Tag Archives: gani

Varun Tej -Lavanya Tripathi: ఒకే చోట చేరి సందడి చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి.. వైరల్ అవుతున్న ఫోటో?

Varun Tej -Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా గని, ఎఫ్ 3 సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇందులో గని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కాగా ఎఫ్3 సినిమాతో ఈయన ప్రేక్షకులను సందడి చేశారు.ఈ సినిమా మంచి విజయం కావడంతో తన తండ్రి నాగబాబు నిర్మాణంలో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా గురించి అప్డేట్ విడుదల చేయాల్సి ఉంది.

ఇకపోతే హీరో వరుణ్ తేజ్ గురించి గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈయన నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి.ఈయన లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉండటం వల్లే తన సోదరీ నిహారిక వివాహానికి ఏ ఇతర హీరోయిన్లు హాజరు కాకపోయినా లావణ్య త్రిపాటి మాత్రమే హాజరయిందంటూ వార్తలు షికార్లు చేశాయి.

ఈ విధంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ గురించి పెద్ద ఎత్తున ఈ వార్తలు రావడంతో ఇందులో నిజం లేదని లావణ్య త్రిపాఠి ఈ వార్తలను కొట్టి పారేశారు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఒకచోట చేరి మరోసారి పెద్ద ఎత్తున సందడి చేశారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు.అయితే తన ఫ్రెండ్ పుట్టినరోజు కావడంతో వీరిద్దరూ కూడా ఆ పుట్టిన రోజు వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేసినట్టు తెలుస్తుంది.

Varun Tej -Lavanya Tripathi: పుట్టినరోజు వేడుకలలో సందడి చేసిన వరుణ్…లావణ్య..

ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు ఒకే చోట చేరి కనిపించడంతో మరోసారి వీరి ప్రేమ గురించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి వీరిద్దరూ ఎక్కడ కలిసిన వీరి ప్రేమ గురించి వార్తలు రావడంతో చాలామంది వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారని బయటకు చెప్పడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్ ఉందో కాలమే నిర్ణయించాల్సి ఉంది.

డిసెంబర్ నెలలో థియేటర్లో సందడి చేసే సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి..

2021 చివరి నెల బాక్సాఫీస్ వద్ద సంచలనం స్పష్టించనుంది. నందమూరి బాలకృష్ణ సినిమాతో మొదలై థియేటర్లలో సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ 2021లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల జాబితా ఇక్కడ చూద్దాం. వాటిపై ఓ లెక్కేద్దాం.. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో డిసెంబర్ 2న ‘అఖండ’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘అఖండ’లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఈ వారాంతంలో థియేటర్లలోకి రానున్న మరో తెలుగు చిత్రం ‘స్కైలాబ్’. డిసెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉది. ‘స్కైలాబ్’ అనేది 1979 నాటి కామెడీ, డ్రామాగా తెరకెక్కింది. తమ గ్రామం పై స్పేస్ స్టేషన్ పడిపోతుందని ఒక గ్రామ ప్రజలు హృదయపూర్వకంగా భావించే సంఘటనల హాస్య మలుపుతో వ్యవహరిస్తారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
డిసెంబర్ రెండో వారంలో కొత్త సినిమాల హంగామా కనిపిస్తోంది. అవి నాగశౌర్య ‘లక్ష్య’, కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ మరియు శ్రియ ‘గమనం’.

అవన్నీ ఒకే రోజున – డిసెంబర్ 10న విడుదలకానున్నాయి. ‘లక్ష్య’ అనేది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ‘గుడ్ లక్ సఖి’ కూడా లంబాడా అమ్మాయి గురించి మాట్లాడే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గమనం’.. శ్రియా శరణ్, నిత్యా మీనన్, శివ కందుకూరి మరియు ప్రియాంక జవాల్కర్ చుట్టూ తిరిగే కథ. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

ఈ నెలలో అతిపెద్ద చిత్రం అల్లు అర్జున్ తొలి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ – ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ‘పుష్ప ది రైజ్’ డిసెంబరు 17న ఏకకాలంలో ఐదు భాషల్లో విడుదలవుతోంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత దర్శకుడు సుకుమార్‌ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ బిగ్గీ ‘స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్’ తెలుగులో కూడా విడుదలవుతోంది, ఇది ‘పుష్ప’కి ఒక రోజు ముందే థియేటర్లలోకి రానుంది. నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 25 న విడుదల అవుతుంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది ఈ సినిమా. రాహుల్ సంకృతియన్ దర్శకత్వం వహించిన ఈ చింద్రంలో .. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ మరియు కృతి శెట్టి నటించారు. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే రోజున కపిల్ దేవ్ బయోపిక్ ’83’ కూడా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.

మరోసారి రిపీట్ కానున్న ‘ఫిదా’ కాంబో.. ఇక ఆడియన్స్ కి పండగే..!!

మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘ఫిదా’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం హిట్ సినిమాకు కొత్తం అర్దం చెప్పినట్లుగా కలెక్షన్స్ వర్షం కురిపించింది..అంతేకాదు సినిమాలో సాయి పల్లవి తన అందం, అభినయం తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.. అంతే కేవలం ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి ఫుల్ బిజీ అయ్యిపోయింది.

దాంతో ఇప్పుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరక్టర్, ఏమా కథ అంటారా..కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వరుణ్ తేజ్. ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ అనే స్పోర్ట్స్‌ డ్రామా చేస్తున్నారు వరుణ్‌ తేజ్‌.అలాగే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలసి ‘ఎఫ్‌ 3’ చిత్రంలోనూ నటిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది.

ఈ గ్యాప్‌లోనే ‘ఛలో, భీష్మ’ చిత్రాల ఫేమ్‌ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్‌ విన్నారట వరుణ్‌. వెంకీ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్‌ తేజ్‌.ప్రస్తుతం నటిస్తున్న ‘గని, ఎఫ్‌ 3’ చిత్రాల షూటింగ్‌ పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని సమాచారం. అన్నీ కుదిరితే దసరాకి చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మించనుందని తెలిసింది.

ఈ సినిమాలో వరణ్ సందేశ్ సరసన సాయి పల్లవిని ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయి. అయితే కరోనా సమస్యతో డేట్స్ అందరివీ డిస్ట్రబ్ అయ్యిపోయాయి. దాంతో సాయి పల్లవి తను ఖచ్చితంగా ఫలానా తేదీ నుంచి డేట్స్ ఇవ్వగలను అని చెప్పలేనని అందిట. ఇక మరోవైపు దర్శకుడు వెంకీ ఇప్పటికే వరుణ్ కి ఒక నెరేషన్ ఇచ్చాడు. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు వెంకీ కుడుముల..!!