Tag Archives: gold price

మళ్లీ పెరిగిన బంగారం ధర.. పడిపోయిన వెండి ధరలు!

గత కొన్ని రోజుల నుంచి తగ్గుకుంటూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాముల పసిడి ధరపై రూ.200 పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,800 వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. బంగారం ధర రూ.200 మేర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది.

వెండి ధర ఒక కిలోకు రూ.400 తగ్గింది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.63,800 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,720 గా ఉంది.

ఇక హైదరాబాద్ లో అయితే 2 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460 ఉంది. ఇలా బంగారం పెరగడం తగ్గడంలో వివిధ రకాల కారణాలు ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

తగ్గుతున్న బంగారం ధర.. నెల రోజులకు దాదాపు రూ.1600 తగ్గుదల..

బంగారం అంటే ఇష్టపడని వారు అస్సలు ఉండరు. ఎక్కువ సంపాదన, డబ్బులు ఉన్నవాళ్లు ఎక్కువగా గోల్డ్ లో ఇన్ వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే బంగారం దాదాపు నెల రోజులతో పోల్చితే రూ.1600 వరకు తగ్గింది. వివరాల్లోకి వెళ్తే.. బంగారం ప్రియులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే.. గత కొన్ని నెలల నుంచి బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏ రోజు ఎంత పెరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

అంతేకాకుండా బంగారం తీసుకోవాలని అనుకునే వారు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. దాదాపు తులం బంగారం అంటే 10 గ్రాములు రూ.50 వేలు దాటేసింది. అయితే గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. 10 గ్రామలు బంగారం ధరలు రోజుకు రూ.100 నుంచి రూ.200 చొప్పున దగ్గుకుంటూ వస్తున్నాయి. పోయిన నెల అంటే ఆగస్టు 15 నాటికి 10 గ్రాముల ధర (22 క్యారెట్స్) రూ.45 వేలు ఉండగా.. ప్రస్తుతం ఆ ధర రూ.

43,400 లకు చేరింది. ప్రస్తుతం ఈ ధరలు హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ఒకేలా ఉన్నాయి. బంగారం కొనాలుకునే వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి హైదరాబాద్‌లో వెండి ధర 1 గ్రాము రూ.67.80 గా ఉంది. అదే… 8 గ్రాములు కావాలంటే ధర రూ. 542.40గా ఉంది.

అదే 10 గ్రాములు కావాలంటే… ధర రూ. 678 ఉంది. 100 గ్రాములు ధర రూ. 6,780 ఉండగా… కేజీ వెండి ధర… రూ.67,800గా ఉంది. వెండి వివిధ నగరాల్లో వాటి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో మార్పులను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయనే సంగతి తెలిసిందే. అందుకే నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.

ఏకంగా 9 వేల పతనమైన బంగారం ధర.. వెండి కూడా అదే రేంజ్‌లో?

బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది నిజంగానే శుభవార్త. బంగారం ధరలు గత వారం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర గత నాలుగు సెషన్ల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పతనమైంది

మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్‌లో మంగళవారం కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 57 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధరలురూ.47,405 కు చేరుకుంది. దీనికి గల కారణం డిమాండ్ రేటు తగ్గటం వల్ల ధరలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా డాలర్ రేటు కూడా బలపడటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

గత ఏడాది ఆగస్టు నెలలో బంగారం ధరలు ఆల్టైమ్ రికార్డులు సృష్టించాయి.ఎంసీఎక్స్ మార్కెట్‌‌లో బంగారం ధరలు ఆగస్టు నెలలో ఏకంగా 56,000 గరిష్ట స్థానానికి చేరుకున్నాయి గత ఏడాది ఆగస్టు నుంచి చూస్తే ఈ ఏడాది దాదాపు బంగారం ధరలు 9 వేల వరకు పడిపోయాయి.

ఇక బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోందని చెప్పవచ్చు. గత ఏడాది కిలో వెండి రూ.79,980 స్థాయికి చేరుకుంది ప్రస్తుతం కిలో వెండి ధర రూ.68,600 ఉండటంతో వెండి కూడా దాదాపు పదకొండు వేల రూపాయల వరకు తగ్గినట్లు చెప్పవచ్చు.

భారీగా తగ్గిన బంగారం ధర.. కొనేందుకు సరైన సమయమిదే..?

