ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది.. ఎప్పుడు దర్శనం చేసుకోవాలనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. గతేడాది ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతులమీదుగా రామ మందిర నిర్మాణం ప్రారంభమై యేడాది పూర్తవుతోంది. దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్, పరిశోధనా కేంద్రం సహా అన్నీ కలిపి 2025 నాటికి నిర్మాణం పూర్తికానుంది.
అయితే నిర్మాణం పూర్తైనంత వరకు భక్తులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. 2023 డిసెంబర్ నాటికే భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం. అయితే అప్పటి వరకు పాక్షికంగా ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. రామ్ లల్లా ఉన్నటువంటి గర్భగుడి ఆలయం పూర్తి కానుంది. మిగతా ప్రాంతంలో నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఆలయంతో పాటు మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్లు, పరిశోధనా కేంద్రం కూడా ఆలయ సముదాయంలో నిర్మించబడతాయి.
ప్రస్తుతం దేవాలయ మొదటి దశ పనులు సాగుతున్నాయి. నవంబర్ నెలలో రెండవ దశ పనులు ప్రారంభం అవుతాయని ఇంజినీర్లు తెలిపారు. అయితే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ భక్తులకు పెద్ద ఆఫర్ ప్రకటించింది. రామ భక్తులందరూ ఇప్పుడు రామ మందిర నిర్మాణ పనులను అక్కడికి వెళ్లి చూడవచ్చు. దీని కోసం ఒక వ్యూపాయింట్ నిర్మించబడుతుంది. అయోధ్యకు వచ్చే భక్తులు ఆలయ నిర్మాణ పనులను తమ కళ్లతో చూడగలుగుతారని ప్రకటించారు.
గంతంలో టెంట్ లో కూర్చొని రామ్ లల్లాను దర్శించుకునే వారు. ఇప్పడు దానిని దేవాలయంగా మార్చేశారు. మూడు అంతస్తులుగా అంగరంగ వైభవంగా రూపొందనున్న రామ మందిరంలో ఐదు గోపురాలు ఉంటాయి. శిథిలాలు తొలగించిన స్థలాలను నింపేందుకు ఇప్పటికే రోజుకు 140 ట్రక్కుల మట్టి వస్తోంది. ఈ పనులు మార్చి నుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులు ఐఐటీ చెన్నై ఆధ్వర్యంలో సాగుతున్నాయి.
కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) సమస్య చాలా మందికి తరచూ ఎదురయ్యే జీర్ణ సమస్యల్లో ఒకటి. ఎక్కువగా తినడం, వేడి వాతావరణం,…
పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ఇప్పటివరకు ఎక్కువగా జీర్ణవ్యవస్థ కోణంలోనే చర్చించేవారు.…
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…