Tag Archives: Couple

మూడు ముళ్లు పడి మూడు రోజులు కాలేదు.. అప్పుడే విడిపోతున్న కత్రినా, విక్కీ కౌశల్..!

కత్రినా కైఫ్ డిసెంబర్ 9 న విక్కీ కౌశల్ తో వివాహం అయిన విషయం తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీల మధ్య అంగరంగ వైభంగా ఈ వివాహం జరిగింది. అయితే వివాహం జరిగి మూడు రోజులు కూడా కాలేదు .. మరో మూడు రోజుల్లో వీళ్లిద్దరు విడిపోనున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఇద్దరు కలిసి హనీమూన్ కు వెళ్తున్నారని అందరూ అనుకున్నారు.

కానీ షూటింగ్ లో పాల్గొనేందుకు చెరో ప్రాంతానికి వెళ్లిపోతున్నారట. ఇక దీనిపై నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. పెళ్లి జరిగి మూడు రోజులు కాలేదు.. హనీమూన్ లేదు.. పారాణి ఆరనే లేదు.. కానీ విడిపోడానికి మాత్రం సిద్ధంగా ఉండటం ఏంటి అని ప్రశ్నిస్తూ.. ఆశ్చర్యపోతున్నారు.

ఇక కత్రినా కైఫ్ విషయానికి వస్తే.. మొదట సల్మాన్ ఖాన్ తో లవ్ చేసి బ్రేకప్ చేసిన తర్వాత.. రణబీర్ కపూర్ తో డేటింగ్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం విక్కీ కౌశల్ తో పెళ్లి. తర్వాత మళ్లీ వీరిద్దరు విడిపోవడం వంటి నిర్ణయాలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వ్యక్తిగత జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వకుండా.. సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ఈ నెల 15 నుంచి.. సల్మాన్ ఖాన్ తో షూటింగ్ లో బిజీ అవ్వబోతోంది కత్రినా. ఇక ఇంత బిజీ షెడ్యూల్ తర్వాత ఫిబ్రవరిలో హనీమూన్ ఉంటుందనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీరిద్దరు.. కాపురం చేసుకోకుండా.. సినిమాల షూటింగులకు వెళ్లడంపై విమర్శలు వినిపిస్తన్నాయి.

ఆ జంటను చూశారా.. వాళ్లు ఒకటయ్యారు.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..?

కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదు అంటారు. తన భాగస్వామి ఎవరు అవుతారనేది చాలామంది ఊహించలేరు. సంబంధం కుదిరిన తర్వాతనే వాళ్ల గురించి తెలుకుంటారు. అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న జంటను చూశారా.. వాళ్లిద్దరు పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అయ్యారు. అదేంటి.. మైనర్లకు పెళ్లి చేయకూడదు కదా.. వాళ్లిద్దరని చూస్తుంటే ఇంకా 10 సంవత్సరాలు కూడాదాటలేదు.. అప్పుడే పెళ్లి చేశారేంటి అనే అనుమానం కచ్చితంగా వస్తుంది.

అక్కడికే వస్తున్నా.. విషయం ఏటంటే.. వాళ్లిద్దరు మైనర్లు కాదు.. ఇద్దరూ మేజర్లే. ఇద్దరికీ కూడా 25 ఏళ్లకు పైగానే వయస్సు ఉంది. అందులో కనిపిస్తున్న వ్యక్తి పేరు విష్ణు, ఆమె పేరు జ్యోతి. అతడికి 28 ఏళ్లు, ఆమెకు 26 ఏళ్లు. అతడు బెంగుళూరు వాసి.. ఆమె కోలారుకు చెందిన యువతి.

వారిద్దరూ కూడా బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే జీన్స్ సమస్యల కారణంగా వాళ్ల శరీరం పెరగకుండా అలా మందగించింది. అందుకే మనకు వాళ్లు అలా కనిపిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఏ నాడు వాళ్లు పొట్టిగా ఉన్నారని బాధపడలేదట.. ఎగతాళి చేస్తున్నా.. పట్టించుకునే వారు కాదట.. వాళ్ల ఆత్మవిశ్వాసం ఏ మాత్రం తగ్గకుండా ఇలా ముందుకు సాగారు.

ఇద్దరూ కూడా ఒకరినొకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం చింతామణి దగ్గరున్న కైవార క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీళ్ల పెళ్లిక సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జంటను చూసిన ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. నిజంగా వారి ఆత్మ విశ్వాసానికి సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

వరుడికి కోవిడ్.. పీపీఈ కిట్లు ధరించి మరీ పెళ్లి.. ఎక్కడంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆసుపత్రి ఫాలో అవుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గత కొన్ని నెలల నుంచి శుభముహూర్తాలు లేక ఇప్పుడు పెళ్లిళ్ళ పెట్టుకున్నవారిని సైతం కరోనా మహమ్మారి వదలక పోవడం తో కొందరు పెళ్లిళ్లు వాయిదా వేసుకోక మరికొందరు అనుకొన్న సమయానికి పెళ్లి జరగాలని గట్టి పట్టు పడుతున్నారు.

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో ఓ జంటకు వివాహం నిశ్చయమైంది. వివాహానికి రెండు రోజులు ముందు వరుడు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో చేరాడు.అయితే వారు నిర్ణయించిన ముహూర్తానికి వీరు పెళ్లి జరగాలని పట్టుబట్టిన ఇరు కుటుంబాల పెద్దలు అధికారులను ఆశ్రయించి వారి నుంచి పెళ్లికి అనుమతి తీసుకున్నారు.

అధికారుల నుంచి అనుమతి లభించడంతో వధూవరులిద్దరు పిపిఈ కిట్లను ధరించి వివాహం చేసుకున్నారు. అధికారులు వీరి పెళ్లికి అనుమతి ఇవ్వడంతో పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ పిపిఈ కిట్లతో పెళ్లికి హాజరైన వధూవరులకు పెళ్లి చేయించడానికి పురోహితుడు సైతం పిపిఈ కిట్ ధరించి వివాహం జరిపించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరు తమదైన శైలిలో స్పందించి కామెంట్లు పెడుతున్నారు.