తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ గురించి అందరికీ తెలిసినదే. చిత్రం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యి మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన దర్శకుడుగా మాత్రమే అందరికీ తెలుసు. అయితే ఇండస్ట్రీ లోకి రాకముందు ఆయన ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి తన తండ్రి ఏం చేసేవారు అనే విషయాల గురించి చాలా మందికి తెలియదు. తేజ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తన అక్కల సహాయంతో ప్రస్తుతం ఈ స్థాయికి వచ్చారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే తేజ కెమెరా డిపార్ట్మెంట్ లో చేరి, ఆ తరువాత కెమెరా ఆపరేటివ్ గా, డైరెక్టర్ గా ప్రస్తుతం గొప్ప స్థాయిలో ఉన్నారు. దర్శకుడు తేజ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన తండ్రి పేరు జె.బి.కె. చౌదరి. అందరూ ఆత్మీయంగా తనని జెబీకే అని పిలుచుకునేవారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జెబీకే తన మిత్రుల సహాయంతో “ధర్మపత్ని” అనే సినిమాను చేశారు.
జెబీకే, రాణి దంపతులకు ఇద్దరు కూతుర్ల తరువాత తేజ జన్మించారు. తేజ అసలు పేరు ధర్మ తేజ. అప్పటికి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ పేరు జయంతి ధర్మతేజ ఉండేవారు. ఆయన పేరున ఇన్స్పిరేషన్ గా తీసుకొని తన కొడుకుకు ఆ పేరును పెట్టారు. తన కొడుకు పుట్టిన తరువాత తన తండ్రి జపాన్ కి హ్యూమన్ హెయిర్ ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేసేవారు. అయితే వ్యాపారంలో బాగా నష్టం రావడమే కాకుండా తన భార్య మృతి చెందడంతో ఎంతో కుంగిపోయారు.
ఈ క్రమంలోనే తేజ పది సంవత్సరాల వయసులో తల్లి తండ్రి ఇద్దరు మరణించగా తన అక్కల సహాయంతో ఉన్నత చదువులు చదివారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండడంతో ముంబైకి వెళ్లి ఇండస్ట్రీ లో కెమెరా డిపార్ట్మెంట్ లో చేరారు. ఈ విధంగా ఎన్నో సినిమాలలో పనిచేసిన తేజకి రామ్ గోపాల్ వర్మ పరిచయం కావడంతో ఆయన తెరకెక్కించిన “శివ” సినిమాకు కెమెరామెన్ ఆపరేటర్ గా పని చేశారు. అలాగే వర్మ “రాత్రి” సినిమాతో ఫోటోగ్రాఫర్ గా మారారు.
ఇలా ఎన్నో సినిమాలలో కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేసిన తేజ రామానాయుడు గారిని ఒప్పించి కేవలం 30 లక్షల బడ్జెట్ తో ఉదయ్ కిరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ “చిత్రం” సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…