Tag Archives: ayodhya

Upasana: అయోధ్య బాలరామయ్య సన్నిధిలో ఉపాసన.. అయోధ్యకు అపోలో సేవలు?

Upasana: మెగా కోడలిగా ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఉపాసన తాజాగా తన పుట్టింటి వారితో కలిసి అయోధ్య బాల రామయ్యను దర్శించుకున్నారు. ఈమె తన తాతయ్య ప్రతాపరెడ్డితో పాటు తన అమ్మమ్మ అమ్మతో కలిసి అయోధ్యలోని బాల రాముడిని దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ విధంగా ఉపాసన అయోధ్య రామయ్యను దర్శించుకోవడమే కాకుండా అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కూడా కలిశారు. ఇలా ఆయనతో కలిసి ఉపాసన అయోధ్యలో అపోలో హాస్పిటల్ ప్రారంభం గురించి ఎన్నో విషయాలను చర్చించారు. అనంతరం అపోలో హాస్పిటల్ ఫౌండర్ ప్రతాపరెడ్డి జీవిత చరిత్ర అయినటువంటి ది అపోలో స్టోరీస్ అనే పుస్తకాన్ని కూడా ముఖ్యమంత్రికి అందజేశారు.

ప్రతాపరెడ్డి అపోలో హాస్పిటల్ ఫౌండర్ అనే విషయం మనకు తెలిసిందే.ఈయన వైద్య రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరింప చేశారు. దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్ ఎన్నో ప్రధాన నగరాలలో ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యలో కూడా అపోలో హాస్పిటల్ ప్రారంభించాలనే ఆలోచన ఉపాసన చేశారు. ప్రస్తుతం అపోలో బాధ్యతలను తీసుకున్న ఉపాసన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎమర్జెన్సీ సేవలు ఉచితం..
ఇకపై అయోధ్యలో కూడా అపోలో హాస్పిటల్ ప్రారంభం కాబోతుందని అయితే అయోధ్యకు వచ్చే భక్తులకు ఎమర్జెన్సీ సేవలను అపోలో ఉచితంగా అందించబోతోంది అంటూ ఈ సందర్భంగా ఉపాసన తెలియజేయడమే కాకుండా తన తాతయ్య అపోలో సిబ్బందితో కలిసి దిగినటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.

Lavanya Tripathi : అయోధ్యలో జన్మించడం నా అదృష్టం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన లావణ్య త్రిపాఠి?

Lavanya Tripathi: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య. ఈ ముద్దుగుమ్మ మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఎట్టకేలకు ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది లావణ్య త్రిపాఠి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వరుసగా సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఆమె అయోధ్య గురించి ఒక ట్వీట్ కూడా చేసింది. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేసింది. అందులో ఏముంది అన్న విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు దాదాపుగా 500 ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరగడంతో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. దేశ ప్రజలు రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానాలు చేశారు. ఘనంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పలువురు సెలబ్రిటీలు ఆలయాలకు వెళ్లారు.

లావణ్య త్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది. లావణ్య అయోధ్యలో పుట్టడంతో ఆమెకు రామయ్య ఆలయంతో మరింత అటాచ్మెంట్ ఉంది. పద్దతిగా చీరలో రెడీ అయి, సీతారాముల పట్టాభిషేకం విగ్రహం ఉన్న భారీ హారం మెడలో ధరించి ఆమె ఫోటోలను షేర్ చేస్తూ రాముడి పుట్టిల్లు అయిన అయోధ్యలో నేను పుట్టడం, ఈ అద్భుతమైం కార్యక్రమాన్ని చూడటం నా అదృష్టం. రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూడటం నాతో పాటు దేశప్రజలందరికి గర్వకారణం. ఈ సందర్భంగా రామ్ పరివారాన్ని నగలుగా ధరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాణ ప్రతిష్ట వేడుక అయోధ్యకు మాత్రమే కాదు దేశం మొత్తానికి సంబంధించింది.

గుండెల్లో దైవభక్తిని నింపుకుందాం…

దేశం మొత్తం కలిసి వచ్చే సమయం ఇది. దేశంలోని ప్రజలందరి మధ్య ఐక్యత భావాన్ని నెలకొల్పుతుంది. పెదవులపై జై శ్రీరామ్ అంటూ, గుండెల్లో దైవభక్తిని నింపుకొని శాంతి దేశమంతా ఉండాలని ప్రార్ధిద్దాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో లావణ్య పోస్ట్ వైరల్ అవ్వగా లావణ్య అయోధ్యలో పుట్టిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/C2ZIwQRysKV/?utm_source=ig_web_copy_link

Prabhas – Ntr: బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాని ప్రభాస్, ఎన్టీఆర్.. కారణం అదేనా!

