ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆసుపత్రి ఫాలో అవుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గత కొన్ని నెలల నుంచి శుభముహూర్తాలు లేక ఇప్పుడు పెళ్లిళ్ళ పెట్టుకున్నవారిని సైతం కరోనా మహమ్మారి వదలక పోవడం తో కొందరు పెళ్లిళ్లు వాయిదా వేసుకోక మరికొందరు అనుకొన్న సమయానికి పెళ్లి జరగాలని గట్టి పట్టు పడుతున్నారు.
ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో ఓ జంటకు వివాహం నిశ్చయమైంది. వివాహానికి రెండు రోజులు ముందు వరుడు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో చేరాడు.అయితే వారు నిర్ణయించిన ముహూర్తానికి వీరు పెళ్లి జరగాలని పట్టుబట్టిన ఇరు కుటుంబాల పెద్దలు అధికారులను ఆశ్రయించి వారి నుంచి పెళ్లికి అనుమతి తీసుకున్నారు.
అధికారుల నుంచి అనుమతి లభించడంతో వధూవరులిద్దరు పిపిఈ కిట్లను ధరించి వివాహం చేసుకున్నారు. అధికారులు వీరి పెళ్లికి అనుమతి ఇవ్వడంతో పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పిపిఈ కిట్లతో పెళ్లికి హాజరైన వధూవరులకు పెళ్లి చేయించడానికి పురోహితుడు సైతం పిపిఈ కిట్ ధరించి వివాహం జరిపించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరు తమదైన శైలిలో స్పందించి కామెంట్లు పెడుతున్నారు.
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…