ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆసుపత్రి ఫాలో అవుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గత కొన్ని నెలల నుంచి శుభముహూర్తాలు లేక ఇప్పుడు పెళ్లిళ్ళ పెట్టుకున్నవారిని సైతం కరోనా మహమ్మారి వదలక పోవడం తో కొందరు పెళ్లిళ్లు వాయిదా వేసుకోక మరికొందరు అనుకొన్న సమయానికి పెళ్లి జరగాలని గట్టి పట్టు పడుతున్నారు.
ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో ఓ జంటకు వివాహం నిశ్చయమైంది. వివాహానికి రెండు రోజులు ముందు వరుడు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో చేరాడు.అయితే వారు నిర్ణయించిన ముహూర్తానికి వీరు పెళ్లి జరగాలని పట్టుబట్టిన ఇరు కుటుంబాల పెద్దలు అధికారులను ఆశ్రయించి వారి నుంచి పెళ్లికి అనుమతి తీసుకున్నారు.
అధికారుల నుంచి అనుమతి లభించడంతో వధూవరులిద్దరు పిపిఈ కిట్లను ధరించి వివాహం చేసుకున్నారు. అధికారులు వీరి పెళ్లికి అనుమతి ఇవ్వడంతో పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పిపిఈ కిట్లతో పెళ్లికి హాజరైన వధూవరులకు పెళ్లి చేయించడానికి పురోహితుడు సైతం పిపిఈ కిట్ ధరించి వివాహం జరిపించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరు తమదైన శైలిలో స్పందించి కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…