General News

కరోనా బాధితుల కోసం రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన విరుష్క దంపతులు!

దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయంగా కరోనా బాధితులను ఆదుకున్నారు. కొందరు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయగా, మరికొందరు ఆక్సిజన్ సిలిండర్ ల కోసం సహాయం చేస్తున్నారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి నగదు రూపంలో విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ క్రికెటర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కరోనా బాధితుల కోసం తమవంతు సాయంగా రూ.2 కోట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే కెంటో ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రజల నుంచి దాదాపు రూ.7 కోట్ల నిధులు సమీకరించనున్నారు. బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా, వైద్య సౌకర్యాలు, వైద్య పరికరాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా దేశంలో నెలకొన్న ఈ కష్ట సమయంలో ఈ జంట
యాక్ట్‌ గ్రాంట్స్‌ అనే సంస్థతో చేతులు కలిపారు.

ఈ సంస్థ ద్వారా ఏడు రోజులపాటు విరాళాలను సేకరించి ఆ డబ్బు ద్వారా దేశంలో వీలైనంత మందికి సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అందరం కలిసికట్టుగా ఉండి సహాయం చేసుకోవడం వల్ల వీలైనంత మంది ప్రాణాలను కాపాడుకోవచ్చనీ ఈ జంట ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదుకావడమే కాకుండా, వేల సంఖ్యలో మరణాలు సంభవించడం తమనెంతో కలచివేసిందని అందుకోసమే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ వీలైనంత మందికి సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మరెంతో మంది దాతలు వారికి తోచిన విధంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago