Tag Archives: emotional

స్క్రీన్ పై టైటిల్ పడగానే.. భావోద్వేగమైన రకుల్.. కారణం ఏమిటంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి “వెంకటాద్రి ఎక్స్ప్రెస్” సినిమా ద్వారా అడుగుపెట్టిన రకుల్ తర్వాత ఎక్స్ప్రెస్ వేగంతో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషల్లో సినిమాలు తీస్తూ ఎంతో మంచి గుర్తింపు పొంది వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

ఆ తర్వాత పలు వరుస ఫ్లాప్ లను చవిచూసిన రకుల్ ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు దక్కించుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రకుల్ తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన “కొండపొలం” అనే సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా “భారతీయుడు 2”, “ఎటాక్”, “మేడే”,”థ్యాంక్ గాడ్” వంటి సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీకి తాజాగా కంటతడి పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు రకుల్ అంత ఎమోషనల్ గా కన్నీరు పెట్టుకోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ రంజిత్ తివారీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన
‘బెల్ బాటమ్’ అనే చిత్రంలో నటించారు.

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించగా తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ చిత్ర బృందంతో కలిసి థియేటర్ లో ఈ సినిమాను చూస్తూ ఎమోషనల్ అవ్వదు కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత థియేటర్ లో సినిమాలు చూడటంతో తెరపై టైటిల్స్ పడగానే రకుల్ భావోద్వేగానికి గురైంది.

రోడ్డుపైన హగ్ చేసుకున్న రెండు కుక్కులు.. ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్..

ఎవరైనా బాధలో ఉన్నప్పుడు కౌగిలించుకుంటే ఆ బాధ వెంటనే పోతుందట. ఒక మనిషి మరో మనిషిని హగ్ చేసుకోవడం మనం చూస్తుంటాం.. కానీ ఒక శునకం.. మరో శునకాన్ని ఆత్మీయంగా కౌగిలించుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో రెండు కుక్కలు ఆత్మీయంగా హగ్ చేసుకున్న చిత్రం ఎక్కువగా షేర్ చేయబడింది.

రెండు కుక్కల ఈ ఫోటో లక్షలాది మందిని ఏడిపించింది. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్న తీరు చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇందులో ఏముందంటే.. ఓ వ్యక్తి హెన్నీ అనే శునకాన్ని పెంచుకుంటున్నాడు. దాంతో కలిసి ఉదయం వాకింగ్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే అటునుంచి మరో కుక్కతో కలిసి ఓ నర్స్ వాకింగ్ కు వచ్చాడు.

ఆ రెండు కుక్కలు పక్క పక్కనే రావడంతో రెండు గట్టిగా పట్టుకున్నాయి. మనుషులా రెండు కుక్కలు ఒకరినొకరు ఎలా కౌగిలించుకుంటున్నాయో నర్స్ నమ్మలేకపోయింది. అతను వెంటనే దానిని ఫోటో తీసి తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అది చూసినప్పుడు కేవలం 17 వందల మంది అనుచరులతో అతని ఖాతాలో లక్షలాది లైకులు వచ్చాయి.

అంతేకాకుండా దీనిని కొన్ని వేల మంది రీట్వీట్ కూడా చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేశారు. ఈ చిత్రం తనను ఏడిపించిందని ఒక వ్యక్తి కామెంట్ చేస్తే.. అదే సమయంలో ఒక వ్యక్తి కుక్కల మధ్య ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుందని అభిప్రాయ పడ్డాడు. ఫోటో చూసిన తర్వాత అందరూ ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రం ప్రజలను ఏడిపిస్తోందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

ఆ విషయంలో నా కుటుంబానికి లేని బాధ నీకెందుకు..అంటూ ఫైర్ అయిన నటి గీతాసింగ్..!

