Prabhas: అయోధ్య రామ మందిరం ఏర్పాటుకు మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న సంగతి మనకు తెలిసిందే . హిందువుల కల అయినటువంటి రామ మందిరం ఏర్పాటుకు ముహూర్తం కూడా నిర్ణయం చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ పాల్గొనడమే కాకుండా అయోధ్యకు వచ్చే భక్తులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయబోతున్నారని దానికోసం ఈయన సుమారు 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రభాస్ 50 కోట్ల వరకు విరాళం అందిస్తున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలపై ఆయన టీమ్ స్పందించారు.
ఈ సందర్భంగా ప్రభాస్ టీమ్ స్పందిస్తూ అయోధ్య రామ మందిరం భోజన ఏర్పాట్లు కోసం ప్రభాస్ 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అంటూ వచ్చినటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా కూడా అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారడంతో ప్రభాస్ విరాళం గురించి అందరికీ క్లారిటీ వచ్చేసింది.
ఆ వార్తలన్నీ అవాస్తవం…
ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వంటి వారందరికీ కూడా ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన రాజా సాబ్ సినిమాతో పాటు కల్కి, స్పిరిట్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…