Tag Archives: crime

బాల కార్మిక చట్టంలో మార్పులు.. 14 ఏళ్ల లోపు పిల్లలను పనులకు తీసుకుంటే.. ఆ తర్వాత చుక్కలే..!

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఎన్నో చట్టాలు వచ్చాయి. అయినా కొన్ని ప్రదేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా.. బాలబాలికలను పనిలో పెట్టుకుంటున్నారు. దీంతో వారి అమూల్యమైన బాల్యం మొదట్లోనే మోడు బారిపోతోంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదానికి తూట్లు పొడిచే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు.

దీనిపై కఠిన చట్టాలు ఉన్నా.. దీనిని ఎవరూ ఖాతరు చేయడం లేదు. తమ కుటుంబ పోషణ భారం అవుతుందని తమ పిల్లలను పనికి పంపిస్తున్నామని.. బడికి పంపించే స్థోమత లేకనే ఇలా చేస్తున్నామని ఆ బాలబాలికల తల్లిదండ్రలు చెబుతుండటం కొసమెరుపు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి ఉండడం వల్లనూ, దారిద్ర్యంతోనూ, నిరక్షరాస్యతతోనూ కూడినది కావున ఇంకనూ సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలని నిపుణులు అంటున్నారు.

రాజ్యాంగంలోని 24వ ఆర్టికల్ ప్రకారం 14 ఏళ్ల లోపు బాలలను కర్మాగారాలలో, గనులలో, ఇంక ఏ ఇతర ప్రమాదకర పనులలో కూడా ఎవరూ ఉంచకూడదు. దీనిలో భాగంగానే 1986లో బాల కార్మిక నిషేద చట్టం వచ్చింది. ఇదంతా ఇలా ఉండగా.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్పులను తీసుకొచ్చింది.

14 ఏళ్లలోపు పిల్లలు ఎవరూ పనులు చేయడానికి వీళ్లేదని.. ఒక వేళ ఎవరైనా పనిలో పెట్టుకుంటే.. పెట్టుకున్న యజమానితో పాటు.. తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అంతే కాకుండా.. యజమానికి రూ.25వేల నుంచి రూ. 50 వేల జరిమానాతో పాటు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని.. యాథావిధిగా ఈ నిబంధనలను అమలు చేస్తామని కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

బలవంతపు శృంగారం చేస్తున్న భర్త.. మర్మాంగాన్ని కోసేసిన భార్య.. ఎక్కడంటే..?

భార్యభర్తల మధ్య మనస్పర్థలు అనేవి సర్వసాధారణం. అయితే వాటిని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకొని.. సంసార జీవితాన్ని నడపాలి.. కానీ.. పది మందిలోకి ఈ వ్యవహారం వెళ్ల కూడదు. ఒక వేళ వెళ్లినా మరోసారి ఈ వ్యవహరం రిపీట్ కాకుండా ఉంటే కుటుంబంలో ఎలాంటి గొడవలు చోటు చేసుకోవు.

కొందరు క్షణికావేశంలో ప్రాణాలు తీయడమో.. ప్రాణాలు తీసుకోవడమో జరుగుతోంది. ఇలాంటి ఘటనల వల్ల వాళ్లపై ఆధారపడిన కటుంబసభ్యులు అనాథలుగా మారుతున్నారు. ఇక్కడ చెప్పే దంపతుల విషయం ఏంటంటే.. మధ్యప్రదేశ్ లోని టికంగఢ్ జిల్లాకు చెందిన వీళ్లు.. రామ్ నగర్ లో నివాసం ఉంటుంన్నారు.

వారిద్దరికి వివాహం అయిన చాలా సంవత్సరాలు అయింది. మొదట్లో వీరిద్దరు బాగానే ఉన్నా.. రాను రాను మనస్పర్థలు ఎక్కువ అయ్యాయి. దీంతో వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి గొడవ పెద్ద పనుషుల దాకా వెళ్లింది. ఇద్దరు కలిసి ఉండాలని.. బలవంతపు కాపురం చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో భార్యతో అతడు బలవంతంగా కాపురం చేస్తున్న క్రమంలో భార్య కత్తి తీసుకొని అతడి మర్మాంగాన్ని కోసేసింది. అక్కడిక్కడే అతడు గిల గిల కొట్టుకుంటూ కిందపడిపోయాడు. ఆ ఘటనా స్థలం వద్ద తీవ్ర రక్తస్రావం అయింది. ఇరుగుపొరుగు వాళ్లు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

సమాజం తలదించుకునే చర్య.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. వీడియో తీసి మరీ..!

రోజు రోజుకూ మహిళపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా ఏ మాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల భయట కనిపించిందంటే చాలు.. ఓర చూపులతో మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇటీవల ఈ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.