నటి గీతాసింగ్ అనడం కంటే.. “కితకితలు” హీరోయిన్ అంటే అందరికీ వెంటనే గుర్తొస్తారు. కితకితలు సినిమా ద్వారా ఎంతో మందిని నవ్వించిన నటి గీతాసింగ్ అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. కితకితలు సినిమాలో లావుగా ఉండి అందరినీ నవ్వించినదో ఇప్పుడు అదే లావు తనని ఏడిపిస్తుందని చెప్పవచ్చు. తాజాగా నటి గీతాసింగ్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చారు. ఈ కార్యక్రమంలో బయట తనపై వచ్చే కామెంట్స్, ట్రోలింగ్ గురించి చెబుతూ గీత సింగ్ ఎమోషనల్ అయ్యారు.

ప్రతివారంలాగే ఈ వారం క్యాష్ ప్రోగ్రామ్ కు అంబటి శ్రీనివాస్, బాలాదిత్య, గీతా సింగ్, సునీల్ శెట్టి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడు మాదిరిగానే క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చే గెస్టులతో సుమ చేసే సరదా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన టైమింగ్ లో సరైన పంచులు వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఈ విధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గెస్టు లతో నవ్వులు పూయించిన సుమ గీతాసింగ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా భావోద్వేగం అయ్యారు.

ఈ క్రమంలోనే గీతా సింగ్ ను ఉద్దేశించి.. ఏంటి ఈ మధ్య చాలా భాధపడ్డారంట అని సుమ అడగడంతో ఒక్కసారిగా గీతా సింగ్ ఎమోషనల్ అయ్యారు. తన బాడీ షేమింగ్ పై బయట పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని, ఎక్కడికి వెళ్లిన మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు..?ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ప్రశ్నలు ఎదురవుతున్నాయని భావోద్వేగం అయ్యారు.

గీతా సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నాకు అవకాశాలు లేవు. అందుకు కారణం నేను లావుగా ఉండడమే, ఇప్పటికీ అవకాశాలు కోసం తిరుగుతూ ఉన్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే నేను నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నాము. నా పెళ్లి విషయంలో నా కుటుంబానికి లేని బాధ మీకు ఎందుకంటూ గీత గట్టిగా స్పందించారు.ఈ విషయం గురించి చాలా మంది కావాలనే కామెంట్స్ చేయడమే కాకుండా బయటకు వెళ్ళినా ఇదే ప్రశ్ననని తరచు అడగటం ఎంతో ఇబ్బంది కరంగా ఉందని తన మనసులోని బాధను బయటపెట్టారు.

డాక్టర్లు చనిపోతానని చెప్పారు… వీళ్ళ వల్లే బతికాను అంటూ ఎమోషనల్ అయినా కమెడియన్ జీవన్!

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం కమెడియన్లు నవ్వులు పండించడమే కాకుండా ఎవరికైనా ఆపద వస్తే అందరూ ఒక్కటై వారిని కాపాడుకోవడంలో ముందుంటారని ఎన్నోసార్లు నిరూపించబడింది. తాజాగా ఓ కమెడియన్ విషయంలో కూడా అదే జరిగింది.గత కొన్ని నెలల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ జీవన్ కనిపించలేదు. అందుకు గల కారణం అతడు అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని నెలల నుంచి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కమెడియన్ జీవన్ కోలుకొని తిరిగి ఎక్స్ ట్రా జబర్దస్త్ వేదికపై సందడి చేశాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మి చాలా రోజుల తర్వాత అనారోగ్యం నుంచి కోలుకున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రావడం మీకు ఎలా ఉందని అడగడంతో జీవన్ ఎంతో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యాడు. అసలు ఈ కార్యక్రమానికి వస్తానని అనుకోలేదు. డాక్టర్లు చనిపోతానని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఉండాలంటే అంతటికీ కారణం జబర్దస్త్ టీం మెంబెర్స్ అని తెలియజేశారు.

