Tag Archives: commits suicide

Crime News: కృష్ణాజిల్లాలో విషాదం.. వరకట్న వేధింపులు భరించలేక గర్భవతి ఆత్మహత్య..!

Crime News: ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసులోనే యువత ప్రేమ పేరుతో తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.పిచ్చుక దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మి ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో 2021లో వివాహం చేసుకున్నారు.

Crime News: కృష్ణాజిల్లాలో విషాదం.. వరకట్న వేధింపులు భరించలేక గర్భవతి ఆత్మహత్య..!

వివాహం తర్వాత దంపతులిద్దరూ తల్లిదండ్రుల వద్దే ఉంటూ మూడు నెలలపాటు కాపురం చేశారు. తర్వాత కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కారణంగా పెద్దమనుషుల సలహా మేరకు దేవేంద్ర కుమార్ దంపతులు పట్టణంలోని 12వ వార్డులోని అద్దె ఇంట్లో ఉంటున్నారు.

Crime News: కృష్ణాజిల్లాలో విషాదం.. వరకట్న వేధింపులు భరించలేక గర్భవతి ఆత్మహత్య..!

వేరు కాపురం పెట్టిన కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కుసుమలక్ష్మి ఫోన్ చేసి తన తల్లికి చెప్పి బాధ పడింది. కుసుమ లక్ష్మి తల్లి తన కూతురిని ఓదార్చి తాను వస్తున్నానని.. గొడవ పడొద్దని కూతురితో చెప్పింది. కుసుమ లక్ష్మి తల్లి ఇంటినుండి బయలుదేరి కూతురు ఇంటికి వచ్చేలోపు తన కూతురు ఇంట్లో దూలానికి వేలాడుతూ శవమై కనిపించింది. వెంటనే ఆమె చుట్టుపక్కల వారి సహాయంతో కూతురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించడంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఈ సంఘటన గురించి విచారణ చేపట్టారు.

అదనపు కట్నం కోసం వేధింపులు…

ఈ క్రమంలో పోలీసులు బాధితురాలి తల్లిని విచారించగా.. పెళ్లి అయిన సమయం నుండి తన కుమార్తె అత్త ,మొగుడు ,బావ ,ఆడపడుచు నిత్యం తన కూతురిని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసేవారని ఆమె చెప్పుకొచ్చింది. వారి వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన కుమార్తె 5 వారాల గర్భిణీ అని, బుధవారం ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించి తీసుకువచ్చారని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?

Sad News: ఓ బాలింత ఆసుపత్రి బాత్రూంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమ గర్భవతి.

Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?

ఆమెకు 30 ఏళ్లు ఉంటాయి. ఆమె గర్భవతి అయి 9 నెలలు కావడంతో ఈ నెల 12 న నొప్పులతో ఇబ్బంది పడుతుండగా.. స్థానిక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేయడంతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు మొదటి కాన్పు కావడం.. అంతే కాకుండా వాళ్లు పేదవారు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించాల్సి వచ్చింది.

Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?

ఆమెకు సీజేరియన్ చేసిన తర్వాత వైద్యులు కుట్లు వేశారు. అయితే ఏడు రోజుల తర్వాత ఆమె డిశ్చార్జ్ కావాల్సి ఉంది. కానీ ఆమెకు కుట్లు మానకపోవడంతో మరోసారి.. ఆపరేషన్ చేసి.. కుట్లు వేయాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.

ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి:

అయితే మరోసారి ఆమెకు ఇలా సర్జరీ చేసి కుట్లు వేశారు. ఇక ఆమె ఈ నొప్పులకు భరించలేక.. అవి ఇంకా మానకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇలా మనోవేదనకు గురై ఆమె బాత్ రూంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆమె బంధువులు.. మూడుసార్లు కుట్లు వేశారని వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్య చేసుకుందని ఆందోళనకు దిగారు. పుట్టిన మగశిశువు తల్లిలేని అనాథగా మారిందని.. ఉమా భర్త తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

యువ జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ ఆత్మహత్య.. ఎమోషనల్ అయిన సోనూ సూద్!

మార్చిలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నుండి జర్మన్ రైఫిల్ అందుకున్న జాతీయ షూటర్ కొనికా లాయక్(26) గురువారం (డిసెంబర్ 16) ఆత్మహత్య చేసుకున్నారు. షూటింగ్ కమ్యూనిటీలో ఆత్మహత్యలు చేసుకోవడం.. ఈమెతో నాలుగోది. ఈ వార్త జాతీయ షూటింగ్ సోదర వర్గాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

హౌరా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె వద్ద ఒక సూసైడ్ నోట్ దొరికిందని.. అందులో ఆమె తన చావుకు కారణం తెలపలేదని చెప్పారు. కానీ.. ఈ చర్యకు పాప్పడటానికి కారణం “డిప్రెషన్” అని ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు తెలిపారు పోలీసులు. అవకాశాలు రాకపోవడంతో ఆమె నిరాశకు లోనైందని.. ఆమె ఆ నోట్ లో రాసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో కోనికాకు ఆమె కష్టాల గురించి వివరించిన తర్వాత నటుడు సోనూ సూద్ జర్మన్-తయారీ చేసిన రైఫిల్‌ను బహుమతిగా ఇచ్చారు. తద్వారా ఆమె నేషనల్స్ , ఇతర పోటీలలో పాల్గొంటుంది. కోనికా ప్రస్తుతం కోల్‌కతాలో మాజీ ఒలింపియన్ అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్‌తో శిక్షణ పొందుతోంది. ఇలా అకస్మాత్తుగా ఆమె హాస్టల్ గదిలో ఉరేసుకొని కనిపించడంతో ఆ ప్రాతమంతా కలకలం రేపింది.

