Tag Archives: bigg boss 5

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ఆర్.జే కాజల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రేక్షకులు ఎంతో ఎదురు చూసే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకు ఆదివారం ఎంతో అట్టహాసంగా మొదలైంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు అందరూ ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీజన్ ఫైవ్ లోకి ఏకంగా 19మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 17వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు ఆర్.జే కాజల్. ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యూట్యూబ్ ఛానల్ ద్వారా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు.

ఇలా యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. అయితే ఈమె గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. ఇండస్ట్రీలో అందరికీ కాజల్ గా పరిచయమైన ఈమె అసలు పేరు రహిమునిస్సా మెహ్ సబీనా. ఈమె తండ్రి రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ రిటైర్ కాగా అమ్మ హౌస్ వైఫ్. వీరు ముగ్గురు అమ్మాయిలు కాగా కాజల్ చిన్నమ్మాయి.

చదువు పరంగా కాజల్ ఎమ్మెస్సీ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే ఈమెకు పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల పాఠశాలలో పలు కార్యక్రమాలలో పాటలు పాడుతూ ఉండేది. ఇలా తన చదువును కొనసాగిస్తున్న సమయంలో హిందూ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి అయిన తర్వాత విజయవాడలో కృష్ణ అనే ఓ వ్యక్తి ద్వారా ఎఫ్.ఎంలో ఆడిషన్ ఇవ్వడంతో ఈమెని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. వీరికి ఒక పాప కూడా ఉంది.

ఈ విధంగా హైదరాబాద్ చేరుకున్న కాజల్ ఎఫ్.ఎంలో సక్సెస్ అందుకున్నారు. మొట్టమొదటిసారిగా “నిన్ను కలిసాక “అనే చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కాజల్ సుమారు 100 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా మంచు మనోజ్ ,తాప్సీ నటించిన “ఝుమ్మందినాదం” అనే సినిమాలో 30 సెకండ్ల పాటు కనిపించింది.

సుమారు 14 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లో ఉంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న కాజల్ కు సూర్య, తమన్నా తన ఫేవరెట్ హీరో హీరోయిన్ లని ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత పాపులారిటీ అయిన కాజల్ హిందీ బిగ్ బాస్ చూస్తూ ఎలాగైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భావించేది. కానీ ఇన్ని రోజులకు తనకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం వచ్చింది.

‘జబర్దస్త్‌’లో ముద్దులతో రెచ్చిపోయిన ఆట సందీప్.. జ్యోతి.. బిగ్‌బాస్‌ మిస్ అయినందుకా అంటూ ట్రోలింగ్..

జబర్దస్త్.. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో ప్రేక్షకాదరణ పొందుతున్న టీవీ షో. ఎంతో మందిని కమెడీయన్స్‌గా తీర్చిదిద్ది.. వారికంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. సుధీర్‌లాంటి వాళ్లకు సినిమా ఛాన్స్‌లనూ తెచ్చిపెట్టింది. ఇంతకుముందు ఇలాంటి ప్రోగ్రామ్స్‌ ఎన్ని వచ్చినా.. ఇటీవలి కాలంలో పోటీగా అలాంటి షోలు ప్రారంభించినా.. జబర్దస్త్‌కు క్రేజ్‌ను అందుకోలేకపోయారు. మొదట జబర్దస్త్‌తో ప్రారంభమైనా.. ఆ తర్వాత వచ్చిన విశేష స్పందనను చూసి ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను పరిచయం చేసి, మరికొంతమంది కొత్త ఆర్టిస్ట్‌లకు అవకాశం కల్పించారు. నిజం చెప్పాలంటే టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఇదో మంచి వేదిక. అలాంటి షోని ఇన్నాళ్లు ఆదరిస్తున్నారంటే కారణం… వారానికో కొత్తదనంతో నవ్వించడం అంటే మామూలు విషయం కాదుకదా..!

