Tag Archives: emotional

Hyper Aadi: ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టి హక్కున చేర్చుకుంది ఆయనే.. ఎమోషనల్ అయిన ఆది?

Hyper Aadi: తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆది ప్రస్తుతం కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

Hyper Aadi: నోటి దూలతో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది… భారీగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నటువంటి ఈయన మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించినటువంటి తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది ఎమోషనల్ అవుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలో భాగంగా హైపర్ ఆది పొట్టి నరేష్ తో కలిసి స్కిట్ చేశారు. ఈ స్కిట్ అందరిని పెద్ద ఎత్తున నవ్వించింది. ఈ స్కిట్ అనంతరం జబర్దస్త్ రాము మాతృదేవోభవలోని ఓ పాటకు పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈయన చేసినటువంటి ఈ పర్ఫామెన్స్ అక్కడ ఉన్నటువంటి వారందరి చేత కంటతడి పెట్టించింది.

ఆకలి బాధలు తీర్చారు..

ఈ పర్ఫామెన్స్ అనంతరం హైపర్ ఆది మాట్లాడుతూ.. నేను కెరియర్ పరంగా ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి అదిరే అభి అన్న ఒక కారణం. అయితే నేను కష్టాలలో ఉన్నప్పుడు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టి హక్కున చేర్చుకున్నటువంటి వారిలో రాము అన్న ఒకరు అంటూ ఈ సందర్భంగా ఆది చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Sowmyarao: జబర్దస్త్ మానేయడానికి అదే కారణం.. అసలు విషయం బయటపెట్టిన సౌమ్య రావు?

Sowmyarao: జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించినటువంటి వారిలో సౌమ్యరావు ఒకరు. ఈమె అనసూయ ఈ కార్యక్రమానికి యాంకర్ గా తప్పకున్న తర్వాత యాంకర్ గా పరిచయమయ్యారు అయితే ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో తెలుగు పెద్దగా సరిగా రాకపోయినప్పటికీ పెద్ద ఎత్తున తన మాట తీరుతో అభిమానులను ఆకట్టుకునేవారు.

ఇలా జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఈ కార్యక్రమం నుంచి సడన్ గా తప్పుకోవడంతో ఈమె స్థానంలో బిగ్ బాస్ సిరి యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు. అయితే సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి విషయం గురించి ఈమెను ప్రశ్నించడంతో సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని తెలిపారు. అయితే తాజాగా తాను జబర్దస్త్ వదిలేయడానికి కారణాలను తెలిపారు.

జబర్దస్త్ కార్యక్రమం ఒక తెలుగు షో నాకు తెలుగు సరిగా రాదు. ఇలా వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ఉంటే చాలామంది నన్ను విమర్శలు చేశారు అంతే కాకుండా నాకు డాన్స్ కూడా పెద్దగా రాదు అందుకే డాన్స్ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా క్లాసెస్ కి కూడా వెళ్తున్నానని తెలిపారు. అసలే తాను చాలా సన్నగా ఉంటానని డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడంతో మరింత సన్నగా అవుతున్నానని తెలిపారు.

జోక్స్ అర్థమయ్యేవి కాదు..
ఇలా నేను సన్నగా అవ్వడం చూసినటువంటి జబర్దస్త్ డైరెక్టర్ డాన్స్ ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు మీరు ప్రాక్టీస్ చేయడం మానేయండి అంటూ నాకు సలహా ఇచ్చారు కానీ ఇలా డాన్స్ చేయలేక సరిగా తెలుగు మాట్లాడలేక స్కిట్ చేసేటప్పుడు ఆ జోక్స్ అర్థం కాక నేను ఎంతో ఇబ్బంది పడ్డానని అందుకే తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Alekhya Reddy: వాలెంటైన్స్ డే రోజు తారకరత్నను గుర్తు చేసుకున్న అలేఖ్య.. వీడియో వైరల్!

Alekhya Reddy: ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమికుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇలా ప్రేమికుల దినోత్సవానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి కూడా తన భర్త తారకరత్న గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

సినీ నటుడు నందమూరి వారసుడు తారకరత్న గత ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన సంగతి తెలిసిందే లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఈయన ఉన్నఫలంగా గుండెపోటుకు గురయ్యారు. దాదాపు 20 రోజులకు పైగా హాస్పిటల్ లో చికిత్స పొందినటువంటి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.

ఇలా తన భర్త మరణించినప్పటికీ ఈమె తరచు తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూ వచ్చారు. తాజాగా వాలెంటైజ్ డే సందర్భంగా అలేఖ్యరెడ్డి షేర్ చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది. ఒక ఫ్లవర్ బొకే తీసుకెళ్లి తారకరత్న ఫోటో వద్ద పెట్టడమే కాకుండా తారకరత్న ఫోటోకి ముద్దు పెడుతూ ఆ ఫోటోని హగ్ చేసుకున్నారు.

వాలెంటైన్స్ డే ఓబు..

ఇకపోతే తన ముగ్గురు పిల్లలు కూడా తారకరత్న ఫోటో వద్ద ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియోని ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీ వాలెంటైన్స్ డే ఓబు అంటూ ఈమె తారకరత్నను గుర్తు చేసుకుంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఇలా తారకరత్నను అలేఖ్య రెడ్డి ఎంతో మిస్ అవుతున్నారనే చెప్పాలి.

Priyanka singh: అమ్మాయిగా మారాలనుకుంటే ముందు ఆ పని చేయండి.. ప్రియాంక సింగ్ కామెంట్స్ వైరల్!

Priyanka singh: ప్రియాంక సింగ్ పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమంలో సాయిగా అందరికీ ఎంత సుపరిచితమైనటువంటి ప్రియాంక జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎక్కువగా లేడీ గెటప్స్ వేసేవారు. ఇలా లేడి గెటప్స్ వేసినటువంటి ఈయన అనంతరం సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయి సాయి కాస్త ప్రియాంక సింగ్ గా మారారు.

ఇలా ప్రియాంక సింగ్ గా మారిన తర్వాత ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా సుమారు 12 వారాలు పాటు హౌస్ లో కొనసాగినటువంటి ప్రియాంక సింగ్ బయటకు వచ్చిన తర్వాత కెరియర్ పరంగా సక్సెస్ అందుకోవడం కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. తాజాగా ఈమె యూట్యూబర్ నిఖిల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా తన జీవితం గురించి ఎన్నో విషయాలు తెలిపారు. నాకు చిన్నప్పటినుంచే అమ్మాయి లక్షణాలు తనలో ఎక్కువగా ఉండటంతో తాను అమ్మాయిగా మారిపోయానని తెలిపారు. అయితే అబ్బాయిలు అమ్మాయిగా ఎవరైతే మారిపోవాలనుకుంటున్నారో అలాంటి వారు ముందుగా హార్మోన్ థెరపీ తీసుకోవాలని తెలిపారు. ఇక నేను అమ్మాయిగా మారడంతో ఎంతోమంది ఎన్నో మాటలు అనేవాళ్ళు ఆ మాటలనే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అన్నారని ప్రియాంక తెలిపారు.

మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా…

ఇలా ఇంట్లో వాళ్ళే నన్ను అపార్థం చేసుకోవడంతో తాను ఏకంగా మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశానని కానీ బ్రతకడంతో నేనేదో సాధించాలని అప్పుడే అర్థమైందంటూ ఈమె తెలిపారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో తన గురించి బ్యాడ్ కామెంట్స్ చేసిన వారిపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి కూడా మాట్లాడుతూ కామెంట్ చేయడానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది కానీ చాలామంది లైన్ క్రాస్ చేసి కామెంట్ చేయడంతోనే తాను సీరియస్ అయ్యానని ప్రియాంక తెలిపారు.

Avinash: బిడ్డను కోల్పోవడంపై మరోసారి స్పందించిన అవినాష్.. ది బెస్ట్ రాబోతుందంటూ?

Avinash: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ముక్కు అవినాష్ ఇటీవల బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల అవినాష్ తండ్రి కాబోతున్నారు అంటూ ఈ శుభవార్త అందరికీ తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇలా తన భార్య అనూజ బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే కొన్ని కారణాలవల్ల అవినాష్ బిడ్డ పురటిలో మరణించింది. ఈ విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కొన్ని కారణాలవల్ల నా బిడ్డను కోల్పోయాము దయచేసి ఎవరూ కూడా ఈ విషయం గురించి ప్రశ్నలు వేస్తూ మమ్మల్ని బాధ పెట్టకండి నాకు సంతోషం కలిగిన బాధ కలిగిన మీతో పంచుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అంటూ ఈయన అసలు విషయం వెల్లడించారు.

ఇక అవినాష్ ఎవరు దీని గురించి ప్రశ్నలు అడగద్దు అంటే ఈ విషయాన్ని అందరూ కూడా మర్చిపోయారు కానీ తాజాగా మరోసారి అవినాష్ ఈ విషయం గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా మా బాధను అర్థం చేసుకొని ఈ విషయం గురించి మమ్మల్ని ప్రశ్నించలేదని తెలిపారు. అయితే చాలామంది సినిమా వాళ్లు ఇతర నటీనటులు ఫోన్లు చేస్తూనే ఉన్నారని అవినాష్ తెలిపారు.

కరిగిపోయిన మేఘం..

తల్లిదండ్రులు కాబోతున్నామని ఆరోజు కోసం ఎంతో ఎదురు చూశాము కానీ బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన నుంచి మేము కూడా త్వరగానే కోలుకున్నాము ఇది మా జీవితంలో కరిగిపోయిన మేఘం లాంటిదని తెలిపారు. ఇలా బిడ్డను కోల్పోగా ఫ్యూచర్లో మాకు ఇంకా ది బెస్ట్ రాబోతుందేమో అనుకుంటున్నాము అంటూ ఈ సందర్భంగా ఆమెనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Lavanya Tripathi : అయోధ్యలో జన్మించడం నా అదృష్టం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన లావణ్య త్రిపాఠి?

Lavanya Tripathi: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య. ఈ ముద్దుగుమ్మ మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఎట్టకేలకు ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది లావణ్య త్రిపాఠి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వరుసగా సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఆమె అయోధ్య గురించి ఒక ట్వీట్ కూడా చేసింది. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేసింది. అందులో ఏముంది అన్న విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు దాదాపుగా 500 ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరగడంతో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. దేశ ప్రజలు రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానాలు చేశారు. ఘనంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పలువురు సెలబ్రిటీలు ఆలయాలకు వెళ్లారు.

లావణ్య త్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది. లావణ్య అయోధ్యలో పుట్టడంతో ఆమెకు రామయ్య ఆలయంతో మరింత అటాచ్మెంట్ ఉంది. పద్దతిగా చీరలో రెడీ అయి, సీతారాముల పట్టాభిషేకం విగ్రహం ఉన్న భారీ హారం మెడలో ధరించి ఆమె ఫోటోలను షేర్ చేస్తూ రాముడి పుట్టిల్లు అయిన అయోధ్యలో నేను పుట్టడం, ఈ అద్భుతమైం కార్యక్రమాన్ని చూడటం నా అదృష్టం. రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూడటం నాతో పాటు దేశప్రజలందరికి గర్వకారణం. ఈ సందర్భంగా రామ్ పరివారాన్ని నగలుగా ధరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాణ ప్రతిష్ట వేడుక అయోధ్యకు మాత్రమే కాదు దేశం మొత్తానికి సంబంధించింది.

గుండెల్లో దైవభక్తిని నింపుకుందాం…

దేశం మొత్తం కలిసి వచ్చే సమయం ఇది. దేశంలోని ప్రజలందరి మధ్య ఐక్యత భావాన్ని నెలకొల్పుతుంది. పెదవులపై జై శ్రీరామ్ అంటూ, గుండెల్లో దైవభక్తిని నింపుకొని శాంతి దేశమంతా ఉండాలని ప్రార్ధిద్దాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో లావణ్య పోస్ట్ వైరల్ అవ్వగా లావణ్య అయోధ్యలో పుట్టిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/C2ZIwQRysKV/?utm_source=ig_web_copy_link

Amar Deep: అమ్మ ముందు బూతులు తిట్టారు.. నా భార్యను తీసుకెళ్తామన్నారు.. అమర్ షాకింగ్ కామెంట్స్!

Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అమర్ దీప్ ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నప్పుడు తన ఫ్యామిలీని కూడా భారీ స్థాయిలో బూతు కామెంట్లతో ట్రోల్ చేశారు. ఇక ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన కారు పై దాడి జరగడమే కాకుండా ఎంతోమంది ఈయన పట్ల భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

ఇన్ని రోజులపాటు ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నటువంటి అమర్ ప్రస్తుతం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆరోజు ఏం జరిగింది అనే విషయాలన్నీ వెల్లడించారు. బిగ్ బాస్ పూర్తి చేసుకొని బయటకు వస్తుంటే మా వాళ్ళందరూ రావద్దు దాకో అంటూ నాకు చెప్పారు అసలు నేను ఎందుకు దాక్కోవాలి ఏం తప్పు చేశానని కారు ఎక్కాను కారు బయటకు రాగానే ఎంతోమంది సెల్ఫోన్ లైట్లు వేసుకొని కారుని చుట్టుముట్టారని ఆ సమయంలోనే రాళ్లతో విసరడం మా అమ్మ ముందే అమ్మ గురించి బూతులు మాట్లాడారని అమర్ తెలిపారు.

మనపై ఎవరైనా రెండు దెబ్బలు కొట్టిన భరించవచ్చు గాని కన్న కొడుకు ముందు తల్లిని అలా మాట్లాడుతుంటే చూడలేకపోయాను నేను కారు దిగడానికి ప్రయత్నం చేయగా అమ్మ ఆపిందని తెలిపారు. ఇక అమ్మను మాత్రమే కాకుండా తేజుని కూడా చాలా తిట్టారు నీ భార్యను తీసుకెళ్తామంటూ మాట్లాడారు చాలా బాధేసిందని అయితే ఇప్పుడు నేను కేసులు పెట్టొచ్చు కానీ వారికంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఉద్దేశంతోనే నేను ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టలేదని అమర్ తెలిపారు.

అమ్మను తిడితే బాధ కలిగింది.

అదొక గేమ్ షో మాత్రమే దానిని గేమ్ లాగా చూస్తే ఈ గొడవలు ఉండవని అమర్ తెలిపారు. నేను జెన్యూన్ గానే గేమ్ ఆడను అందరిలాగ ముందు ఒకలా వెనక ఒకలాగా మాట్లాడలేదని అయినప్పటికీ నన్ను నా ఫ్యామిలీని ఎంతో ఇబ్బంది పెట్టారు అంటూ అమర్ మొదటిసారి తనపై జరిగినటువంటి దాడి గురించి స్పందించి చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: నాన్న లేరు.. అన్నీ మీరే అంటూ ఎమోషనల్ అయిన మహేష్ బాబు?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా వేడుకను గుంటూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన తండ్రి కృష్ణ మరణించిన తర్వాత మొదటి సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో ఈ వేదికపై మహేష్ బాబు తన తండ్రి కృష్ణ గారిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. సంక్రాంతికి నా సినిమా వస్తే హిట్ అవుతుందన్న సెంటిమెంట్ మాలో ఉందని తెలిపారు.

