Tag Archives: anushka sharma

Virat Kohli – Anushka Sharma: అద్దె ఇంట్లో ఉంటున్న విరుష్క దంపతులు.. ఇంటి రెంట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Virat Kohli -Anushka Sharma: అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు ఇండియాలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్.ఒకరు చిత్ర పరిశ్రమలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా మరొకరు ఇండియన్ క్రికెటర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. ఇల వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు. ఇకపోతే విరాట్ కోహ్లీ అనుష్క ఇద్దరు కూడా కోట్లు సంపాదిస్తూ ముంబైలో ఆలీబాగ్ ప్రాంతంలో కోట్లు విలువ చేసే ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇలా ఎంతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినప్పటికీ ఈ దంపతులు మాత్రం జుహూ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉన్నారని తెలుస్తోంది.

ముంబైలోని జుహు ప్రాంతంలో హై టైడ్ అనే బిల్డింగ్‌ లో నాలుగో ఫ్లోర్‌లో ఈ ఫ్లాట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతం నుంచి సీ వ్యూవ్ ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందట అందుకోసమే ఈ దంపతులు సొంత ఇంట్లో కాకుండా అద్దె ఇంట్లో ఉంటున్నారు.

Virat Kohli -Anushka Sharma: లక్షల్లో అద్దె చెల్లిస్తున్న విరుష్క దంపతులు..

ఇకపోతే ఈ ఇంటి కోసం ఈ దంపతులు నెలకు 2.72 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ ఇంటిలో అద్దెకు ఉండడం కోసం వీరి మధ్య అగ్రిమెంట్ కూడా కుదిరిందని తెలుస్తోంది. ఇక ఈ దంపతులు ఉన్న అపార్ట్మెంట్ మరెవరిదో కాదు క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ మాజీ క్రికెటర్ సమర్‌జీత్ సింగ్ గైక్వాడ్‌దే అని తెలుస్తుంది.

Viral Kohli : అలా చేయొద్దంటూ రిక్వస్ట్ చేస్తున్న కోహ్లీ… కారణం అదేనా ?

Viral Kohli : టీమిండియా ఆటగాడు విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క దంపతులకు వామికా అనే పాప ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పాప ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. విరుష్క జంట ఇప్పటి వరకు తమ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేయలేదు. వామికాను ప్రపంచానికి కనిపించకుండా అత్యంత జాగ్రత్త తీసుకుంటున్నారు కోహ్లీ.

virat koli requesting media and public about vamika images

కాగా దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో వన్డే సందర్భంగా విరాట్‌ కోహ్లి గారాల పట్టి వామికా కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. కోహ్లి సతీమణి అనుష్క శర్మ చేతుల్లో కేరింతలు కొడుతున్న చిన్నారి స్క్రీన్‌పై కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఎట్టకేలకు వామిక పాపను చూశామంటూ కొందరు సంబరపడిపోగా…. బ్రాడ్‌కా​స్టర్‌ ఇలా చేయడమేమిటని మరికొందరు మండిపడ్డారు.

virat koli requesting media and public about vamika images

విరుష్క కోరినట్లుగా వామిక విషయంలో గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాల్సిందని ఇలా చేయడం సరికాదని ట్రోల్‌ చేశారు. ఈ క్రమంలో చాలా మంది ఫొటోలను డిలీట్‌ చేయగా… కొన్ని వార్తా సంస్థలు సైతం తమ ఆర్టికల్స్‌లో వామిక ఫొటో కనబడకుండా జాగ్రత్తపడ్డాయి. ఇక ఈ విషయంపై విరాట్‌ కోహ్లి తాజాగా స్పందించాడు. వామిక ఫొటోలు బయటకు వచ్చిన విషయం తమకు తెలియదని… ఏదేమైనా వాటిని షేర్‌ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు.

అలా చేయకపోతే మిమ్మల్ని అభినందిస్తున్నాం అంటూ…

ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ‘‘నిన్న మైదానంలో మా కుమార్తె ఫొటోలు తీసిన విషయం తెలిసింది. నిజానికి కెమెరా ఫోకస్ మా మీద ఉందని తెలియదు. ఒకవేళ వామిక ఫొటోలు షేర్‌ చేయనట్లయితే మీ అందరికీ కృతజ్ఞతలు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం’’ అని అనుష్కతో కలిసి కోహ్లి ప్రకటన విడుదల చేశాడు. కాగా మూడో వన్డేలో కోహ్లి అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా… ఆఖరి వరకు పోరాడిన టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.

