ఊళ్లలో చెరువులో చేపలు పట్టేటప్పుడు పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రతీ ఒక్కరూ ఆ చేపలను కొనుక్కునేందకు ఆసక్తి కనబరుస్తారు. అయితే అక్కడ కిలో చేపలు ఒక రేటు ఫిక్స్ చేసుకొని విక్రయిస్తుంటారు. చెరువులో ఎక్కువగా బంగారు తీగ, రవ్వలాంటి చేపలు ఉంటాయి. అయితే సముద్రంలో గానీ.. యేటిలో గానీ చేపలు పట్టేటప్పుడు కొన్ని అరుదైనవి కనిపిస్తుంటాయి.
జాలర్లకు అవి పడ్డాయంటే ఇక పండగే. కొన్ని చేపలను ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు చాలామంది. అరుదైన చేపలు జాలర్లకు అంత సులువు చిక్కవు. ఇదిల ఉంటే.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దొరికిన ఒక భారీ చేప ఇప్పుడు వార్తలో నిలిచింది. అంతర్వేది నది తీరంలో మత్స్యకారుల వలలో ఓ పులస చేప చిక్కింది.
అయితే ఈ చేప ఎంత ధర పలికిందో తెలుసా.. ఆ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ పులస చేపను స్థానిక మత్య్సకారులు మార్కెట్లో వేలానికి పెట్టగా పులస ప్రియులు ఎగబడి మరీ పాల్గొన్నారు. వేలంలో మొదట రూ.2 వేల నుండి మొదలైంది. ఈ వేలం నిర్వహించ క్రమంలో చాలామంది గూమిగూడారు. చివరికి నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ.18 వేలకు దక్కించుకున్నాడు.
దాదాపు ఆ పులస చేప 2 కేజీల వరకు ఉంటుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో పులస చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. పులస చేప దొరికిందంటే చాలు ఎగబడి మరీ కొనుక్కుంటారు. ఇలా ఆ చేపకు అంత ధర పెట్టి తీసుకోవడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…