ఇకపోతే ప్రతి గురు, శుక్ర వారాల్లో ప్రసారమయ్యే ఈ షోని ఇంటిల్లిపాదీ చూసే విధంగా పాపులర్‌ అయింది. అయితే కొన్ని సందర్భాల్లో చేసే మితిమీరిన కామెడీ పలు విమర్శలకు తావిస్తోంది. ఇంతకుముందు వేణు, ఆదిలాంటి వారు కొన్ని సంఘటనలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అలాగే తాజాగా రిలీజైన ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ప్రోమోపైనా పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కారణం, అందులో ఆట ఫేమ్ సందీప్, అతని భార్య జ్యోతి చేసిన ఓ స్కిట్‌లోని కొన్ని సన్నివేశాలు. స్కిట్‌లో భాగంగా జ్యోతి… సందీప్‌ని కౌగిలించుకొని, ముద్దు పెడుతుంది. అంతేకాదు.. ఆమె కన్నుకొడుతూ చేసిన ఎక్స్‌ప్రెషన్‌ ఈ ప్రోమో కు హైలెట్ అయ్యింది.

https://youtu.be/W9LYjBnK880

ఇకపోతే… దీన్నంతటినీ చూస్తున్న జడ్జీలు రోజా, మనోలు ఆశ్చర్యానికి గురవుతారు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అందరూ చూసేవిధంగా నవ్వులు కురిపించమంటే.. ఇలా శ్రుతిమించిన సన్నివేశాలు పెట్టడం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సందీప్ వెళ్తున్నారనే వార్తలు రాగా.. అది నిజం కాదని షో ప్రారంభంతో తేలిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఆ షోలో ఛాన్స్ మిస్‌ అయిందని.. ఈ షోలో రెచ్చిపోతున్నారా అంటూ మరికొందరు నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియా కష్టాలు తెలిస్తే.. కన్నీళ్లాగవు!

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేదీ ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు ఒక్కొక్కరు స్పెషల్ సాంగ్స్ ద్వారా వేదికపైకి ఎంట్రీ ఇస్తూ ఆ తర్వాత హౌస్ లోకి అడుగు పెడుతున్నారు. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి 7 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు ఆర్టిస్ట్ ప్రియా.

ఈమె ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో, అక్క పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కెరియర్ పరంగా తన జీవితం ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ నిజ జీవితం మాత్రం తన జీవితం సుఖంగా సాగిపో లేదని, తనబయో డేటాని పొయెటిక్ గా వివరిస్తూ కన్నీళ్లు పెట్టించింది ప్రియా. తన జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ తన జీవితం ఎన్నో మలుపులు తిరిగిందని, తన జీవితం పూల బాటలో పయనించలేదని తెలిపారు.

ఆమె జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని, జరిగిన సంఘటన తన కూతురు మరణం అంటూ, తన మరణం తనని బాగా క్రుంగదీసిందని, తన ముద్దుల కూతురు ఇప్పటికీ తనతో లేదనే చేదు నిజాన్ని తన మనసులోనే దాచుకుంటూ బాగా కుమిలి పోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో తన కూతురు ఫోటోను చూస్తూ కన్నీరు పెట్టుకుంది.

అయితే తన జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు అన్నింటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవడానికి, తన కాళ్ళపై తాను నిలబడటానికి ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపును తెచ్చుకున్న ప్రియా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన ఈమె బిగ్ బాస్ ద్వారా ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారో వేచి చూడాల్సిందే.

బిగ్ బాస్ నుంచి బిగ్ సర్ ప్రైజ్… 22 నుంచి క్వారంటైన్..!

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో గురించి రోజుకు కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం గురించి వస్తున్న వార్తలకు త్వరలోనే బిగ్ బాస్ చెక్ పెట్టనుంది. కరోనా ప్రభావం వల్ల ఈ ఏడాది బిగ్ బాస్ ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోగోను విడుదల చేస్తూ ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతోంది అంటూ నిర్వాహకులు తెలియజేశారు.

బిగ్ బాస్ సెప్టెంబర్ ఐదు నుంచి ప్రసారం కాబోతుందనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే తొందరలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ నుంచి సరికొత్త సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 15న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కంటెస్టెంట్ ల ఎంపిక పూర్తి అయిందని, వారందరిని ఆగస్టు 22వ తేదీన క్వారంటైన్ లోకి పంపించనున్నారని సమాచారం.15 రోజులు క్వారంటైన్ పూర్తిచేసుకున్న కంటెస్టెంట్ లో నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు డోస్ లు పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు.