Prabhas – Ntr: తాజాగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ సమయం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక నిన్నటి రోజున అయోధ్య ప్రాంగణమంతా కూడా రామనామ స్మరణలతో మారుమోగిపోయింది. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి కొలువుదీరిన తరువాత రామమందిరంతో పాటు సరయూ నదీతీరం దీపోత్సవ్ ​కార్యక్రమంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది.

రామనామం మారుమోగింది. గర్భగుడిలో కొలువుతీరిన బాలరాముడిని చూసి భక్తులు పులకరించిపోతున్నారు. ఇక నిన్న జరిగిన బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ కూడా హాజరైన విషయం తెలిసిందే. వీరితోపాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు కూడా ఆహ్వానం అందింది. కానీ ఈ ఇద్దరు హీరోలు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

అయోధ్యకు రాకపోవడం కారణం అదే..

అయితే ఇద్దరు హీరోలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి గల కారణం షూటింగ్స్ తో బిజీగా ఉండటమే అని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమాషూటింగ్ లో ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు హాజరుకాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా హీరో ప్రభాస్ అయోధ్యలోని రామ మందిరానికి దాదాపుగా 50 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Mohan Babu : అయోధ్య నుంచి పిలుపు వచ్చింది.. భయపడి వెళ్లలేదు : మోహన్ బాబు

Mohan Babu: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రామ మందిరం ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. కనీవిని ఎరుగని రీతిలో ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇక ఈ రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, క్రీడారంగం వారు ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరు కానున్నారు.

ఇప్పటికే సెలబ్రిటీలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు అందుకు సంబంధించిన ఆహ్వానాలు కూడా పంపారు. నేడు అనగా 21వ తేదీన కొందరు అక్కడికి చేరుకోనుండగా మరికొందరు రేపు అనగా 22వ తేదీ అక్కడికి చేరుకోనున్నారు. అయితే తనకు కూడా అయోధ్యకు ఆహ్వానం అందింది అని తెలిపారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. తాజాగా ఫిలింనగర్ లో అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్ట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు అయోధ్యకు ఆహ్వానం అందినప్పటికీ భయపడి తాను వెళ్లలేదని చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరి ఏ విషయంలో మోహన్ బాబు భయపడ్డారు ఆయన ఏం చెప్పారు అన్న వివరాల్లోకి వెళితే.. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలిం నగర్‌లోని దైవ సన్నిధానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అన్ని దేవతా మూర్తులు ఉన్నాయి. విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు.

భయపడి వెల్లలేదు..

అయోధ్య రామాలయ ప్రారంభాన్ని ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఈ వేడుక కోసం నాకు ఆహ్వానం అందింది. సెక్యూరిటీ ఇస్తాము అన్నారు. అయినా భయపడి వెళ్లట్లేదు. కానీ ఇక్కడి దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి 22 వరకు అనేక పూజా కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

https://youtu.be/1UxwX8raSg4

Prabhas: అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ 50 కోట్ల విరాళం.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

Prabhas: అయోధ్య రామ మందిరం ఏర్పాటుకు మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న సంగతి మనకు తెలిసిందే . హిందువుల కల అయినటువంటి రామ మందిరం ఏర్పాటుకు ముహూర్తం కూడా నిర్ణయం చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ పాల్గొనడమే కాకుండా అయోధ్యకు వచ్చే భక్తులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయబోతున్నారని దానికోసం ఈయన సుమారు 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రభాస్ 50 కోట్ల వరకు విరాళం అందిస్తున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలపై ఆయన టీమ్ స్పందించారు.

ఈ సందర్భంగా ప్రభాస్ టీమ్ స్పందిస్తూ అయోధ్య రామ మందిరం భోజన ఏర్పాట్లు కోసం ప్రభాస్ 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అంటూ వచ్చినటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా కూడా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారడంతో ప్రభాస్ విరాళం గురించి అందరికీ క్లారిటీ వచ్చేసింది.

ఆ వార్తలన్నీ అవాస్తవం…

ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వంటి వారందరికీ కూడా ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన రాజా సాబ్ సినిమాతో పాటు కల్కి, స్పిరిట్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Amithab Bachchan: అయోధ్యలో భూమిని కొన్న అమితాబ్..ఖరీదు ఏంతంటే?

Amithab Bachchan: హిందువుల ఆధ్యాత్మిక ప్రదేశం అయినటువంటి అయోధ్య ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. హిందువుల కొన్ని దశాబ్దాల కల అయినటువంటి రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న సంగతి తెలిసిందే.. ఈనెల 22వ తేదీ ఈ వేడుక జరగబోతోంది.

