బుల్లితెర స్టార్ కమెడియన్, జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్, ఢీ ఛాంపియన్స్ తో పాటు పలు ఈవెంట్లతో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్ కు కరోనా అంటూ వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. రెండు రోజుల క్రితం సుధీర్ అనారోగ్యం బారిన పడ్డాడని.. పరీక్షలు చేయించగా వైరస్ నిర్ధారణ అయిందని వార్తలు వస్తున్నాయి.
సుధీర్ కానీ ఆయన టీమ్ కానీ ఈ వార్తలపై ఇప్పటివరకూ ఇంకా స్పందించలేదు. అయితే సుధీర్ కు కరోనా నిజంగా సోకిందో లేదో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సుధీర్ హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై అత్యంత బిజీగా ఉండే యాంకర్లలో కమెడియన్లలో సుధీర్ ఒకరు. టీవీ షోల ద్వరా సుధీర్ రోజురోజు తన రేంజ్ ను పెంచుకుంటున్నారు.
రెండు మూడు రోజుల నుండి సుధీర్ కు కరోనా సోకిందంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ మధ్య కాలంలో సుధీర్ పలు ఈవెంట్లలో పాల్గొన్నారు. సుధీర్ కు కరోనా సోకితే ఆయనతో కలిసి పని చేసిన నటులు, యాంకర్లు, సిబ్బంది హోం క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. సుధీర్ కు కరోనా అంటే ఆమెతో షోలలో, ఈవెంట్లలో ఎక్కువగా పాల్గొనే రష్మీకు కూడా టెన్షన్ తప్పదు.
మరోవైపు సుధీర్ ను కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రావడం లేదని సమాచారం. ఇప్పటికే సినిమా, టీవీ ఇండస్ట్రీలో చాలామందికి కరోనా నిర్ధారణ అయింది. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఈ మధ్యే కరోనా నుంచి కోలుకుని షోలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…