సాధారణంగా సినిమా ధియేటర్ కి వెళ్తే సినిమాను కేవలం ఒక రెండు గంటల పాటు ఎంతో ఆసక్తిగా కూర్చుని చూస్తాము. అయితే బాహుబలి వంటి చిత్రాలను మరో అరగంట ఓపికతో కూర్చుని చూడవచ్చు కాని అంతకు మించి అంటే ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ఆసక్తి కనబరచరు. అందుకోసమే ఈ మధ్యకాలంలో సినిమా ఎక్కువ నిడివి ఉంటే దానిని రెండు భాగాలుగా చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఓకే సినిమాను ఏకంగా నాలుగు గంటలపాటు థియేటర్లలో ప్రదర్శితం అయిన సినిమాలు కూడా ఉన్నాయి.
నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాలకు 2 ఇంటర్వెల్ వేసి బ్రేక్ ఇచ్చేవారంటే వినడానికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అయితే అలాంటి సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం పాలయ్యాయి.
ఇలాంటి చిత్రాలలో మొదటగా చెప్పుకోవాల్సిన చిత్రం జె పి దత్త తీసిన ఎల్ ఓ సి కార్గిల్. సుదీర్ఘమైన యుద్ధ పోరాటాలతో ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇందులో అక్కినేని నాగార్జున కూడా నటించారు. ఇలా ఈ సినిమా 4 గంటల 15 నిమిషాల నిడివి ఉంది. ఇందులో యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో అసహనానికి గురి చేసాయి.
ఈ సినిమా కంటే ముందుగానే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు నటుడు రాజ్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేరా నామ్ జోకర్ 4 గంటల 4 నిమిషాల నిడివి ఉంది. జీవితంలో విషాద ప్రేమ కథ సాగదీసి చెప్పడంతో ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమాను తెరకెక్కించి ఆర్థికంగా బాగా నష్టం రావడంతో కొన్ని సంవత్సరాలకు రీ ఎడిటింగ్ చేసి మంచి గుర్తింపు పొందారు.
తమిళ దర్శకుడు చేరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తవమై తవమరిందు (నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ) సినిమా సెన్సార్ కు వెళ్ళినప్పుడు ఏకంగా 4 గంటల 35 నిమిషాల నిడివి ఉంది. కానీ థియేటర్ లోకి విడుదలైనప్పుడు ఒక గంట కట్ చేసి విడుదల చేయాల్సి వచ్చింది.
ఇక తెలుగులో దానవీరశూరకర్ణ సినిమా కూడా 3:30 నిముషాలు నిడివి ఉంది. వీటితో పాటు బాలీవుడ్లో పలు చిత్రాలు కూడా మూడు గంటలకు పైగా లెంత్ ఉన్న చిత్రాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…