ఆగస్టు 18, 2021న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో 10 ఏళ్ల లోపు ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. అదే రోజు నుంచి ఆ చిన్నారుల తల్లి కూడా కనిపించలేదు. ఆ రోజు ఆ చిన్నారుల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా తల్లి కూడా అదే రోజు కనిపించకుండా పోవడంతో ఆమె ఆ పిల్లలను చంపేసి ఎక్కడికో పారిపోయిందని పోలీసులు భావించారు.
తర్వాత కొన్ని రోజులకు పోలీసుల దర్యాప్తులో ఆ ముగ్గురి పిల్లల అస్తిపంజరాలు ఆ గ్రామానికి దగ్గర్లో ఉన్న ఓ అడవిలో గుర్తించారు. అప్పుడు పోలీసుల అనుమానం ఇంకా బలపడింది. ఆ పిల్లలను తల్లే హత్య చేసి పారిపోయిందని కేసు కూడా నమోదు చేసుకున్నారు.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇటీవల ఆ అడవిలో అదే గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అడవిలో గొర్రెలను మేపుతుండగా.. చెట్టుకు వేలాడుతూ ఓ కుల్లిపోయిన శవం కనిపించింది. ఆమెను అతడు ఆ పిల్లల తల్లే అని అనుమానించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. వాళ్లు వచ్చి పరిశీలించి ఆ పిల్లల తల్లే అని నిర్ధారించారు. వాళ్ల ముగ్గురిని హత్య చేసి.. భయంతో ఆమె కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటుందంటూ పోలీసులు చెబుతున్నారు.
కానీ వాళ్ల బంధువులు మాత్రం పోలీసులే హత్య చేసి ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఆమె చావుకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఆ కుటుంబ పెద్ద కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…