సొంత వాళ్లు కూడా ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. వాయి వరుసలు లేకుండా.. కన్న కూతురు అని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతన్నారు. ఇలాంటి ఘటన ఒకటి బిహార్ లో చోటు చేసుకుంది. కన్న కూతురుపైనే అత్యాచారం చేసి.. వీడియో తీసి మరీ లొంగదీసుకొని బెదిరింపులకు పాల్పడతున్నాడో తండ్రి.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి కన్న కూతరు విషయంలో కాలయముడిగా మారాడు. బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ జిల్లా జసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలో దంపతులు.. ఒక కూతురు కలిసి జీవిస్తున్నారు. ఆ రోజు పాఠశాలకు సెలవు.. తన భార్య కూడా ఇంట్లో లేకపోవడంతో.. కామంతో రగిలిపోయాడు సదరు తండ్రి.
ఇంట్లో ఉన్న తన కూతురుపై అత్యాచారం చేశారు.

ఆ సమయంలో వీడియో తీసి.. ఎవరికైనా చెబితే ఈ వీడియో బయటక పెడతానని బెదిరించాడు. కానీ ఆ యువతి తన తల్లికి చెప్పింది. ఇద్దరు కలిసి వెల్లి.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన డిసెంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి అరెస్టు చేసి.. విచారణ చేపడుతున్నారు. ఈ విషయం గ్రామంలో ముందే తెలవడంతో అతడిని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.

13 ఏళ్ల బాలుడిపై 23 ఏళ్ల యువకుడు లైంగిక దాడి.. కలకలం రేపిన ఘటన..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. ఆడపిల్ల నిర్భయంగా బయటకు వెళ్తే చాలు ఇంటికి వచ్చేదాక కూడా నమ్మకం లేదు. ఇంటికి రావడానికి కొంచెం లేటయినా తల్లిదండ్రలు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే ఇక్కడ జరిగిన ఘటన సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆడపిల్లలకే రక్షణ లేకుండా పోతుందనుకుంటే.. మగవాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా హైదరాబాద్ లో ఓ 13 ఏళ్ల బాలుడిపై 23 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలుడని కూడా చూడకుండా చిన్న పిల్లాడిపై ఆ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివారలు ఇలా తెలిపారు. హైదరాబాద్ లోని పార్శీగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ అనే 23 ఏళ్ల యువకుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో పనిచేస్తున్నాడు.అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలుడికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి.. ఆ బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ బాలుడు భయపడి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆ బాలుడి తల్లిదండ్రలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.

లాడ్జీలో మైనర్ బాలికపై అత్యాచారం.. ఇంటి యజమాని నమ్మించి మరి ఘటనకు పాల్పడ్డాడు..!

ఆ బాలిక ఇంట్లో పని మనిషిగా చేస్తుంది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని ఆమె ఇంటి యజమానికి చెప్పింది. తాను తీసుకెళ్తానని చెప్పి ఆ యజమాని లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహరాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు వలస వచ్చారు ఓ దంపతులు.

అక్కడే ఇటుక బట్టీలో పని చేసుకుంటూ ఉండేవారు. వాళ్లకు 14 ఏళ్ల కూతురు ఉంది. ఆమె కూడా తల్లిదండ్రులకు ఆర్థికపరంగా ఉపయోగపడేందుకు థానే జిల్లా భివాండికి చెందిన ఒకరి ఇంట్లో పనికి కుదిరింది. ఈ క్రమంలో ఆమె ఆ ఇంట్లో ఇంటి పని, వంట పని చేస్తూ ఉండేది. అక్కడ అతడికి తన భార్య కూడా ఉంది. ఆ బాలిక అతడి భార్యతో క్లోజ్ గా ఉండేది.

ఓ రోజు అతడు ఆమెను తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తానని చెప్పి ఆ మైనర్ ను బైక్ ఎక్కించుకున్నాడు. అక్కడ నుంచి నేరుగా అతడు అంగావ్ అనే ప్రాంతంలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు. ఎందుకు ఇక్కడకు తీసుకొచ్చావ్ అంటూ ఆ బాలిక ప్రతిఘటించింది. ఆ బాలికను బెదిరించి.. బలవంతంగా దాడి చేస్తూ.. అత్యాచారం చేశాడు.

ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. తర్వాత బాధితురాలి తల్లిదండ్రుల వద్ద ఆ బాలికను వదిలేశాడు. ఆ బాలికకు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు.. మరికొన్ని సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదయ్యాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టవల్ తో కట్టేసి.. నలుగురు కలిసి.. ఆమెపై అత్యంత దారుణానికి పాల్పడ్డారు..

రాను రాను మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళల రక్షణ కొరకు ఎన్నో చట్టాలు తెచ్చినా.. పిరిస్థితుల్లో మార్పు రాలేదు. మహిళ బయట అడుగుపెట్టింది మొదలు.. ఇంటికి తిరిగి వచ్చేదాక రక్షణ లేకుండా పోతోంది. దీంతో తల్లిదండ్రలు ఆందోళనకు గురవుతున్నారు.

తాజాగా జరిగిన ఘటనలో ఓ వివాహిత అర్ధరాత్రి కాలకృత్యాల కోసం నది ఒడ్డుకు వెళ్లింది. సమయం కోసం వేచి చూసిన నలుగురు దుర్మార్గులు.. ఆ వివాహితను టవల్‌తో కట్టేసి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఒడిశాలోని పూరి జిల్లా నిమపారాలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ కాలకృత్యాలకు ఆమె ఇంటి సమీపంలోని కాలువ ఒడ్డుకు వెళ్లింది. ఆమె ఒటరిగా వెళ్లింది గమనించిన కొందరు ఆమెను ఫాలో అయ్యారు. ఒంటరిగా ఉన్నది చూసి.. ఆమెపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. టవల్ తో కట్టేసి.. అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు.. ఇలా ఘోరానికి పాల్పడ్డారు.

ఎంతకూ ఆమె ఇంటికి రాకపోవడంతో.. కుటుంబీకులు వెళ్లి చూడగా.. షాక్ అయ్యారు. సంఘటనా ప్రదేశంలో ఆమె తీవ్ర రక్తస్రావంతో పడి ఉండటం గమనించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలితో పాటు… కుటుంబసభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపాడు.

దారుణం: భర్తను చంపి జైలుకెళ్లి లొంగిపోయిన భార్య.. ఎక్కడంటే?

ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య ఏ చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా అవి ఎన్నో సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే తొందరపాటు నిర్ణయం వల్ల ఎందరో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని చివరికి బిడ్డను ఒంటరి పాలు చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా గత కొంత కాలం నుంచి మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 11 సంవత్సరాల క్రితం వివాహం జరగగా తొమ్మిది సంవత్సరాల బాబు ఉన్నాడు. గత 11 సంవత్సరాల నుంచి వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు.

అయితే గత కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయంలోనూ మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇలా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఆవేశంలో మౌనిక వంటగదిలో కూరగాయలు కట్ చేసే కత్తితో తన భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ క్రమంలోని తన భర్త పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించిన మౌనిక తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం చెప్పి ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని తనని అరెస్ట్ చేశారు.

పూనమ్ పాండేను దారుణంగా కొట్టిన భర్త.. అసలు కారణం ఇదే!

బాలీవుడ్ నటి పూనమ్ పాండే తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి తన భర్త సామ్ బాంబే గురించి వార్తల్లో నిలిచారు. పూనమ్ పాండే, సామ్ బాంబే రెండు సంవత్సరాలుగా సహజీవనం చేసిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్ నెలలో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే సామ్ బాంబేకి వివాహం జరిగింది. ఈ క్రమంలోనే నటి పూనమ్ అతనితో సహజీవనం చేసి తనని రెండో పెళ్లి చేసుకుంది.

పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఎన్నో మనస్పర్ధలు రావడం వల్ల తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే ఒకసారి సామ్ తన పై చేయి చేసుకోగా పూనమ్ అతని పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికి తను క్షమాపణ చెప్పడంతో కేసు వెనక్కి తీసుకున్న పూనమ్ ఆ తరువాత ప్రతిసారి వీరిద్దరి మధ్య ఏదో ఒక విషయం గురించి గొడవలు మొదలయ్యాయి.

తాజాగా సామ్ బాంబే నటి పూనమ్ నుజుట్టు పట్టుకొని తన మొహం మొత్తం రక్తస్రావాలు అయ్యేవిధంగా ఎంతో దారుణంగా ఆమెను చితకబాదాడు. ఈ క్రమంలోనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు తనను అరెస్టు చేశారు. అధిక రక్తస్రావంతో బాధపడుతున్న నటిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే సామ్ తన పై చేయి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

సామ్ బాంబే తన మొదటి భార్య అల్వీరాతో తరచూ ఫోన్ మాట్లాడుతూ ఉండేది. ఈ విషయం నచ్చని పూనమ్ తరచూ తన భర్తతో గొడవ పడేది. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎంతో విసుగుచెందిన సామ్ ఏకంగా తన జుట్టు పట్టుకొని తన పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇలా తనపై దాడి జరగగానే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం సామ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇల్లు ఇప్పిస్తానని చెప్పారు.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు..

భారతదేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏదో ఒక ప్రదేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి నుంచి మహిళ బయటకు వెళ్లింది మొదలు.. జాగ్రత్తగా ఇంటికి వస్తుందన్న నమ్మకం లేకుండాపోయింది.

దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవతున్నారు. ఇంటువంటి ఘటన ఒకటి హైదరాబాద్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇల్లు ఇప్పిస్తానని చెప్పి.. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాలెనగర్ కు చెందిన 28 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె గదిలో నివాసం ఉంటుంది.

ఆమె తన కుటుంబపోషణ కొరకు ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఆమెకు రఫీక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతడు ఆమె ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఓ రోజు ఆమెకు ఇల్లు కావాలని కోరడంతో.. అతడు ఆమెను తన కారులో షాహిన్ నగర్ లో ఇల్లు ఇప్పిస్తానని తీసుకెళ్లాడు. కానీ ఆమెను షాహిన్ నగర్ కు తీసుకెళ్లకుండా.. పాతనగరం తీసుకెళ్లాడు.

అక్కడ ఆమెను ఆ రూంలో బంధించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తున్న సమయంలో తన ఫోన్ కెమెరాతో వీడియోలు, ఫొటోలు తీశాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. ఈ విషయంపై ఎవరికైనా చెబితే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. కానీ ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినా కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన బయటకు తెలవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.