సాధారణంగా సినిమా ధియేటర్ కి వెళ్తే సినిమాను కేవలం ఒక రెండు గంటల పాటు ఎంతో ఆసక్తిగా కూర్చుని చూస్తాము. అయితే బాహుబలి వంటి చిత్రాలను మరో అరగంట ఓపికతో కూర్చుని చూడవచ్చు కాని అంతకు మించి అంటే ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ఆసక్తి కనబరచరు. అందుకోసమే ఈ మధ్యకాలంలో సినిమా ఎక్కువ నిడివి ఉంటే దానిని రెండు భాగాలుగా చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఓకే సినిమాను ఏకంగా నాలుగు గంటలపాటు థియేటర్లలో ప్రదర్శితం అయిన సినిమాలు కూడా ఉన్నాయి.
నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాలకు 2 ఇంటర్వెల్ వేసి బ్రేక్ ఇచ్చేవారంటే వినడానికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అయితే అలాంటి సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం పాలయ్యాయి.
ఇలాంటి చిత్రాలలో మొదటగా చెప్పుకోవాల్సిన చిత్రం జె పి దత్త తీసిన ఎల్ ఓ సి కార్గిల్. సుదీర్ఘమైన యుద్ధ పోరాటాలతో ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇందులో అక్కినేని నాగార్జున కూడా నటించారు. ఇలా ఈ సినిమా 4 గంటల 15 నిమిషాల నిడివి ఉంది. ఇందులో యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో అసహనానికి గురి చేసాయి.
ఈ సినిమా కంటే ముందుగానే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు నటుడు రాజ్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేరా నామ్ జోకర్ 4 గంటల 4 నిమిషాల నిడివి ఉంది. జీవితంలో విషాద ప్రేమ కథ సాగదీసి చెప్పడంతో ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమాను తెరకెక్కించి ఆర్థికంగా బాగా నష్టం రావడంతో కొన్ని సంవత్సరాలకు రీ ఎడిటింగ్ చేసి మంచి గుర్తింపు పొందారు.
తమిళ దర్శకుడు చేరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తవమై తవమరిందు (నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ) సినిమా సెన్సార్ కు వెళ్ళినప్పుడు ఏకంగా 4 గంటల 35 నిమిషాల నిడివి ఉంది. కానీ థియేటర్ లోకి విడుదలైనప్పుడు ఒక గంట కట్ చేసి విడుదల చేయాల్సి వచ్చింది.
ఇక తెలుగులో దానవీరశూరకర్ణ సినిమా కూడా 3:30 నిముషాలు నిడివి ఉంది. వీటితో పాటు బాలీవుడ్లో పలు చిత్రాలు కూడా మూడు గంటలకు పైగా లెంత్ ఉన్న చిత్రాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు.
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…