ఆరోజు వీళ్ళందరూ ఆదుకోవడంతోనే ఈ రోజు ఈ వేదికపై ఉన్నానని జీవన్ ఎమోషనల్ అయ్యారు.డాక్టర్లు ఇంజక్షన్ లకి కూడా సహకరించడం లేదని ఇతను చనిపోతాడని చెప్పడంతో అమ్మ భోరున ఏడ్చింది. చిన్న బాబు కూడా ఉన్నాడు డాక్టర్లు బతకడం కష్టం అని చెబితే వీళ్లంతా కలిసి బతికించారు మేడమ్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

కేవలం జీవన్ ఒక్కడు మాత్రమే కాదు. మా జబర్దస్త్ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా మేమందరం ఇలాగే ఉంటామని గెటప్ సీను ఎమోషనల్ అయ్యాడు.ప్రస్తుతం ఈ వారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఆత్మహత్య చేసుకోకుండా అలా అంటూ.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత!

తెలుగు గాయని సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన మృదువైన గాత్రం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సునీతకు సోషల్ మీడియాలో కూడా అదే ఫాలోయింగ్ ఉంది.ఈమెకు కూడా అభిమానుల పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు. ముఖ్యంగా సునీత సింగర్ ఫాన్స్ గురించి చెబుతూ సునీత అప్పుడప్పుడు ఎంతో ఎమోషనల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే ఓ సారి ఇంస్టాగ్రామ్ లైవ్ లో ముచ్చటించిన సునీత సునీత సింగర్ ఫాన్స్(ఎస్ఎస్ఎఫ్)కి నా జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, నా ప్రాణంతో సమానం అని తెలిపారు.

ఈ విధంగా ఎస్ఎస్ఎఫ్ ద్వారా చేసే పలు పోస్టులు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని చెప్పవచ్చు. సునీతను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది తమ జీవితంలోకి ముందడుగు వేశారని, జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, సునీత వల్ల సాయం పొందిన వారు తమ జీవితం గురించి తెలియజేస్తుంటారు. ఈ విధంగా ఓ అభిమాని సునీతను కదిలించే పోస్ట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ సందర్భంగా సునీత అభిమాని పోస్ట్ చేస్తూ..సునీత ఉపద్రష్ట.. ఓ స్పూర్తి ప్రధాత అంటూ ఎస్ఎస్ఎఫ్‌లో మెంబర్ అయిన ఇందిరా ప్రియదర్శిని అనే అమ్మాయి తన జీవితం గురించి, తన జీవితంలో సునీత పాత్ర గురించి చెప్పుకొచ్చారు. నాకు ప్రాణబిక్ష పెట్టిన దేవత సునీత గారు. ఆమె పాట మనసుకు ప్రశాంతత కల్పిస్తే ఆమె మాట మనిషికి ప్రాణం పోసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఆమెకు ఉన్న అలవాటు. ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం నాలో నింపి ఆత్మహత్య చేసుకోకుండా చేసింది. ఆమె పలకరింపు అప్పుడే పుట్టిన పసి పిల్ల నవ్వులా ఉంటుంది. ఆవిడ ఎంతో మందికి ఆదర్శం..ఆవిడ ఎంతోమందికి దైర్యం…ఆవిడ పాటలు ఎంతో మంది మనసుకు ప్రశాంతత.. ఆవిడ దేవుడు నాకు పంపిన బహుమతి అంటూ పోస్ట్ చేసింది. ఈ విధంగా అభిమాని చెప్పిన మాటలకు సునీత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. జీవితంలో కొత్త ఆరంభం అంటూ ఎమోషనల్?

బుల్లితెరపై పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వారిలో చైత్ర రాయ్ ఒకరు.అష్టా చమ్మా అలామొదలైంది వంటి సీరియల్స్ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన చైత్రకు తెలుగులో మంచి అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సీరియల్ తో ఎంతో బిజీగా ఉన్న చైత్ర ఉన్నఫలంగా సీరియల్స్ కి విరామం ఇచ్చారు. అయితే బుల్లితెరకు గుడ్ బాయ్ కాకుండా కేవలం విరామం మాత్రమే అని చెప్పిన చైత్ర తాజాగా అసలు విషయాన్ని బయటపెట్టారు.

