Grey Movie: స్పై థ్రిల్లర్ గా ‘గ్రే’ సినిమా.. 40 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇలా..
Grey Movie: సీరియల్స్ ద్వారా మంచి పేరు సంపాదించుకొని.. తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు అలీ రెజా. ప్రస్తుతం అతడు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్ సినిమాగా వస్తున్న ‘‘గ్రే’’ లో ఇతడు హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో అతడితో పాటు.. ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, ఊర్వశీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఊర్వశీ రాయ్ మొదటిసారిగా వెండితెరపై కనువిందు చేయనుంది. ఈ చిత్రానికి రాజ్ ముదిరాజ్ దర్శకుడిగా పనిచేస్తుండగా.. ఈ సినిమా అద్వితీయ మూవీస్ ప్రై లి పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతుంది.
కిరణ్ కాళ్లకూరి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ది స్పై హూ లవ్డ్ అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు రాజ్ ముదిరాజ్ మాట్లాడారు. మన దేశంలో గత ఐదారేళ్లల్లో దాదాపు 12 మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారన్నారు.
దీనికి కారణం ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజేన్సీ. వీళ్లు జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్ అని.. దాని నుంచి పుట్టిన ఐడియానే గ్రే మూవీ అని దర్శకుడు అన్నాడు. ఇక ప్రతీ ఆలోచన వెనుకు కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని.. వాటిని ఆధారం చేసుకొని తీసిన సినిమానే ఈ గ్రే స్పై డ్రామా అన్నాడు. ఇక ఈ సినిమాలో అలీ రెజా నటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు దర్శకుడు. ఇక హీరోయిన్ గా ఊర్వశీ రాయ్ పరిచయం అవుతుందని అన్నాడు. అంతే కాకుండా.. ఈ సినిమాలో నటుడు అరవింద్ కృష్ణ చేయడం తనకు ఇంకా మంచి ఇమేజ్ ను తెచ్చిపెడుతుందని తెలియజేశారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా నాగరాజు తాల్లూరి పని చేశాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని.. మొదటి కాపీ తాము చూశామని.. ఎంతో బాగుందన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…