ఈ విధంగా శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్నటువంటి తరుణంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం అందుతుంది. ఇలా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రోజు సెలబ్రిటీలందరూ కూడా ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు.

ఇదిలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ముంబయికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అయోధ్యలో అభివృద్ధి చేసిన వెంచర్‌లో బిగ్ బీ స్థలాన్ని కొనుగోలు చేశారట. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ.14.5కోట్లు ఉంటుందని సమాచారం

కోట్లు విలువ…

ఈ స్థలం భవ్య రామమందిరానికి దగ్గర్లోనే అని తెలుస్తోంది. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రోజే 51 ఎకరాల్లో సరయూ నది వద్ద ఆ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఓ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ కి కూడా ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయోధ్యకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో నేను ఇల్లు నిర్మించుకోవడం కోసం ఎదురుచూస్తున్నా అంటూ గతంలో అమితాబ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Adi Reddy: అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చిన బిగ్ బాస్ ఆదిరెడ్డి!

Adi Reddy: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఆలయంలో జనవరి 22వ తేదీ స్వామి వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో మంది ఎన్నో విధాలుగా విరాళాలు అందజేశారు అదే విధంగా భక్తులు కూడా వారికి తోచిన విధంగా కానుకలను రాములోరికి పంపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా స్వామివారి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తూ తమ వంతు సహాయంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రివ్యూయర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆదిరెడ్డి కూడా రామ మందిరానికి తన వంతు సహాయం చేశారు. ఈ విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అయోధ్య రామ మందిరానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళం అందించానని ఆదిరెడ్డి తెలిపారు. రామ మందిరం ఏర్పాటు చేయడం అనేది మన హిందువులందరి కళ ఇది మన కల అందుకే ఉడత భక్తితో తాను కూడా కొంత డబ్బు విరాళంగా ఇచ్చానని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు విరాళం ఇవ్వాలని ఆదిరెడ్డి ఈ సందర్భంగా అందరినీ కోరారు .

రామ మందిరం మన కల..

ఇక జనవరి 22వ తేదీ జరగబోయే రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు క్రీడా రంగానికి చెందినటువంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

భక్తులకు శుభవార్త.. ఆ రోజు నుంచే అయోధ్య రామయ్య దర్శనం ప్రారంభం..?

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది.. ఎప్పుడు దర్శనం చేసుకోవాలనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. గతేడాది ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతులమీదుగా రామ మందిర నిర్మాణం ప్రారంభమై యేడాది పూర్తవుతోంది. దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌, పరిశోధనా కేంద్రం సహా అన్నీ కలిపి 2025 నాటికి నిర్మాణం పూర్తికానుంది.

అయితే నిర్మాణం పూర్తైనంత వరకు భక్తులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. 2023 డిసెంబర్ నాటికే భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం. అయితే అప్పటి వరకు పాక్షికంగా ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. రామ్ లల్లా ఉన్నటువంటి గర్భగుడి ఆలయం పూర్తి కానుంది. మిగతా ప్రాంతంలో నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఆలయంతో పాటు మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌లు, పరిశోధనా కేంద్రం కూడా ఆలయ సముదాయంలో నిర్మించబడతాయి.

ప్రస్తుతం దేవాలయ మొదటి దశ పనులు సాగుతున్నాయి. నవంబర్ నెలలో రెండవ దశ పనులు ప్రారంభం అవుతాయని ఇంజినీర్లు తెలిపారు. అయితే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ భక్తులకు పెద్ద ఆఫర్ ప్రకటించింది. రామ భక్తులందరూ ఇప్పుడు రామ మందిర నిర్మాణ పనులను అక్కడికి వెళ్లి చూడవచ్చు. దీని కోసం ఒక వ్యూపాయింట్ నిర్మించబడుతుంది. అయోధ్యకు వచ్చే భక్తులు ఆలయ నిర్మాణ పనులను తమ కళ్లతో చూడగలుగుతారని ప్రకటించారు.

గంతంలో టెంట్ లో కూర్చొని రామ్ లల్లాను దర్శించుకునే వారు. ఇప్పడు దానిని దేవాలయంగా మార్చేశారు. మూడు అంతస్తులుగా అంగరంగ వైభవంగా రూపొందనున్న రామ మందిరంలో ఐదు గోపురాలు ఉంటాయి. శిథిలాలు తొలగించిన స్థలాలను నింపేందుకు ఇప్పటికే రోజుకు 140 ట్రక్కుల మట్టి వస్తోంది. ఈ పనులు మార్చి నుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులు ఐఐటీ చెన్నై ఆధ్వర్యంలో సాగుతున్నాయి.