Crime News: కృష్ణాజిల్లాలో విషాదం.. వరకట్న వేధింపులు భరించలేక గర్భవతి ఆత్మహత్య..!
Crime News: ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసులోనే యువత ప్రేమ పేరుతో తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.పిచ్చుక దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మి ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో 2021లో వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత దంపతులిద్దరూ తల్లిదండ్రుల వద్దే ఉంటూ మూడు నెలలపాటు కాపురం చేశారు. తర్వాత కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కారణంగా పెద్దమనుషుల సలహా మేరకు దేవేంద్ర కుమార్ దంపతులు పట్టణంలోని 12వ వార్డులోని అద్దె ఇంట్లో ఉంటున్నారు.
వేరు కాపురం పెట్టిన కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కుసుమలక్ష్మి ఫోన్ చేసి తన తల్లికి చెప్పి బాధ పడింది. కుసుమ లక్ష్మి తల్లి తన కూతురిని ఓదార్చి తాను వస్తున్నానని.. గొడవ పడొద్దని కూతురితో చెప్పింది. కుసుమ లక్ష్మి తల్లి ఇంటినుండి బయలుదేరి కూతురు ఇంటికి వచ్చేలోపు తన కూతురు ఇంట్లో దూలానికి వేలాడుతూ శవమై కనిపించింది. వెంటనే ఆమె చుట్టుపక్కల వారి సహాయంతో కూతురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించడంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఈ సంఘటన గురించి విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో పోలీసులు బాధితురాలి తల్లిని విచారించగా.. పెళ్లి అయిన సమయం నుండి తన కుమార్తె అత్త ,మొగుడు ,బావ ,ఆడపడుచు నిత్యం తన కూతురిని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసేవారని ఆమె చెప్పుకొచ్చింది. వారి వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన కుమార్తె 5 వారాల గర్భిణీ అని, బుధవారం ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించి తీసుకువచ్చారని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…