సంక్రాంతి పండుగ రావడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. పండుగకు ముందు బంగారం ధర భారీగా పతనమైంది. ఏకంగా రికార్డ్ స్థాయిలో బంగారం ధర 2,000 రూపాయలు తగ్గింది. ఎంసీఎక్స్ లో బంగారం ధర ఏకంగా 2,086 రూపాయలు తగ్గి 48,818 రూపాయలకు చేరడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న పరిస్థితుల వల్లే బంగారం ధర క్షీణించినట్లు తెలుస్తోంది. బంగారం కొనుగోలు చేసేవాళ్లకు ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది పెళ్లిళ్లు ప్లాన్ చేసుకున్న వాళ్లు బంగారం ఇప్పుడు కొనుగోలు చేస్తే మంచిది. వేర్వేరు కారణాల వల్ల బంగారం ధర తగ్గుతుండగా భవిష్యత్తులో బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1,833 డాలర్లుగా ఉంది. మన దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 51,800 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 47,500 రూపాయలుగా ఉంది.

ఒకవైపు బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటంతో వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. వెండి ధర ఏకంగా కిలోకు 6,1000 రూపాయల వరకు తగ్గాయి. దీంతో ప్రస్తుతం వెండి ధర 63,650 రూపాయలుగా ఉంది. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరలలో స్వల్పంగా మార్పులు ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన ప్రజలకు అందుబాటులోకి రావడం బంగారం ధరలు తగ్గడానికి కారణమవుతోంది.

ఒకటిమికి మించి కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ డ్రైరన్ జరుగుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుందని కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది.

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. బంగారం ధర రూ.63 వేలకు పెరిగే ఛాన్స్..?

ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రజలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రెండు దశాబ్దాల క్రితం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,000 రూపాయలుగా ఉంటే ప్రస్తుతం 50,000 రూపాయలుగా ఉంది. అయితే కొత్త ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా బంగారం కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉంటే ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని చెబుతున్నారు.

2021 సంవత్సరంలో బంగారం ధర ఏకంగా 63,000 రూపాయలకు చేరే అవకాశం ఉంది. రోజురోజుకు డాలర్ బలహీనపడటం, కొత్తరకం కరోనా విజృంభిస్తూ ఉండటం, ఇతర కారణాల వల్ల బంగారం ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం ధర పెరిగే అవకాశాలు ఉండటంతో పసిడిపై పెట్టుబడులు పెడితే మంచిది. పసిడి కొనాలనే ఆసక్తి ఉంటే వీలైనంత త్వరగా కొనుగోలు చేస్తే మంచిది.

ఈ ఏడాది ఆగష్టు నెలలో రికార్డు స్థయైలో 59,000 రూపాయలకు బంగారం ధర చేరగా వచ్చే ఏడాది ఈ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పసిడి ధర పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో పసిడిపై పెట్టుబడులు పెడితే మంచిది. కరోనా మహమ్మారి కారణంగా డబ్బులు ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా బంగారం కొనుగోలు చేస్తే మంచిది. అయితే బంగారం ధరపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో బంగారం ధరలు 63 వేల రూపాయల కంటే ఎక్కువగా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

బంగారం ప్రియులకు శుభవార్త.. ఏకంగా రూ. 5000 తగ్గింపు..?

దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. జ్యూవెలరీ సంస్థలు బంగారంపై భారీగా డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. దీపావళి పండుగ సమయంలో బంగారం కొనుగోలు చేస్తే మంచిదని చాలామంది భావిస్తూ ఉంటారు. అందువల్లే ఎక్కువ మొత్తంలో కాకపోయినా గ్రాము లేదా రెండు గ్రాముల బంగారాన్నైనా చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు.

పీసీ జువెలర్స్, తనిష్క్ లాంటి జ్యూవెలరీ సంస్థలు బంగారం కొనుగోలు చేసేవాళ్లకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి. గోల్డ్, డైమండ్ కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు ఆఫర్ల యొక్క ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు. వినియోగదారులకు పీసీ జువెలర్స్ సంస్థ 30,000 రూపాయల బంగారం కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. వినియోగదారులు గరిష్టంగా 5,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.

అయితే పీసీ జువెలర్స్ సంస్థ కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్లను అందిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు ఈ ఆఫర్ల ప్రయోజనాలను పొందవచ్చు. పీసీ జువెలర్స్ వెబ్ సైట్ ద్వారా లేదా సమీపంలోని స్టోర్ కు వెళ్లి ఆఫర్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. తనిస్క్ సంస్థ బంగారం, వజ్రాల మేకింగ్ చార్జీలపై డిస్కౌంట్ అందిస్తోంది.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వజ్రాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపును ఇస్తోంది. 10 శాతం చెల్లించి అడ్వాన్స్ గా బంగారం బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బంగారం కొనుగోలుకు సమానంగా వెండిని ఇస్తూ ఉండటం గమనార్హం.