Tag Archives: flood victims

వరద బాధితుల కోసం రూ.25లక్షల విరాళం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్.. అదే బాటలో మహేశ్ బాబు కూడా..

గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా.. చెట్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి.

దీంతో అక్కడ జనజీవనం అంతా స్తంభించింది. చిత్తూరు, కడప జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం భారీగా ఉంది. దీంతో తిరుమల దేవస్థానం అధికారులు దయచేసి దర్శనానికి వచ్చే వాళ్లు వాయిదా వేసుకోవాలని.. వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న టికెట్ల సహాయంతో దర్శణం చేసుకోవచ్చు అంటూ తెలిపారు. ఇక అక్కడ కొన్ని గ్రామాల్లో కరెంట్ లేక.. తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అక్కడి రహదారులు అయితే కాలువలను తలపిస్తున్నాయి. వీటంన్నింటిన చూసి జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజల కష్టాలను చూసి బాధపడ్డారు. ఈ పరిస్థితి వేరొకరికి రాకూడదని.. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. తన వంతుగా అతడు రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశాడు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించి.. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. తన వంతుకుగా రూ. 25 లక్షల రూపాయలను అందిస్తున్నాను’’ అని రాశారు. అతడితో పాటు ప్రిన్స్ మహేశ్ బాటు కూడా రూ.25 లక్షలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరు వారి సహాయార్థం ఆ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

జగన్ మరో సంచలన నిర్ణయం.. వాళ్లకు 5 లక్షల రూపాయలు..!

తెలుగు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వర్షాలు గజగజా వణికిస్తున్నాయి. ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. పలు ప్రాంతాల్లో వరదల వల్ల కొంతమంది మృతి చెందారు. తెలంగాణతో పోలిస్తే మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నా చనిపోయిన వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు. దీంతో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయారని ఈ నెల 31వ తేదీలోపు పంటనష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని.. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ వేగంగా జరగాలని చెప్పారు.

నేడు కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన జగన్ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, భారీ వర్షాలు, వరదలు, నాడు నేడు, ఇతర అంశాల గురించి సీఎం జగన్ ప్రధానంగా చర్చించారు. ఇళ్లు కూలిన వారికి తక్షణమే సహాయం అందే విధంగా చర్యలు చేపట్టాలని.. కలెక్టర్లు ఇళ్లు కూలిన వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు.

చనిపోయిన వాళ్ల కుటుంబాలకు పరిహారం అందే విధంగా కలెక్టర్లే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపే బడ్జెట్ ప్రతిపాదనలు కూడా పూర్తి కావాలని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ వేగంగా జరిగేలా కృషి చేసిన కలెక్టర్లను సీఎం అభినందించారు.