ప్రస్తుతం ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. ఆడపిల్ల నిర్భయంగా బయటకు వెళ్తే చాలు ఇంటికి వచ్చేదాక కూడా నమ్మకం లేదు. ఇంటికి రావడానికి కొంచెం లేటయినా తల్లిదండ్రలు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే ఇక్కడ జరిగిన ఘటన సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆడపిల్లలకే రక్షణ లేకుండా పోతుందనుకుంటే.. మగవాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా హైదరాబాద్ లో ఓ 13 ఏళ్ల బాలుడిపై 23 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలుడని కూడా చూడకుండా చిన్న పిల్లాడిపై ఆ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివారలు ఇలా తెలిపారు. హైదరాబాద్ లోని పార్శీగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ అనే 23 ఏళ్ల యువకుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో పనిచేస్తున్నాడు.అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలుడికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి.. ఆ బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ బాలుడు భయపడి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆ బాలుడి తల్లిదండ్రలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…