బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేదీ ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు ఒక్కొక్కరు స్పెషల్ సాంగ్స్ ద్వారా వేదికపైకి ఎంట్రీ ఇస్తూ ఆ తర్వాత హౌస్ లోకి అడుగు పెడుతున్నారు. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి 7 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు ఆర్టిస్ట్ ప్రియా.
ఈమె ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో, అక్క పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కెరియర్ పరంగా తన జీవితం ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ నిజ జీవితం మాత్రం తన జీవితం సుఖంగా సాగిపో లేదని, తనబయో డేటాని పొయెటిక్ గా వివరిస్తూ కన్నీళ్లు పెట్టించింది ప్రియా. తన జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ తన జీవితం ఎన్నో మలుపులు తిరిగిందని, తన జీవితం పూల బాటలో పయనించలేదని తెలిపారు.
ఆమె జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని, జరిగిన సంఘటన తన కూతురు మరణం అంటూ, తన మరణం తనని బాగా క్రుంగదీసిందని, తన ముద్దుల కూతురు ఇప్పటికీ తనతో లేదనే చేదు నిజాన్ని తన మనసులోనే దాచుకుంటూ బాగా కుమిలి పోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో తన కూతురు ఫోటోను చూస్తూ కన్నీరు పెట్టుకుంది.
అయితే తన జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు అన్నింటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవడానికి, తన కాళ్ళపై తాను నిలబడటానికి ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపును తెచ్చుకున్న ప్రియా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన ఈమె బిగ్ బాస్ ద్వారా ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారో వేచి చూడాల్సిందే.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…