ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆసుపత్రి ఫాలో అవుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గత కొన్ని నెలల నుంచి శుభముహూర్తాలు లేక ఇప్పుడు పెళ్లిళ్ళ పెట్టుకున్నవారిని సైతం కరోనా మహమ్మారి వదలక పోవడం తో కొందరు పెళ్లిళ్లు వాయిదా వేసుకోక మరికొందరు అనుకొన్న సమయానికి పెళ్లి జరగాలని గట్టి పట్టు పడుతున్నారు.
ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో ఓ జంటకు వివాహం నిశ్చయమైంది. వివాహానికి రెండు రోజులు ముందు వరుడు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో చేరాడు.అయితే వారు నిర్ణయించిన ముహూర్తానికి వీరు పెళ్లి జరగాలని పట్టుబట్టిన ఇరు కుటుంబాల పెద్దలు అధికారులను ఆశ్రయించి వారి నుంచి పెళ్లికి అనుమతి తీసుకున్నారు.
అధికారుల నుంచి అనుమతి లభించడంతో వధూవరులిద్దరు పిపిఈ కిట్లను ధరించి వివాహం చేసుకున్నారు. అధికారులు వీరి పెళ్లికి అనుమతి ఇవ్వడంతో పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పిపిఈ కిట్లతో పెళ్లికి హాజరైన వధూవరులకు పెళ్లి చేయించడానికి పురోహితుడు సైతం పిపిఈ కిట్ ధరించి వివాహం జరిపించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరు తమదైన శైలిలో స్పందించి కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…