Jhulan Goswami-Anushka Sharma: ఆ బయోపిక్ తో అలరించనున్న అనుష్క శర్మ..టీజర్ విడుదల..!

Jhulan Goswami-Anushka Sharma: బయోపిక్ లు అనేవి సినీ పరిశ్రమలో కామన్ అయిపోయాయి. ఇటీవల ఎంఎస్ ధోనీ బయోపిక్ కూడా సినిమాలో వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత సినీ పరిశ్రమలో సీనియర్ హీరోల బయోపిక్ లు కూడా ఇటీవల సినిమాల రూపంలో వచ్చేస్తున్నాయి.

ఇటీవలే ‘రశ్మీ రాకెట్’ మూవీలో అథ్లెట్ గా నటించి, సినీ అభిమానుల మెప్పు పొందిన తాప్సీ పన్ను తాజాగా మిథాలీ రాజ్ బయో పిక్ షూటింగ్ పూర్తి చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ ను ‘శభాష్‌ మిథు’ పేరుతో శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించాడు.

తాజాగా అనుష్క శర్మ మరోసారి ఓ బయోపిక్ లో కనిపించనుంది. 2018లో ‘జీరో’లో చివరిగా కనిపించిన ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం “చక్దా ఎక్స్‌ప్రెస్”లో నటించబోతోంది. భారత మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోంది .

‘చక్దా ఎక్స్‌ప్రెస్’ టైటిల్ ఖారారు..


ఇక ఈసినిమా పేరును చక్దా ఎక్స్‌ప్రెస్ టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈమేరకు ఆమె టీజర్ ను తన ట్విట్టర్ ఖాతా లో పోస్టు చేసింది. ఈ సినిమాలో జులన్ జీవితాన్ని.. ఆమె క్రికెట్ లో రావడానికి పడ్డ కష్టాలను వివరించనున్నారు. క్రికెటర్ అంటే కేవలం పురుషులు మాత్రమే కాదు.. మహిళలు కూడా ఆడి చూపించగలరని.. వాళ్లకు కూడా ఈ రంగంలో కెరీర్ ఉంటుందని చెప్పే కథ ఇది. ఆమె వల్ల తరువాతి తరం అమ్మాయిలకు క్రికెట్ లో మెరుగైన కెరీర్ ఏర్పడింది అంటూ అనుష్క పోస్ట్ చేసింది. ఇక విరుష్క దంపతులు ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమె పేరు వామిక. అనుష్క శర్మ తన కుమార్తె వామిక పుట్టిన తర్వాత చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అయితే ఇది ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు కానీ.. నెట్ ఫ్లిక్స్ లో మాత్రం స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

కోహ్లీ డేటింగ్ చేసిన హీరోయిన్లు వీళ్లే..! అందులో మిల్కీ బ్యూటీతో పాటు మరికొంతమంది..

ఇండియాలో ప్రతీ ప్రేక్షకుడు ఎక్కువగా ఇష్టపడే విషయాల్లో క్రికెట్ ఒకటైతే.. మరొకటి సినిమా. ఇక ఇక్కడ క్రికెట్ గురించి చెప్పుకుంటే.. ఆస్ట్రేలియా కంటే వన్డేలో వరల్డ్ కప్ లు గెలుచుకుంది తక్కువే అయినా.. ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హీరోల కంటే కూడా టీమిండియా క్రికెటర్లకే ఎక్కువ పాపులారిటీ ఉందనడంలో సందేహం లేదు. ఇక విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమిండియా రథసారధి విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఉన్న రికార్టులను త్వరలోనే కోహ్లీ అధిగమించే సత్తా కూడా ఉందని కొందరు మాజీ క్రికెటర్లు కూడా చెప్పిన విషయం తెలిసిందే. అంతలా తన ఆటతో ఆకట్టుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాందించుకున్నాడు విరాట్.

2013 సంవత్సరంలో హెడ్ అండ్ షోల్డర్స్ షాంప్ ప్రకటన కోసం మొదటిసారిగా కలిసిన విరాట్, అనుష్క వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్లింది. వీరిద్దరు 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతక ముందే విరాట్ చాలామందితో ప్రేమాయణం నడిపినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో పాపులర్ హీరోయిన్లు కూడా ఉన్నట్లు టాక్. విరాట్ కోహ్లీకి మొదటి లవ్ తమిళం, కన్నడంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సాక్షి అగర్వాల్ తో ప్రేమాయాణం నడిపాడు.