ఈ క్రమంలోనే ఈసారి సీజన్ ఫైవ్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్లేనంటూ కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ జశ్వంత్, శ్వేత, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక,ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి,నటి లహరి, నవ్వస్వామి, కార్తీక దీపం భాగ్యం పేర్లు వినపడుతున్నాయి. అదేవిధంగా ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు.

బిగ్ బాస్ లోకి సిరి హనుమంత్.. అందమైన ఫోటోలను షేర్ చేస్తూ?

బుల్లితెరపై త్వరలోనే ప్రారంభం కానున్నరియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయం ఒక హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా సోషల్ మీడియా సెలబ్రిటీస్, యాంకర్ ల పేర్లు వినబడుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా మరొక నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రముఖ యాంకర్ గా, పలు సీరియల్స్ లో నటించిన సిరి హనుమంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు బలంగా వినబడుతున్నాయి. కెరియర్ మొదట్లో యాంకర్ గా పలు చానళ్లలో పనిచేసిన ఈమె ఉయ్యాల జంపాల అనే సీరియల్ ద్వారా బుల్లితెర నటిగా పరిచయమయ్యారు. ఆ తరువాత మోహిని, అగ్నిసాక్షి వంటి పలు సీరియల్స్ లో నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.

సీరియల్స్ మాత్రమే కాకుండా శ్రీహాన్ తో కలసి సిరి సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు షార్ట్ ఫిల్మ్‌‌తో పాటు అనేక వెబ్ సిరీస్‌లలో కలిసి జంటగా నటించారు. ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం కొనసాగింది. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అయిన 100 పర్సంట్ లవ్ కార్యక్రమంలో వీరిద్దరికి నిశ్చితార్థాన్ని ఎంతో ఘనంగా చేశారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సిరి తాజాగా తన అందమైన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేశారు.సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళుతున్నారని ప్రచారం వినబడుతోంది.మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే బిగ్ బాస్ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండాలి.

బిగ్ బాస్ 5 లో పాయల్ రాజపుత్.. మాములు రచ్చ కాదుగా !!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఒక్క సినిమాతోనే యువత మనసులు దోచుకున్న ఈ బ్యూటీ తొలిసారి నటనకే మంచి క్రేజ్ అందుకుంది. ఇక తన అందాలతో బాగా పిచ్చెక్కిస్తుంది. అతి తక్కువ సమయంలో అభిమానుల నుండి ఓ క్రేజ్ అందుకున్న పాయల్ ఆ తర్వాత సినిమాలకు అంత సక్సెస్ ను సాధించుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది.

2017 లో పంజాబీ సినిమా ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమా తో ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి క్రేజ్ అందుకుంది. ఇక వరుస అవకాశాలు అందుకోగా అవి ప్లాఫ్ ని అందించాయి. ఇక తాజాగా ఈ బ్యూటీ బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుందట.

ఇప్పటికే బిగ్ బాస్ నాలుగు సీజన్ లను పూర్తి చేసుకోగా తాజాగా సీజన్ 5 కి ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రస్తుతం జూమ్ ద్వారా కంటెస్టెంట్ లను ఎంపిక చేసుకోగా ఇందులో తాజాగా పాయల్ రాజ్ పుత్ ఎంపికైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఈ షోకి సంబంధించిన పనులు వాయిదా పడగా తాజాగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి త్వరత్వరగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక పాయల్ ఇందులో ఎంపికైనట్లు తెలియగా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట.

ఇక ఈ బ్యూటీ హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ కూడా మెప్పించగా ఇటీవలే అక్కినేని నాగార్జున నటించనున్న బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్ కోసం పాయల్ ను సంప్రదించారని ప్రచారాలు జరిగాయని తెలియగా ఇందులో ఎటువంటి నిజం లేదని పాయల్ పుకార్లను తోసిపుచ్చింది.