గొన్నారు. వేలంలో మొదట రూ.2 వేల నుండి మొదలైంది. ఈ వేలం నిర్వహించ క్రమంలో చాలామంది గూమిగూడారు. చివరికి నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ.18 వేలకు దక్కించుకున్నాడు.
దాదాపు ఆ పులస చేప 2 కేజీల వరకు ఉంటుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో పులస చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. పులస చేప దొరికిందంటే చాలు ఎగబడి మరీ కొనుక్కుంటారు. ఇలా ఆ చేపకు అంత ధర పెట్టి తీసుకోవడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…