ఆర్సీబీకి మద్దతుగా స్డేడియానికి వచ్చినప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడి.. తర్వాత వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఇషా బెల్లాతో రెండు ఏళ్లు లవ్ ఎపైర్ నడిపాడు. ఈమె బ్రెజిల్ కు చెందిన మోడల్. కొన్ని ఇండియన్ మూవీల్లో కూడా నటించింది. అమీర్ ఖాన్ తలాష్ మూవీ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇషా బెల్లా. తెలుగులోని విజయ్ దేవర కొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలోనూ నటించింది. 2013లో విరాట్ కోహ్లీతో ప్రేమాయణం నడిపింది. సింగపూర్ లో వీళ్లిద్దరూ కలిసి షాపింగ్ లాంటివి చేస్తుండగా మీడియాలకు కూడా దొరికిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరు విడిపోయారు.

విరాట్ కోహ్లీ హీరోయిన్ తమన్నాతో కలిసి 2012 లో ఓ అడ్వైజ్‌మెంట్‌లో నటించాడు. వీరిద్దరి మధ్య కొన్నేళ్ల వరకు ప్రేమాయాణం నడిచినట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎంపీఎల్ యాప్ కోసం ఇద్దరు మరో సారి యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా కన్నడ నటి సంజన గల్రానీతో కూడా కోహ్లీ లవ్ లో ఉన్నాడట. ఆమె బుజ్జిగాడు సినిమాలో నటించింది. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది సంజన గల్రానీ. పంజా సినిమాలో నటించిన సారా జేన్ దియాస్ తో కూడా విరాట్ కోహ్లీ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

అనుష్క చెప్పుల ఖరీదు తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే !!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినా అది వైరల్ గా మారుతుంది. అనుష్క శర్మ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ లందరూ ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో మూడున్నర నెలల పాటు సుదీర్ఘ పర్యటన చేయబోతున్న ఈ నేపథ్యంలో క్రికెటర్లు తమ వెంట వారి కుటుంబాన్ని తీసుకురావడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వంతో పాటు బీసీసీఐ అనుమతి తెలిపింది.

ఈ క్రమంలోనే క్రికెటర్లు అందరూ తమ కుటుంబంతో సహా ఇంగ్లాండ్ చేరుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లీ తోపాటు భార్య అనుష్కశర్మ ,కూతురు వామికా కూడా ఉన్నారు. ఇంగ్లాండ్ లో ఒక హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న కోహ్లీ కుటుంబం తాజాగా శనివారం సాయంత్రం అనుష్క హోటల్ గది నుంచి బయటకు వచ్చి రోజ్ బౌల్ స్టేడియం బాల్కనీలో నిల్చొని దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

అనుష్క శర్మ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజనులకు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ నచ్చగా మరికొందరు చూపు మాత్రం ఆమె వేసుకున్న చెప్పుల పై పడింది.అనుష్క శర్మ కొత్త రకం గూచీ చెప్పల్ వేసుకొని కనిపించింది. చెప్పులపై గూచీ లోగోతో పాటు పూల్ సైడ్ ధరించే మోడల్‌లా తీర్చి దిద్దారు.అనుష్క ఈ విధమైనటువంటి చెప్పులు ధరించడంతో నెటిజన్లు చెప్పులు ధర ఎంత ఉంటుంది అన్న వేటలో పడి వేతకసాగారు.

ఈ క్రమంలోనే అనుష్క వేసుకున్న చెప్పుల ధర ఏకంగా రూ. 31,892 అంటా. ఇంత ఖరీదైన చెప్పులు వేసుకోవడంతో నెటిజన్లు ఆ డబ్బులతో మనం ఎన్ని జతల చెప్పులు కొనుక్కోవచ్ఛో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అనుష్క షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కూతురి విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న.. విరుష్క దంపతులు!

సెలబ్రిటీ కపుల్స్ గా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంటకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎంతోమంది అభిమానులను సంపాదించగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అదేస్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.స్టార్ సెలబ్రిటీ కపుల్స్ గా కొనసాగుతున్న ఈ జంట సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

ఈ ఏడాది ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తమ గారాలపట్టి ఫోటోలను మాత్రం ఈ జంట అభిమానులతో పంచుకోలేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ శనివారం ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలో తన కూతురు వామికా గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

పలువురు అభిమానులు తన కూతురు వామికా పేరుకు అర్థం ఏమిటి అని అడగగా అందుకు కోహ్లీ స్పందిస్తూ… వామికా అంటే దుర్గామాత మరొక పేరు అని వివరించారు. అదేవిధంగా మరికొందరు నెటిజన్లు మీ ముద్దుల తనయ ఫోటోలను మేము చూడవచ్చా? అని ప్రశ్నించగా అందుకు కోహ్లీ..”మా కూతురికి సోషల్ మీడియా అంటే ఏమిటి అనే అవగాహన కలిగే వరకు.. ఆమె కోరికలను వ్యక్తపరిచే గలిగే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని” అనుష్క తను ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ జంట తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల మనం ఇప్పుడప్పుడే వీరి గారాలపట్టిని చూడలేమని అర్థమవుతోంది. ఇకపోతే ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో కరోనా బాధితుల కోసం మీరు ఒక జంట రెండు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటిస్తూ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపడుతున్నారు.