ఇలా గడిచిన నాలుగు నెలల్లో ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఈమెతో నలుగురు. పిస్టల్ షూటర్ ఖుషీరత్ కౌర్ సంధు షూటింగ్ నేషనల్స్‌లో తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తర్వాత రాష్ట్ర స్థాయి షూటర్ హునర్‌దీప్ సింగ్ సోహల్ , మొహాలీకి చెందిన నమన్‌వీర్ సింగ్ బ్రార్ కూడా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఔత్సాహిక షూటర్లు ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడటం కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది.

ఆటోలో మొదలైన ప్రేమ.. బస్సులో ఆవిరైపోయింది..

అతడు ఆటో డ్రైవర్. పాఠశాలకు కొంతమంది విద్యార్థులను అక్కడ చేరవేసి..తన పని తాను చూసుకునేవాడు. అతడికి ఒక భార్య తో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందులో ఉన్న ఒక విద్యార్థినితో అతడు ప్రేమలో పడ్డాడు. చివరకు ఓ బస్సులో విగతజీవులై పడి ఉన్నారు. అసలేమైందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో చోటు చేసుకుంది. చంద్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామానిని చెందిన 28 ఏళ్ల జగ్గారావు ఆటో నడపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు సర్వీస్ చేసుకుంటూ.. సంపాదించుకునే వాడు.

జగ్గారావు ఆటోలో చంద్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థినులు వెళ్లే వారు. అందులో 14 ఏళ్ల మయార అనూషతో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఓ రోజు ఆమె పాఠశాలలో బ్యాగ్ వదిలేసి.. అతడితో బయటకు వచ్చేసింది. అక్కడ నుంచి అశ్వారావుపేటకు వచ్చారు. కొత్తగూడెం డిపోకు చెందిన ఓ బస్సులో వాళ్లిద్దరు ఎక్కారు.

అంతకముందే వాళ్లు పురుగుల మందుతాగి.. ఆ బస్సులోనే వాంతులు చేసుకొని విగతజీవులకుగా పడిఉన్నారు. గమనించిన డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు.. అక్కడ నుంచి వాళ్లను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాళ్లిద్దరూ అక్కడే మరణించారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

తండ్రి మందలించాడని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పదో తరగతి విద్యార్థి..!

ఒకప్పుడు పాఠశాలలకు కాలేజీలకు సెల్ ఫోన్ అనుమతి ఉండేది కాదు. అయితే కరోనా పూర్తిగా అన్ని నియమ నిబంధనలను మార్చేసింది. ఇప్పుడు తరగతి గదులు వినాలంటే సెల్ ఫోన్ ఎంతో ముఖ్యంగా మారిపోయింది. కరోనా కారణం వల్ల పాఠశాలలు మూతబడటం చేతే పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే పిల్లలు నిత్యం సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని పూర్తిగా సెల్ ఫోన్ కి అంకితమయ్యారు. కొంత మంది పిల్లలకు అది వ్యసనంగా మారడం చేత పిల్లలను అదుపు చేయాలని తల్లిదండ్రులు పిల్లలను మందలించడంతో పిల్లలు ఎంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి.

తాజాగా ఇలాంటి ఘటన మీర్‌పేట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్వోదయ నగర్‌ లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది స్థానికంగా నివసించే ఓ పదో తరగతి విద్యార్థి నిత్యం సెల్ ఫోన్ కి బానిస అయ్యి సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతుడడంతో తన తండ్రి తనని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఘోరమైన నిర్ణయాన్ని తీసుకుంది.

అందరూ పడుకొని ఉండగా బాలిక ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ముగ్గురు చిన్నారులు అదృశ్యం.. కట్ చేస్తే.. అడవిలో అస్తిపంజరాలు ప్రత్యక్షం.. చివరకు..

ఆగస్టు 18, 2021న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో 10 ఏళ్ల లోపు ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. అదే రోజు నుంచి ఆ చిన్నారుల తల్లి కూడా కనిపించలేదు. ఆ రోజు ఆ చిన్నారుల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా తల్లి కూడా అదే రోజు కనిపించకుండా పోవడంతో ఆమె ఆ పిల్లలను చంపేసి ఎక్కడికో పారిపోయిందని పోలీసులు భావించారు.

తర్వాత కొన్ని రోజులకు పోలీసుల దర్యాప్తులో ఆ ముగ్గురి పిల్లల అస్తిపంజరాలు ఆ గ్రామానికి దగ్గర్లో ఉన్న ఓ అడవిలో గుర్తించారు. అప్పుడు పోలీసుల అనుమానం ఇంకా బలపడింది. ఆ పిల్లలను తల్లే హత్య చేసి పారిపోయిందని కేసు కూడా నమోదు చేసుకున్నారు.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇటీవల ఆ అడవిలో అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అడవిలో గొర్రెలను మేపుతుండగా.. చెట్టుకు వేలాడుతూ ఓ కుల్లిపోయిన శవం కనిపించింది. ఆమెను అతడు ఆ పిల్లల తల్లే అని అనుమానించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. వాళ్లు వచ్చి పరిశీలించి ఆ పిల్లల తల్లే అని నిర్ధారించారు. వాళ్ల ముగ్గురిని హత్య చేసి.. భయంతో ఆమె కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటుందంటూ పోలీసులు చెబుతున్నారు.

కానీ వాళ్ల బంధువులు మాత్రం పోలీసులే హత్య చేసి ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఆమె చావుకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఆ కుటుంబ పెద్ద కన్నీరుమున్నీరుగా విలపించాడు.