ప్రస్తుతం ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. ఆడపిల్ల నిర్భయంగా బయటకు వెళ్తే చాలు ఇంటికి వచ్చేదాక కూడా నమ్మకం లేదు. ఇంటికి రావడానికి కొంచెం లేటయినా తల్లిదండ్రలు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే ఇక్కడ జరిగిన ఘటన సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆడపిల్లలకే రక్షణ లేకుండా పోతుందనుకుంటే.. మగవాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా హైదరాబాద్ లో ఓ 13 ఏళ్ల బాలుడిపై 23 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలుడని కూడా చూడకుండా చిన్న పిల్లాడిపై ఆ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివారలు ఇలా తెలిపారు. హైదరాబాద్ లోని పార్శీగుట్ట మధురానగర్ కాలనీకి చెందిన సతీష్ అనే 23 ఏళ్ల యువకుడు స్థానికంగా ఓ రంగురాల్లు అమ్మే దుకాణంలో పనిచేస్తున్నాడు.అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలుడికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి.. ఆ బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ బాలుడు భయపడి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆ బాలుడి తల్లిదండ్రలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…