దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయంగా కరోనా బాధితులను ఆదుకున్నారు. కొందరు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయగా, మరికొందరు ఆక్సిజన్ సిలిండర్ ల కోసం సహాయం చేస్తున్నారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి నగదు రూపంలో విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ క్రికెటర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కరోనా బాధితుల కోసం తమవంతు సాయంగా రూ.2 కోట్లు ప్రకటించారు.
ఈ క్రమంలోనే కెంటో ప్లాట్ఫామ్ ద్వారా ప్రజల నుంచి దాదాపు రూ.7 కోట్ల నిధులు సమీకరించనున్నారు. బాధితులకు ఆక్సిజన్ సరఫరా, వైద్య సౌకర్యాలు, వైద్య పరికరాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా దేశంలో నెలకొన్న ఈ కష్ట సమయంలో ఈ జంట
యాక్ట్ గ్రాంట్స్ అనే సంస్థతో చేతులు కలిపారు.
ఈ సంస్థ ద్వారా ఏడు రోజులపాటు విరాళాలను సేకరించి ఆ డబ్బు ద్వారా దేశంలో వీలైనంత మందికి సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అందరం కలిసికట్టుగా ఉండి సహాయం చేసుకోవడం వల్ల వీలైనంత మంది ప్రాణాలను కాపాడుకోవచ్చనీ ఈ జంట ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదుకావడమే కాకుండా, వేల సంఖ్యలో మరణాలు సంభవించడం తమనెంతో కలచివేసిందని అందుకోసమే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ వీలైనంత మందికి సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మరెంతో మంది దాతలు వారికి తోచిన విధంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…
టాలీవుడ్, కోలీవుడ్లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…