Featured

జగన్ మరో సంచలన నిర్ణయం.. వాళ్లకు 5 లక్షల రూపాయలు..!

తెలుగు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వర్షాలు గజగజా వణికిస్తున్నాయి. ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. పలు ప్రాంతాల్లో వరదల వల్ల కొంతమంది మృతి చెందారు. తెలంగాణతో పోలిస్తే మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నా చనిపోయిన వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు. దీంతో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయారని ఈ నెల 31వ తేదీలోపు పంటనష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని.. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ వేగంగా జరగాలని చెప్పారు.

నేడు కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన జగన్ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్, భారీ వర్షాలు, వరదలు, నాడు నేడు, ఇతర అంశాల గురించి సీఎం జగన్ ప్రధానంగా చర్చించారు. ఇళ్లు కూలిన వారికి తక్షణమే సహాయం అందే విధంగా చర్యలు చేపట్టాలని.. కలెక్టర్లు ఇళ్లు కూలిన వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు.

చనిపోయిన వాళ్ల కుటుంబాలకు పరిహారం అందే విధంగా కలెక్టర్లే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపే బడ్జెట్ ప్రతిపాదనలు కూడా పూర్తి కావాలని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ వేగంగా జరిగేలా కృషి చేసిన కలెక్టర్లను సీఎం అభినందించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago