ఆగస్టు 18, 2021న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో 10 ఏళ్ల లోపు ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. అదే రోజు నుంచి ఆ చిన్నారుల తల్లి కూడా కనిపించలేదు. ఆ రోజు ఆ చిన్నారుల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా తల్లి కూడా అదే రోజు కనిపించకుండా పోవడంతో ఆమె ఆ పిల్లలను చంపేసి ఎక్కడికో పారిపోయిందని పోలీసులు భావించారు.
తర్వాత కొన్ని రోజులకు పోలీసుల దర్యాప్తులో ఆ ముగ్గురి పిల్లల అస్తిపంజరాలు ఆ గ్రామానికి దగ్గర్లో ఉన్న ఓ అడవిలో గుర్తించారు. అప్పుడు పోలీసుల అనుమానం ఇంకా బలపడింది. ఆ పిల్లలను తల్లే హత్య చేసి పారిపోయిందని కేసు కూడా నమోదు చేసుకున్నారు.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇటీవల ఆ అడవిలో అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అడవిలో గొర్రెలను మేపుతుండగా.. చెట్టుకు వేలాడుతూ ఓ కుల్లిపోయిన శవం కనిపించింది. ఆమెను అతడు ఆ పిల్లల తల్లే అని అనుమానించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. వాళ్లు వచ్చి పరిశీలించి ఆ పిల్లల తల్లే అని నిర్ధారించారు. వాళ్ల ముగ్గురిని హత్య చేసి.. భయంతో ఆమె కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటుందంటూ పోలీసులు చెబుతున్నారు.
కానీ వాళ్ల బంధువులు మాత్రం పోలీసులే హత్య చేసి ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఆమె చావుకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఆ కుటుంబ పెద్ద కన్నీరుమున్నీరుగా విలపించాడు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…