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను చూసి నాన్న నాకు ఫోన్ చేసి అభినందనలు తెలిపేవారు కానీ ఈసారి నాన్న లేరు. ఇకపై ఆ విషయాలన్నీ మీరే నాకు తెలియచేయాలి. మీరే నా అమ్మానాన్న అంటూ అభిమానులను ఉద్దేశించి ఈయన ఎమోషనల్ కామెంట్ చేయడమే కాకుండా అభిమానులందరికీ చేతులెత్తి దండం పెట్టారు. ఇలా తండ్రిని తలుచుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ అవడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

నాకన్నీ మీరే…

ఇక మహేష్ బాబు నటించిన ప్రతి సినిమాకి కూడా కృష్ణ తన అభిప్రాయాలను తెలియజేసే వారు మొదటిసారి కృష్ణ గారు లేకుండా గుంటూరు కారం సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో మహేష్ బాబు తన తండ్రిని గుర్తుచేసుకొని ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

Manchu Manoj: మౌనికతో ప్రేమలో పడ్డాకే ఆ విషయం తెలిసింది… మనోజ్ మాటలకు మౌనిక ఎమోషనల్!

Manchu Manoj: మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని ఈ ఏడాది మార్చి నెలలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. ఇకపోతే భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ కూడా కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈయన ఇప్పుడు కెరియర్ పై ఫోకస్ పెడుతున్నారు.

ఇలా ఒకవైపు వరుస సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు పలు టీవీ షోలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో ఉస్తాద్ అనే టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కార్యక్రమానికి మనోజ్ వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నారు .ఇక ఈ కార్యక్రమం డిసెంబర్ 15వ తేదీ ప్రారంభం కానున్న నేపథ్యంలో లాంచింగ్ ఈవెంట్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాను ఏడు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను అయితే మౌనిక రెడ్డితో ఏడడుగులు వేసిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చానని తెలియజేశారు. ఇలా ఏడేళ్లు ఇండస్ట్రీకి దూరమైన అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని తెలిపారు.

ప్రేమ విలువ అప్పుడే తెలిసింది…


ఇక తాను భూమ మౌనికతో ప్రేమలో పడిన తర్వాత ప్రేమ అంటే ఏంటో అప్పుడే తెలిసిందని, ఈ సందర్భంగా భూమా మౌనికను అలాగే తన అభిమానులు తన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను ఉద్దేశించి ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .తన గురించి మనోజ్ అలా మాట్లాడటంతో మౌనిక కూడా ఎమోషనల్ అయ్యారు.

Meena Daughter: అమ్మ గురించి తప్పుడు వార్తలు రాయొద్దు… తను కూడా మనిషే కదా: నైనిక

Meena Daughter: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. బాలనటిగా ప్రేక్షకులను అలరించిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.

ఆ తర్వాత వివాహం చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా మళ్లీ భర్త సహకారంతో ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా మీనా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల చెన్నైలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరై మీనాకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరయ్యాడు.

ఇక ఈ కార్యక్రమంలో మీనా కూతురు నైనిక తన తల్లి గురించి మాట్లాడిన మాటలకు రజనీకాంత్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తండ్రి మరణించిన తర్వాత తన తల్లి మానసిక ఒత్తిడికి గురైందని.. అదొక పెయిన్ ఫుల్ టైమ్ అంటూ నైనిక ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియోలో నైనిక మాట్లాడుతూ…” అమ్మా.. నటిగా నువ్వు ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నాను. నటిగా మాత్రమే కాకుండా ఒక తల్లిగా కూడా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు.నాన్న మరణంతో పరిస్థితులు చీకటిగా మారాయి.

Meena Daughter: తనకు ఫీలింగ్స్ ఉంటాయి…

ఇకపై నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని విషయాల్లో సాయం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కొద్దిరోజులుగా మా అమ్మ గురించి కొన్ని తప్పుడు వార్తలు వచ్చాయని, అమ్మ కేవలం నటి మాత్రమే కాదు.. మీలాగా ఓ మనిషే.. ఆమెకూ ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వార్తలు రాయొద్దు అంటూ ఎమోషనల్ అయ్యింది. దీంతో అక్కడే ఉన్న రజినీతోపాటు.. ఇతర సెలబ్రెటీలు కన్నీళ్లు పెట్టుకున్నారు.