కరోనా బాధితుల కోసం రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన విరుష్క దంపతులు!

దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయంగా కరోనా బాధితులను ఆదుకున్నారు. కొందరు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయగా, మరికొందరు ఆక్సిజన్ సిలిండర్ ల కోసం సహాయం చేస్తున్నారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి నగదు రూపంలో విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ క్రికెటర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కరోనా బాధితుల కోసం తమవంతు సాయంగా రూ.2 కోట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే కెంటో ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రజల నుంచి దాదాపు రూ.7 కోట్ల నిధులు సమీకరించనున్నారు. బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా, వైద్య సౌకర్యాలు, వైద్య పరికరాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా దేశంలో నెలకొన్న ఈ కష్ట సమయంలో ఈ జంట
యాక్ట్‌ గ్రాంట్స్‌ అనే సంస్థతో చేతులు కలిపారు.

ఈ సంస్థ ద్వారా ఏడు రోజులపాటు విరాళాలను సేకరించి ఆ డబ్బు ద్వారా దేశంలో వీలైనంత మందికి సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అందరం కలిసికట్టుగా ఉండి సహాయం చేసుకోవడం వల్ల వీలైనంత మంది ప్రాణాలను కాపాడుకోవచ్చనీ ఈ జంట ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదుకావడమే కాకుండా, వేల సంఖ్యలో మరణాలు సంభవించడం తమనెంతో కలచివేసిందని అందుకోసమే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ వీలైనంత మందికి సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మరెంతో మంది దాతలు వారికి తోచిన విధంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఆ పనులు చేస్తున్న విరాట్ కోహ్లీ.. ఫోటోలు వైరల్!

ఇండియన్ టాప్ సెలబ్రిటీస్ లో ఒకరైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరు. టీమిండియా క్రికెట్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ, బాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ అనుష్క శర్మ వీరిద్దరు ఏం చేసినా అది సెన్సేషనల్ గా మారుతుంది. వీరు చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటారు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే వీరు తాజాగా కోహ్లీ తన షూస్ శుభ్రం చేసుకుంటున్న ఫోటోను అనుష్క షేర్ చేశారు.

త్వరలో ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్న విరాట్ కోహ్లీ ఎంతోశ్రద్ధగా తనషూస్ ని శుభ్రపరచుకుంటూ ఆ ఫోటోలో మనకు కనిపిస్తాడు.”మట్టి తో ఉన్న తన షూస్ ని విరాట్ ఎంతో శ్రద్ధగా క్లీన్ చేస్తున్నాడు”అని క్యాప్షన్ తో ఆ ఫోటోను అనుష్క శర్మ తన ఇన్‌స్ట్రా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన సదరు నెటిజన్లు ఏంటి! కోహ్లీ ఇలాంటి పనులు కూడా చేస్తాడా…. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ హోటల్ లో ఉన్న ఈ జంట ఎంతో సరదాగా గడుపుతున్నారు. దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన కోహ్లీ టూర్ చివరిలోనే ఇండియాకు తిరిగి రానున్నట్లు తెలిపారు.

తన భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతిగా ఉన్న నేపథ్యంలో తన డెలివరీ జనవరిలో ఉండగా అనుష్కకు డెలివరీ సమయంలో తోడుగా ఉండాలని భావించిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ చివరిలో తిరిగి ఇండియాకు రావడానికి నిర్ణయం తీసుకున్నారు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయానికి బీసీసీఐ కూడా అంగీకారం తెలిపింది.

కోహ్లీ తీసుకున్న ఈ సెలవులపై నెటిజన్లు పలురకాలుగా స్పందించి కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ తన ఆనందకరమైన క్షణాలను గడపడం కోసం ఇండియాకు తిరిగి రావడం ఎంతో మంచి నిర్ణయం అని, కోహ్లీ తన వృత్తిపరంగా కంటే వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ తీసుకున్న ఈ సెలవులతో ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్టు తర్వాత ఇండియాకి రావడంతో భారత జట్టుకు కొంతవరకు కఠినతరం కావచ్చని మరి కొందరు భావిస్తున్నారు.