గత కొంత కాలం నుంచి సీరియల్స్ కి దూరంగా ఉన్న చైత్ర తాజాగా తన అభిమానులకు ఒక శుభవార్తను తెలియజేశారు. చైత్ర తన భర్త ప్రసన్న ఇద్దరు కలిసి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తమ జీవితం కొత్త ఆరంభం కాబోతుందని చెబుతూ తాను త్వరలోనే తల్లి కాబోతున్నానే విషయాన్ని తెలుపుతూ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే చైత్ర పోస్ట్ చేస్తూ జీవితంలో మనం ఎప్పుడైనా సందిగ్దంలో ఉంటే అప్పుడు పిల్లలను ఎంచుకోండి. కెరియర్ పని సెలెక్ట్ చేయడం కోసం జీవితంలో చాలా సమయం ఉంది.ఫ్యామిలీ అనేది మనకు కేవలం ముఖ్యమైనది మాత్రమే కాదు అదే మన సర్వస్వం అంటూ.. త్వరలోనే బేబీ చైత్ర రాయ్ రాబోతుంది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.

ఈ విషయాన్ని తన భర్తతో కలిసి మాతో పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని.. మాకు మీ ప్రేమ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మా జీవితంలోకి రాబోతున్న కొత్త దశను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ సమయంలో ఆయన నా మొహం కూడా చూడలేదు.. రేణు దేశాయ్!

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడమే కాకుండా సామాజిక సేవలను గురించి పలు సందర్భాలలో వివరిస్తుంటారు.అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల సినిమా ఆగిపోవడంతో రేణు దేశాయ్ బుల్లి తెరపై సందడి చేస్తున్నారు.

జీ తెలుగులో ప్రసారం కాబోయే డ్రామా జూనియర్స్ కు రేణుదేశాయ్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో ద్వారా రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ ఎంతోమందిలో ఆలోచనను కలిగించాయి. ఈ క్రమంలోనే గత ఆదివారం సోషల్ మీడియా, మీడియా,పలు వెబ్సైట్లు రాసే రాతలు వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు ఎదుర్కొనే ఇబ్బందులను గురించి చేసిన స్కిట్ చూసి ఎమోషనలయ్యారు. ఈ విధంగా వార్తలు రాయడం వల్ల వారు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించి వార్తలు రాయండి అంటూ ఆమె తెలిపారు.

ఇక ఈ వారంలో జరగబోయే ఎపిసోడ్ లో మొట్టమొదటి సారిగా రేణు దేశాయ్ తన కూతురు ఆద్యాను బుల్లి తెరకు పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఆధ్య ఈ కార్యక్రమానికి రావడంతోనే రేణూ దేశాయ్ గురించి, అమ్మదనం గురించి ఎంతో గొప్పగా చెప్పేశారు. తాజాగా ఈ వారంలో జరగబోయే డ్రామా జూనియర్స్ విడుదల చేశారు.

ఈ ప్రోమోలో ఆడపిల్ల పుడితే భర్త హింసించే బాధలకు భార్య పడే కష్టాలను ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ స్కిట్ చూసిన రేణు దేశాయ్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా తెలిపారు. తాము కూడా ఇద్దరు ఆడపిల్లలమని, తనకన్నా ముందు అక్క పుట్టింది.తర్వాత నేను పుట్టడంతో మళ్లీ ఆడపిల్ల పుట్టిందని తన తండ్రి కొద్ది రోజుల వరకు తన మొహం కూడా చూడలేదని రేణు దేశాయ్ చెప్పిన మాటలకు అక్కడున్న వారందరూ ఎమోషనల్ కాగా, ఆద్య తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు.